Pakistan: ఖమేనీ మరణం.. పాక్ ఆర్మీ చీఫ్ మునీర్కు ‘‘డబుల్ ట్రబుల్’’..
Pakistan: ఇరాన్ సుప్రీంలీడర్ ఖమేనీ మరణం పాకిస్తాన్ చావుకొచ్చినట్లు ఉంది. పాకిస్తాన్ వ్యాప్తంగా ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు. యూఎస్, ఇజ్రాయిల్కు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. పాక్ ఆర్థిక రాజధాని కరాచీతో పాటు రాజధాని ఇస్లామాబాద్, లాహోర్తో సహా అన్ని ప్రధాన పట్టణాల్లో నిరసనలు వెల్లువెత్తాయి. కరాచీలో ఏకంగా యూఎస్ ఎంబసీపై నిరసనకారులు దాడికి పాల్పడ్డారు. ఎంబసీ కాంపౌండ్లోకి ప్రవేశించడానికి చూసిన మూకపై యూఎస్ సెక్యూరిటీ సిబ్బంది కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో 10 మందికి పైగా మరణించారు.
ఈ వ్యవహారం మొత్తం పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ముఖ్యంగా ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్లకు పెద్ద తలనొప్పిగా మారింది. ఇప్పుడు మునీర్ డబుల్ ట్రబుల్స్ ఎదుర్కొంటున్నారు. ఇటీవల కాలంలో షరీఫ్, మునీర్లు ఇద్దరూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో అంటకాగుతున్నారు. ట్రంప్ వీరిద్దరిపై పదే పదే ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా, యూఎస్-ఇజ్రాయిల్లు కలిసి ఖమేనీని చంపేశారని పాక్ ప్రజలు నమ్ముతున్నారు. దీంతో అమెరికాతో దగ్గరగా ఉన్న మునీర్పై పాక్ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Also Read
- Ajit Doval: యూఏఈలో అజిత్ దోవల్ పర్యటన.. దౌత్య సంబంధాలపై చర్చ
- Trump: ‘‘ఆ..చెత్తంతా చదవొద్దు’’.. జర్నలిస్ట్పై ట్రంప్ ఆగ్రహం
- Sheikh Yusuf Afridi: ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో దుండగుల కాల్పులు.. లష్కర్-ఎ-తోయిబా అగ్ర కమాండర్ షేక్ అఫ్రిది హతం
- Mojtaba Khamenei: ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మోజ్తాబా ఆరోగ్యంపై సస్పెన్స్ వీడినట్టేనా!? కుడ్యచిత్రం ఆవిష్కరణ
Read Also: Israel-Iran War: “యూఎస్ఎస్ అబ్రహం లింకన్”పై ఇరాన్ మిస్సైల్ అటాక్..
మరోవైపు అమెరికాను కాదని ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితిలో పాక్ ఉంది. ట్రంప్కు ఎదురు తిరిగితే ఏమవుతుందో షరీఫ్, మునీర్లకు తెలుసు. మరోవైపు, స్వదేశంలో విమర్శలు. ఇలా రెండు వైపులా ఒత్తిడి ఎదురవుతోంది. ఖచ్చితంగా పాకిస్తాన్ ఇప్పుడు అమెరికా ఇంట్రెస్టుల్ని రక్షించాల్సిందే. పాక్ ప్రతిపక్షాలు, ఇతర మత సంస్థలు మాత్రం మునీర్పై విమర్శలు గుప్పిస్తున్నారు.
పాక్ పరిస్థితి చూస్తే కర్ర విరగకుండా, పాము చావకుండా చేస్తుంది. ఓ వైపు నిరసనకారుల్ని శాంతింప చేసేందుకు శాంతియుత నిరసనలకు అనుమతి ఇస్తోంది. మరోవైపు, అమెరికా రాయబార కార్యాలయాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేస్తోంది. రాజధాని ఇస్లామాబాద్లో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఆ దేశ హోం మంత్రి మొహ్సిన్ నఖ్వీ స్వయంగా రోడ్లపైకి వచ్చారు. నిరసనకారుల్ని శాంతిపచేయడానికి ఉలేమాలతో సమావేశం నిర్వహించారు. అల్లర్లను పరిష్కరించాలని కోరారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : BRS ఒక చచ్చిపోయిన శవం.. దానికి భవిష్యత్తు లేదు
-
Viral: ‘మీసాల పిల్ల’ అంటూ ఎగతాళి చేశారు.. కట్ చేస్తే ప్రశంసల హోరు..
-
మరోసారి వక్రబుద్ధి బయట పెట్టిన పాకిస్తాన్.. Vaibhav Sooryavanshi బ్యాట్లో AI చిప్ అంటూ కారుకూతలు.!
-
NBK – Koratala Siva మూవీ స్టోరీ లీక్.. మాఫియా డాన్గా బాలయ్య! ఇక నందమూరి ఫ్యాన్స్కు పూనకాలే..
-
Heatwave Alert : తెలంగాణ రికార్డ్ స్థాయి ఉష్ణోగ్రతలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్..!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!