Pakistan: పాకిస్తాన్లో మరో హిందూ బాలిక కిడ్నాప్.. కేసు నమోదుకు పోలీసుల నిరాకరణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hindu Girl Kidnapped In Pakistan: పాకిస్తాన్ లో హిందూ బాలికలు, మహిళల కిడ్నాపులు ఆగడం లేదు. బలవంతంగా హిందూ బాలికలను, యువతులను అపహరించి మతం మార్చి బానిసలుగా మార్చుకుంటున్నారు. అయినా అక్కడి ప్రభుత్వం మైనారిటీల రక్షణకు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. అవకాశం వస్తే కాశ్మీర్లో మైనారిటీ హక్కుల గురించి సిగ్గులేకుండా మాట్లాడుతోంది. తన దేశంలో మైనారిటీలో జరుగుతున్న అకృత్యాల గురించి మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.
తాజాగా సింధ్ ప్రావిన్స్ లోని హిందూ మతానికి చెందిన 13 ఏళ్ల బాలికను గత వారం అపహరించారు. మార్కెట్ నుంచి తిరిగి వస్తుండగా.. అపహరణకు గురైంది. అయితే బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. కేసు నమోదుకు పోలీసులు నిరాకరించారని బాధిత కుటుంబం ఆరోపించింది. ఈ ఘటనకు ముందు కూడా ఓ హిందూ వివాహితను అపహరించి, బలవంతంగా ఇస్లాంలోకి మార్చారు. ఓ ముస్లిం కుటుంబం సదరు హిందూ మహిళను బందీగా ఉంచుకుంటోంది. కిడ్నాపులు, బలవంతంగా పెళ్లిళ్లు చేసుకుని హిందూ స్త్రీలను ఇస్లాంలోకి మారుస్తున్నారు.
Also Read
Read Also: China: అవినీతిపై జిన్ పింగ్ ఉక్కుపాదం.. మాజీ మంత్రులకు ఉరిశిక్ష
పాకిస్తాన్ లో మైనారిటీలైన హిందువులు, సిక్కులు, క్రైస్తవులపై దాడులు ఆగడం లేదు. కనీసం అక్కడి ప్రభుత్వం వీటిని పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా మహిళల పరిస్థితి దిగజరారిపోతోందని ఇంటర్నేషనల్ ఫోరమ్ ఫర్ రైట్ అండ్ సెక్యూరిటీ నివేదించింది. పాకిస్థాన్ లోని ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్సులో బునెర్ జిల్లాలో ఆగస్టు 20న సిక్కు వర్గానికి చెందిన ఉపాధ్యాయురాలు దిన కౌర్ ను బలవంతంగా కిడ్నాప్ చేసి ఇస్లాంలోకి మార్చారు. ఈ ఘటనపై ప్రావిన్సులోని సిక్కువర్గం భారీ నిరసన చేపట్టింది. దినకౌర్ కిడ్నాప్ పై, బలవంతపు మతమార్పిడిపై స్థానిక పోలీసులు ఎలాంటి దర్యాప్తు చేయలేదు.
2021లో పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రావిన్సులో దాదాపుగా 6754 మంది హిందూ మహిళలు, బాలికలు అపరహరణకు గురయ్యారు. ఇందులో 1890 మంది మహిళలు అత్యాచారానికి గురయ్యారు. 3721 మంది దారుణంగా హింసించబడ్డారు. 752 మంది బాలికపై అత్యాచారం జరిగినట్లు అక్కడి మీడియా వెల్లడించింది.
తాజావార్తలు
-
Erravalli lands : ఎర్రవల్లి భూముల లెక్క తేల్చండి.. అధికారులకు రేవంత్ డెడ్లైన్
-
PM Modi: ప్రధాని మోడీ స్నేహితుడికి ఊరట.. స్థలాన్ని వదులకున్న బీజేపీ ఎమ్మెల్యే..
-
DELHI: సిగరేట్కు అగ్గిపుల్ల ఇవ్వలేదని యువకుడి దారుణహత్య..
-
Polavaram District: ఏపీలో విషాదం.. ఒకే ప్రియుడి కోసం ఇద్దరు యువతులు ఆత్మహత్య..
-
Delhi: బ్రిక్స్ డ్యూటీలో సెక్యూరిటీ సిబ్బంది తుపాకీలతో రీల్స్.. ఒకరు సస్పెండ్
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!