Pakistan: పాకిస్తాన్లో మరో హిందూ బాలిక కిడ్నాప్.. కేసు నమోదుకు పోలీసుల నిరాకరణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hindu Girl Kidnapped In Pakistan: పాకిస్తాన్ లో హిందూ బాలికలు, మహిళల కిడ్నాపులు ఆగడం లేదు. బలవంతంగా హిందూ బాలికలను, యువతులను అపహరించి మతం మార్చి బానిసలుగా మార్చుకుంటున్నారు. అయినా అక్కడి ప్రభుత్వం మైనారిటీల రక్షణకు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. అవకాశం వస్తే కాశ్మీర్లో మైనారిటీ హక్కుల గురించి సిగ్గులేకుండా మాట్లాడుతోంది. తన దేశంలో మైనారిటీలో జరుగుతున్న అకృత్యాల గురించి మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.
తాజాగా సింధ్ ప్రావిన్స్ లోని హిందూ మతానికి చెందిన 13 ఏళ్ల బాలికను గత వారం అపహరించారు. మార్కెట్ నుంచి తిరిగి వస్తుండగా.. అపహరణకు గురైంది. అయితే బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. కేసు నమోదుకు పోలీసులు నిరాకరించారని బాధిత కుటుంబం ఆరోపించింది. ఈ ఘటనకు ముందు కూడా ఓ హిందూ వివాహితను అపహరించి, బలవంతంగా ఇస్లాంలోకి మార్చారు. ఓ ముస్లిం కుటుంబం సదరు హిందూ మహిళను బందీగా ఉంచుకుంటోంది. కిడ్నాపులు, బలవంతంగా పెళ్లిళ్లు చేసుకుని హిందూ స్త్రీలను ఇస్లాంలోకి మారుస్తున్నారు.
Also Read
- PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
- Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
- Epstein: ఎప్స్టీన్ కేసులో సంచలనం.. వెలుగులోకి కొత్త బాధితులు..
- PM Modi: స్వీడన్లో మోడీకి ఘన స్వాగతం.. గ్రిపెన్ ఫైటర్ జెట్ల ఎస్కార్ట్ వైరల్
Read Also: China: అవినీతిపై జిన్ పింగ్ ఉక్కుపాదం.. మాజీ మంత్రులకు ఉరిశిక్ష
పాకిస్తాన్ లో మైనారిటీలైన హిందువులు, సిక్కులు, క్రైస్తవులపై దాడులు ఆగడం లేదు. కనీసం అక్కడి ప్రభుత్వం వీటిని పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా మహిళల పరిస్థితి దిగజరారిపోతోందని ఇంటర్నేషనల్ ఫోరమ్ ఫర్ రైట్ అండ్ సెక్యూరిటీ నివేదించింది. పాకిస్థాన్ లోని ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్సులో బునెర్ జిల్లాలో ఆగస్టు 20న సిక్కు వర్గానికి చెందిన ఉపాధ్యాయురాలు దిన కౌర్ ను బలవంతంగా కిడ్నాప్ చేసి ఇస్లాంలోకి మార్చారు. ఈ ఘటనపై ప్రావిన్సులోని సిక్కువర్గం భారీ నిరసన చేపట్టింది. దినకౌర్ కిడ్నాప్ పై, బలవంతపు మతమార్పిడిపై స్థానిక పోలీసులు ఎలాంటి దర్యాప్తు చేయలేదు.
2021లో పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రావిన్సులో దాదాపుగా 6754 మంది హిందూ మహిళలు, బాలికలు అపరహరణకు గురయ్యారు. ఇందులో 1890 మంది మహిళలు అత్యాచారానికి గురయ్యారు. 3721 మంది దారుణంగా హింసించబడ్డారు. 752 మంది బాలికపై అత్యాచారం జరిగినట్లు అక్కడి మీడియా వెల్లడించింది.
తాజావార్తలు
-
KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
-
PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
-
Ragi Mixture: సాయంత్రం స్నాక్స్లోకి క్రిస్పీ ‘రాగి మిక్సర్’.. సింపుల్గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..