Shehbaz Sharif: భారత్-పాక్ యుద్ధాన్ని ఆపారు.. ట్రంప్ ప్రపంచ శాంతి కాముకుడు అంటూ పాక్ ప్రధాని ప్రశంసలు
- భారత్-పాక్ యుద్ధాన్ని ఆపారు
- ట్రంప్ ప్రపంచ శాంతి కాముకుడు
- పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రశంసలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికా అధ్యక్షుడు ట్రంప్పై పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రశంసలు కురిపించారు. మే నెలలో భారత్-పాకిస్థాన్ మధ్య వినాశకరమైన యుద్ధాన్ని ట్రంప్ నిలిపివేశారని పేర్కొన్నారు. ప్రస్తుతం న్యూయార్క్లో ఐక్యరాజ్యసమితి శిఖరాగ్ర సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాలకు పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీప్ హాజరయ్యారు. ఇక యూఎన్ సమావేశాల్లో దాదాపు గంట సేపు ట్రంప్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఏడు నెలల్లో 7 యుద్ధాలు ఆపానంటూ మళ్లీ గుర్తుచేశారు.
ఇది కూడా చదవండి: Maharashtra: మహా ఘోరం.. నీట్లో 99.99 శాతం ఉత్తీర్ణత.. అడ్మిషన్ రోజే యువకుడు ఆత్మహత్య
Also Read
- Hellfire Missile Explained: అమెరికా సీక్రెట్ వెపన్.. టార్గెట్ ఫిక్స్ చేసి కొడితే శత్రు నౌకల గుండెలు పేలాల్సిందే!
- Trump Tariff Cut: ట్రంప్ కీలక నిర్ణయం.. టారిఫ్స్ 25% నుంచి 15% తగ్గింపు.. ఈ రంగాలకు ప్రయోజనం
- Operation Checkmate: ‘ఆపరేషన్ చెక్మేట్’లో 30 మంది భారతీయ ట్రక్ డ్రైవర్లు అరెస్ట్.. అమెరికా నుంచి బహిష్కరణకు సిద్ధం
- Bab el-Mandeb Strait: ప్రపంచానికి ఇంధన షాక్?.. హార్మూజ్ తర్వాత మరో కీలక జలసంధిని మూసివేస్తామని ఇరాన్ హెచ్చరిక
ట్రంప్ ప్రసంగం ముగిసిన తర్వాత పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ పొగడ్తలతో ముంచెత్తారు. మే నెలలో భారత్-పాకిస్థాన్ యుద్ధాన్ని ట్రంపే నిలిపివేశారని.. ప్రపంచ శాంతిని స్థాపించడానికి నిబద్ధత కలిగి ఉన్నారని తెలిపారు. నిజంగా ట్రంప్ ప్రపంచ శాంతి కాముకుడు అంటూ కొనియాడారు. ట్రంప్ వ్యాఖ్యలను స్వాగతిస్తూ.. కృతజ్ఞతలు తెలిపారు. మా హృదయాల లోతుల్లోంచి కృతజ్ఞతలు తెలుపుతున్నామని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Delhi Baba Horror: స్వామి చైతన్యానందపై విద్యార్థినులు లైంగిక ఆరోపణలు.. పోలీసుల దర్యాప్తు
అయితే ట్రంప్ వాదనను భారత్ తీవ్రంగా ఖండించింది. భారత్-పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణకు మూడో వ్యక్తి ప్రమేయం లేదని.. ఇరు దేశాల చర్చల తర్వాతే కాల్పుల విరమణ జరిగినట్లుగా భారత్ పేర్కొంది. కానీ పాకిస్థాన్ నాయకులు మాత్రం.. ట్రంపే కాల్పుల విరమణకు పూనుకున్నారని చెబుతున్నారు. ఆ మధ్య పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ అమెరికా పర్యటనకు వెళ్లినప్పుడు.. వైట్హౌస్లో నోబెల్ శాంతి బహుమతికి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మునీర్కు ట్రంప్ ప్రత్యేక విందు ఇచ్చారు.
రెండోసారి బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి అర్మేనియా-అజర్బైజాన్, కంబోడియా- థాయ్లాండ్, ఇజ్రాయెల్-ఇరాన్, భారతదేశం- పాకిస్థాన్, రువాండా-కాంగో డెమొక్రాటిక్ రిపబ్లిక్, ఈజిప్ట్- ఇథియోపియా, సెర్బియా -కొసావోల మధ్య వివాదాలను ఆపివేసినట్లు ట్రంప్ పదే పదే చెబుతున్నారు.
ఇదిలా ఉంటే యూఎన్లో ముస్లిం దేశాధినేతలతో ట్రంప్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ట్రంప్-షెహబాబ్ షరీఫ్ ప్రత్యేకంగా సంభాషించారు. ఇక సెప్టెంబర్ 25న వైట్హౌస్లో ట్రంప్ను పాక్ ప్రధాని కలవనున్నారు. ఈ సందర్భంగా ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించనున్నారు.
తాజావార్తలు
-
Housing Loan: అలెర్ట్..అలెర్ట్.. హోమ్ లోన్ తీసుకొని ఇల్లు కొంటున్నారా? ఆర్థిక నిపుణులు చెబుతున్న షాకింగ్ నిజం ఇదే!
-
Pawan Kalyan: ప్రెస్మీట్కు అయినా అనుమతి ఇస్తారా?.. పవన్ కల్యాణ్ సెటైర్లు!
-
Hellfire Missile Explained: అమెరికా సీక్రెట్ వెపన్.. టార్గెట్ ఫిక్స్ చేసి కొడితే శత్రు నౌకల గుండెలు పేలాల్సిందే!
-
Airtel: రూ.99కే ఎయిర్టెల్ ఎక్స్స్ట్రీమ్ ప్లే ప్రీమియం.. 20కి పైగా OTT యాప్లకు యాక్సెస్
-
Venkatesh Iyer: ట్రోలింగ్ నన్ను ప్రభావితం చేసింది.. ఆ మ్యాచ్ నా కెరీర్లో కీలక మలుపు!
ట్రెండింగ్
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్తో Itel Aqua లాంచ్.!
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!