Pakistan: పాకిస్తాన్లో మరో హిందూ బాలిక కిడ్నాప్.. కేసు నమోదుకు పోలీసుల నిరాకరణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hindu Girl Kidnapped In Pakistan: పాకిస్తాన్ లో హిందూ బాలికలు, మహిళల కిడ్నాపులు ఆగడం లేదు. బలవంతంగా హిందూ బాలికలను, యువతులను అపహరించి మతం మార్చి బానిసలుగా మార్చుకుంటున్నారు. అయినా అక్కడి ప్రభుత్వం మైనారిటీల రక్షణకు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. అవకాశం వస్తే కాశ్మీర్లో మైనారిటీ హక్కుల గురించి సిగ్గులేకుండా మాట్లాడుతోంది. తన దేశంలో మైనారిటీలో జరుగుతున్న అకృత్యాల గురించి మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.
తాజాగా సింధ్ ప్రావిన్స్ లోని హిందూ మతానికి చెందిన 13 ఏళ్ల బాలికను గత వారం అపహరించారు. మార్కెట్ నుంచి తిరిగి వస్తుండగా.. అపహరణకు గురైంది. అయితే బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. కేసు నమోదుకు పోలీసులు నిరాకరించారని బాధిత కుటుంబం ఆరోపించింది. ఈ ఘటనకు ముందు కూడా ఓ హిందూ వివాహితను అపహరించి, బలవంతంగా ఇస్లాంలోకి మార్చారు. ఓ ముస్లిం కుటుంబం సదరు హిందూ మహిళను బందీగా ఉంచుకుంటోంది. కిడ్నాపులు, బలవంతంగా పెళ్లిళ్లు చేసుకుని హిందూ స్త్రీలను ఇస్లాంలోకి మారుస్తున్నారు.
Also Read
- Trump: నా యుద్ధ అధికారాల్ని పరిమితం చేయడం దేశద్రోహం.. డెమోక్రాట్లపై ట్రంప్ ఆగ్రహం
- Forbes Billionaires List: 4 గదుల ఫ్లాట్ నుంచి 92.8 బిలియన్ డాలర్ల సామ్రాజ్యం వరకు..! అంబానీని దాటేసిన టిక్టాక్ సృష్టికర్త..
- Mojtaba Khamenei: శత్రువుల కుట్రలపై అప్రమత్తంగా ఉండాలి.. ఇరానీయులకు మొజ్తబా ఖమేనీ సందేశం
- Pakistan: పాకిస్తాన్ను మెచ్చుకున్న ఎలాన్ మస్క్.. గ్యాంగ్రేప్ దోషులకు ఉరిశిక్షపై ప్రశంసలు
Read Also: China: అవినీతిపై జిన్ పింగ్ ఉక్కుపాదం.. మాజీ మంత్రులకు ఉరిశిక్ష
పాకిస్తాన్ లో మైనారిటీలైన హిందువులు, సిక్కులు, క్రైస్తవులపై దాడులు ఆగడం లేదు. కనీసం అక్కడి ప్రభుత్వం వీటిని పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా మహిళల పరిస్థితి దిగజరారిపోతోందని ఇంటర్నేషనల్ ఫోరమ్ ఫర్ రైట్ అండ్ సెక్యూరిటీ నివేదించింది. పాకిస్థాన్ లోని ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్సులో బునెర్ జిల్లాలో ఆగస్టు 20న సిక్కు వర్గానికి చెందిన ఉపాధ్యాయురాలు దిన కౌర్ ను బలవంతంగా కిడ్నాప్ చేసి ఇస్లాంలోకి మార్చారు. ఈ ఘటనపై ప్రావిన్సులోని సిక్కువర్గం భారీ నిరసన చేపట్టింది. దినకౌర్ కిడ్నాప్ పై, బలవంతపు మతమార్పిడిపై స్థానిక పోలీసులు ఎలాంటి దర్యాప్తు చేయలేదు.
2021లో పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రావిన్సులో దాదాపుగా 6754 మంది హిందూ మహిళలు, బాలికలు అపరహరణకు గురయ్యారు. ఇందులో 1890 మంది మహిళలు అత్యాచారానికి గురయ్యారు. 3721 మంది దారుణంగా హింసించబడ్డారు. 752 మంది బాలికపై అత్యాచారం జరిగినట్లు అక్కడి మీడియా వెల్లడించింది.
తాజావార్తలు
-
Mamata Banerjee: నా సీటు నుంచి పోటీ చేయండి.. మమతా బెనర్జీకి బంపర్ ఆఫర్..
-
Trump: నా యుద్ధ అధికారాల్ని పరిమితం చేయడం దేశద్రోహం.. డెమోక్రాట్లపై ట్రంప్ ఆగ్రహం
-
Rajya Sabha: రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ.. కీలక నేతలకు అవకాశం
-
Pawan Kalyan: పాత వీడియో షేర్ చేసిన పవన్ కల్యాణ్.. తెలంగాణపై నా వైఖరి ఇదే..!
-
Kitchen Tips: ఈ వస్తువుల్ని ఫ్రిజ్లో పెట్టొద్దు.. నెమ్మదిగా విషంగా మారుతాయి..
ట్రెండింగ్
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!