Site icon NTV Telugu

Pakistan: మరింత పేదరికంలోకి పాకిస్థాన్.. వెలుగులోకి సర్వే

Pakistan

Pakistan

దక్షిణాసియాలో అన్ని దేశాలు అభివృద్ధిలోకి పరుగులు పెడుతుంటే పాకిస్థాన్ పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. గతంలో కంటే ప్రస్తుతం మరింత పేదరికంలోకి వెళ్తోందని తాజా గణాంకాలను బట్టి అర్థమవుతోంది. పాకిస్థాన్‌లో పేదరికం 6 సంవత్సరాల్లో 7 శాతం పెరిగినట్లుగా తాజా సర్వేలను బట్టి వెల్లడవుతోంది.

అభివృద్ధిపై కాకుండా యుద్ధం కోసం విధానాలు రూపొందించే ప్రపంచంలోని కొన్ని దేశాల్లో పాకిస్థాన్ ఒకటి. రక్షణ కోసం ఖర్చు చేసే వ్యయమంతా ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిస్తుంటుంది. 2024-25లో 28.8 శాతం పాకిస్థానీయులు దారిద్ర్యరేఖకు దిగువన ఉన్నట్లుగా వెల్లడైంది. అధిక ద్రవ్యోల్బణం కారణంగా ప్రజల కొనుగోలు శక్తి గణనీయంగా తగ్గడమే ఇందుకు కారణంగా తేలింది.

ఇది కూడా చదవండి: Trump: ‘‘న్యాయమూర్తులు మూర్ఖులు.. లాప్‌‌డాగ్‌లు’’.. టారిఫ్‌లు రద్దు చేయడంపై ట్రంప్ ఆగ్రహం

పాకిస్థాన్ ప్రభుత్వం లెక్కల ప్రకారం.. 2018-19లో పేదరికం రేటు 21.9 శాతం ఉండగా.. ఇప్పుడు 6 సంవత్సరాల తర్వాత 6.9 శాతం పెరిగి 28.8 శాతానికి చేరింది. ఈ ఫలితాలు 2024-25లో నిర్వహించిన సర్వే ఆధారంగా ఉన్నాయి. పాకిస్థాన్‌లోని అన్ని ప్రావిన్సుల్లో.. ముఖ్యంగా పంజాబ్, సింధ్‌లలో పేదరికం పెరిగినట్లుగా పేర్కొంది.

గురువారం పాకిస్థాన్ వెబ్‌సైట్ ది న్యూస్‌తో ఉన్నత అధికారిక వర్గాలు మాట్లాడుతూ.. ‘‘గత ఆరు సంవత్సరాల్లో మూడు IMF స్థిరీకరణ కార్యక్రమాలు, కోవిడ్-19 ప్రభావం, కమోడిటీ సూపర్-సైకిల్, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, తక్కువ GDP వృద్ధి రేటు, రెండు సూపర్ వరదలు, గోధుమ మద్దతు ధరను వదిలివేయడం వంటి అనేక కారణాల వల్ల పాకిస్థాన్‌లో పేదరికం స్థాయి పెరిగింది.’’ అని అన్నారు.

ఇదిలా ఉంటే గత 6 సంవత్సరాల్లో భారతదేశంలో పేదరికం తగ్గింది. పేదరిక నిర్మూలనలో భారతదేశం విశేషమైన కృషి చేసింది. ప్రపంచ బ్యాంకు ప్రకారం 10 సంవత్సరాలలో 171 మిలియన్ల మందిని తీవ్ర పేదరికం నుంచి బయటకు తీసుకువచ్చినట్లు భారత ప్రభుత్వం పేర్కొంది. ఇక అన్ని రంగాల్లో భారత్ ముందుకు దూసుకుపోతుంది. వికసిత్ భారత్‌లో భాగంగా అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగడంతో పేదరికం తగ్గింది.

ఇది కూడా చదవండి: Off The Record : కవితను లైట్ తీసుకోవడమే బెటరని బీఆర్ఎస్ నేతలు డిసైడయ్యారా?

Exit mobile version