Pakistan: “సిగ్గుపడాలి”.. పాక్ ప్రధానిపై విపరీతంగా ట్రోలింగ్..కారణం ఏంటంటే..?
- పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్పై విపరీతంగా ట్రోలింగ్..
- ఒలింపిక్స్ విన్నర్కి రూ. 10 లక్షలు ఇస్తున్న పాత ఫోటో అప్లోడ్..
- జావెలిన్ త్రోలో స్వర్ణం సాధించిన అర్షద్ నదీమ్..
- సాయం చేయకుండా ‘క్రెడిట్’ తీసుకోవడంపై పాక్ ప్రజలు ఫైర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పారిస్ ఒలింపిక్స్లో పాకిస్తాన్కి చెందిన 27 ఏళ్ల అర్షద్ నదీమ్ జావలిన్ త్రోలో స్వర్ణం గెలుచుకున్నాడు. భారత్ ఎన్నో ఆశలు పెట్టుకున్న నీరజ్ చోప్రా రజతంలో సరిపెట్టుకున్నాడు. నదీమ్ స్వర్ణం సాధించడం పట్ల పాకిస్తాన్ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గురువారం రాత్రి నదీమ్ రికార్డు స్థాయిలో 92.97 మీటర్ల త్రో సాయంతో స్వర్ణం సాధించారు. నీరజ్ చోప్రా 89.45 మీటర్ల దూరం త్రో చేసి రెండోస్థానంలో నిలిచి, రజతంతో సరిపెట్టుకున్నారు. పాకిస్తాన్ తరుపున స్వర్ణం సాధించిన తొలి వ్యక్తిగా అర్షద్ నదీమ్ నిలిచారు.
అర్షద్ గెలుపుపై పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అభినందనలు తెలియజేశారు. ఎక్స్ వేదికగా అతడిని అభినందించారు. ఇదిలా ఉంటే దీనికి తోడుగా నదీమ్కి 10 లక్షల రూపాయలు ఇచ్చినట్లు చూపిస్తున్న పాత ఫోటోని షరీఫ్ ఎక్స్లో పోస్ట్ చేయడం విమర్శలకు దారితీసింది. పాకిస్తాన్ వ్యాప్తంగా నెటిజన్లు పీఎం షహబాజ్ షరీఫ్ని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. నదీమ్ గెలుపుని తన ఖాతాలో వేసుకోవడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Also Read
- Russia Vs Ukraine: 3000కిలోల బరువున్న బాంబును విసిరింది.. యుద్ధంలో గేర్ మార్చిన రష్యా!
- El Nino: 150ఏళ్లలో తొలిసారి.. మహా విధ్వంసం తప్పదు! భయపెడుతున్న సైంటిస్టుల అంచనా
- Iran Missile Attack: అమెరికా-ఇరాన్ యుద్ధం మరింత ఉధృతం.. గల్ఫ్ దేశాల్లో అమెరికా స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడులు
- India-UK: అమల్లోకి భారత్-యూకే ఒప్పందం.. ఏవేవి ధరలు తగ్గాయంటే..!
Read Also: Manish sisodia: తీహార్ జైలు నుంచి మనీష్ సిసోడియా విడుదల.. 17 నెలల తర్వాత విముక్తి
పారిస్కి వెళ్లేందుకు అర్షద్కి పాకిస్తాన్ స్పాన్సర్ చేసినప్పటికీ, ఒలింపిక్స్కి కొన్ని నెలల ముందు కొత్త జావెలిన్ కోసం ఆయన చేసిన విజ్ఞప్తిని అక్కడి ప్రభుత్వం పట్టించుకోలేదు. మార్చిలో నదీమ్ మీడియాలో మాట్లాడుతూ.. తన పాత జావెలిన్ని స్థానంలో కొత్తది కావాలని అధికారుల్ని కోరారు. అయితే, ఆ పాతదానినే 7-8 ఏళ్లు ఉపయోగించినట్లు అర్షద్ చెప్పాడు.
2020లో టోక్యో ఒలింపిక్స్ సమయంలో ప్రభుత్వం అతని ప్రయాణానికి ఎలాంటి ఆర్థిక సాయాన్ని అందించలేదు. అతని స్నేహితులు, పొరుగువారు అతడి ఖర్చుల కోసం సహకరించారు. ఈ విషయాలు వెలుగులోకి రావడంపై అక్కడి ప్రజలు పాక్ ప్రభుత్వంతో పాటు పీఎం షరీఫ్ని తూర్పారపడుతున్నారు. ‘‘ వారి మనస్తత్వం చూడండి, మీరు అతడికి రూ.1 మిలియన్ చెక్కును ఇచ్చినట్లు ఎందుకు పోస్ట్ చేశారు..?’’ అని ట్వీట్ చేశారు. ‘‘ఇది దేశానికి, అర్షద్కి అవమానం. ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అందించకుండా, ఒకప్పటి ఫోటోని పోస్ట్ చేయడంపై సిగ్గుపడాలి’’ అని మరో నెటిజన్ కామెంట్ చేశారు. ‘‘మిస్టర్ ప్రైమ్ మినిస్టర్, కనీసం గ్రేస్ఫుల్ గా అభినందించండి… ఈ యువకుడు చేసిన పని అమూల్యమైనది. నిషానే ఇంతియాజ్ కోసం అతన్ని సిఫార్సు చేయండి’’ అని మరొకరు ట్వీట్ చేశాడు.
Bravo Arshad 👏🏻
History made!
Pakistan’s 🇵🇰 first Olympic men’s javelin champion, Arshad Nadeem @ArshadOlympian1 brings home a historic #gold medal at #Paris2024 ! You've made the whole nation proud young man. pic.twitter.com/zRkG3RC3ND— Shehbaz Sharif (@CMShehbaz) August 8, 2024
తాజావార్తలు
-
Russia Vs Ukraine: 3000కిలోల బరువున్న బాంబును విసిరింది.. యుద్ధంలో గేర్ మార్చిన రష్యా!
-
UPI MDR Charges: యూపీఐ పేమెంట్లపై ఇక ఛార్జీలు?.. కేంద్రం పరిశీలిస్తున్న కొత్త ప్రతిపాదన పూర్తి వివరాలు..!
-
El Nino: 150ఏళ్లలో తొలిసారి.. మహా విధ్వంసం తప్పదు! భయపెడుతున్న సైంటిస్టుల అంచనా
-
Star Daughters Debut : కొడుకుల టాస్క్ ఫినీష్.. ఇప్పుడు కూతుళ్ల వంతు
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
ట్రెండింగ్
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!