Pakistan: పాత సాయానికే కొత్త ప్యాకింగ్.. టర్కీ పంపిన సాయాన్ని మళ్లీ టర్కీకే పంపిన పాకిస్తాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: టర్కీలో భారీ భూకంపం ఆ దేశాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. ఇప్పటికే అక్కడ మరణాల సంఖ్య 40 వేలను దాటింది. ఇదిలా ఉంటే ఇండియాతో పాటు ప్రపంచ దేశాలు టర్కీకి భూకంప సాయాన్ని అందిస్తున్నాయి. రెస్క్యూ నుంచి మెడిసిన్స్ వరకు అన్నింటిని సహాయంగా అందిస్తున్నాయి. అయతే టర్కీకి అత్యంత మిత్రదేశం పాకిస్తాన్ కూడా సాయం చేద్దాం అనుకుంది. అసలే పీకల్లోతు ఆర్థిక సమస్యల్లో ఉన్న పాకిస్తాన్ టర్కీకి సాయం చేసి మరోసారి పరువు తీసుకుంది.
పాత సాయానికే కొత్త ప్యాకింగ్ చేసి టర్కీకి సాయాన్ని పంపింది పాకిస్తాన్. ఇందులో ట్విస్ట్ ఏంటంటే గతేడాది వరదల కారణంగా పాకిస్తాన్ తీవ్రంగా దెబ్బతిన్న సమయంలో టర్కీ సాయం చేసింది. అయితే అప్పుడు టర్కీ పంపిన సాయానికే నీట్ గా కొత్త ప్యాకింగ్ తొడిగి సీ-130 విమానాలను టర్కీకి పంపింది పాక్. దీనిపై సొంతదేశ ప్రజలతోనే విమర్శలు ఎదుర్కొంటోంది పాక్ సర్కార్.
Also Read
- Melania Trump: మెలానియా ట్రంప్కు హత్యా బెదిరింపులు.. ఇరాన్ వీడియో కలకలం
- China: మళ్లీ కరోనా కలకలం.. చైనాలో 79 వేల కొత్త కేసులు.. భారత్కు డేంజరేనా?
- Trump: ఇరాన్ దగ్గర ఎప్పటికీ అణ్వాయుధం ఉండదు.. నెతన్యాహుతో భేటీకి ముందు ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- Trump-Netanyahu: ట్రంప్-నెతన్యాహు విభేదాలు.. దేనికోసమంటే..!
READ ALSO: Uddav Thackeray: ఎలక్షన్ కమీషన్ ప్రధాని మోదీకి బానిస.. మా “విల్లు-బాణం” దొంగిలించారు.
చివరకు బాక్సులపై ఉన్న వివరాలను కూడా మార్చకపోవడంతో పాకిస్తాన్ గుట్టు రట్టైంది. కొత్త బాక్సులపై ‘టర్కీ భూకంప బాధితులకు పాకిస్తాన్ ప్రజలు పంపుతున్న సాయం’ అని రాసి ఉంది.. అయితే ఇందులో మరో బాక్స్ ఉంది. అయితే దీనిపై ‘ పాకిస్తాన్ వరద బాధితుల కోసం టర్కీ ప్రజలు పంపిన సాయం’ అని ఉంది. దీంతో పాకిస్తాన్ సాయం విలువ బయటపడింది. ఇదిలా ఉంటే పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఈ సాయాన్ని దగ్గరుండి పర్యవేక్షించడం గమనార్హం. ఈ విషయాన్ని టర్కీ కాన్సులేట్ జనరల్, పాకిస్తాన్ విదేశాంగ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
టర్కీ భూకంపం సంభవించిన సమయంలో పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్, విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో టర్కీకి వెళ్లి తన సానుభూతిని తెలియజేయాలనుకున్నారు. అయితే ఆ సమయంతో టర్కీ వీరిని రావద్దని చెప్పింది. అయినా కూడా రెండు రోజుల క్రితం పాక్ ప్రధాని టర్కీకి వెళ్లి, టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ తన సానుభూతిని తెలియజేశారు. అయితే ఈ పర్యటనపై స్వదేశంలోనే ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు. పాక్ ప్రజలు నిత్యావసరాల కోసం ఇబ్బందులు పడుతుంటే.. మీరు మాత్రం ప్రజల డబ్బులో పర్యటను చేస్తున్నారా..? అంటూ ప్రశ్నిస్తున్నారు.
తాజావార్తలు
-
HYDRAA : హైడ్రా తీరుపై హైకోర్టు మరోసారి ఆగ్రహం
-
EPFO New Portal: PF డబ్బులు ఎక్కడున్నాయో ఇక ఈజీగా తెలుసుకోండి.. EPFO కీలక మార్పులు
-
AP Government: వారసత్వ భూములపై గుడ్న్యూస్.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
-
Melania Trump: మెలానియా ట్రంప్కు హత్యా బెదిరింపులు.. ఇరాన్ వీడియో కలకలం
-
Off The Record: మంత్రులకు ఎమ్మెల్యేల షాక్? చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో ఆధిపత్య పోరు
ట్రెండింగ్
-
Kitchen Hacks : వంటగది స్విచ్బోర్డులపై జిడ్డు, నూనె మరకలా? ఈ చిట్కాలతో 5 నిమిషాల్లో క్లీన్..!
-
Cashew Nuts Price : రూ. 1,000 జీడిపప్పు.. రూ. 300కే ఎక్కడ దొరుకుతుందో తెలుసా.?
-
Home Cleaning Hacks : టీ, కాఫీ కప్పుల మొండి మరకలా.? ఈ టిప్స్తో సులభంగా 5 నిమిషాల్లో క్లీన్ చేయండి.!
-
Clean Fridge Door Rubber: ఫ్రిజ్ డోర్ రబ్బర్కు మరకలా..? ఈ ట్రిక్తో 10 నిమిషాల్లో తలతల మెరిసిపోవాల్సిందే..!
-
రూ.5,499కే 120 అంగుళాల స్క్రీన్.. Zebronics Zeb-PixaPlay 72 Plus స్మార్ట్ ప్రొజెక్టర్ లాంచ్.!