Pakistan: విదేశీ మహిళలపై పాక్ ఉప ప్రధాని మనవడి గ్యాంగ్ రేప్.
- విదేశీ మహిళలపై పాకిస్తాన్లో అత్యాచారం..
- నిందితుల్లో ఒకరు పాక్ ఉప ప్రధాని మనవడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: ఇద్దరు విదేశీ మహిళల్ని నమ్మించి, పాకిస్తాన్ వచ్చిన తర్వాత కిడ్నాప్ చేసి, సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. పాక్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ మనవడు ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఇతడితో సహా నలుగురు అనుమానితుల్ని పాక్ పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టు అయిన నిందితులను మహమ్మద్ రజా దార్, హసన్ రజా, సికందర్ ఖాన్, మరియు సాజిద్ అలీగా గుర్తించారు. లాహోర్ కోర్టు శుక్రవారం నలుగురు నిందితులకు ఐదు రోజుల పోలీసు కస్టడీ విధించింది.
ప్రధాన నిందితుడు మహమ్మద్ రజా దార్, ఇతను పాకిస్తాన్ ఉప ప్రధాని ఇషాక్ దార్ బంధువుని, వరసకు మనవడు అవుతాడని సమాచారం. ఉప ప్రధానితో ఈ కేసు ముడిపడి ఉండటంతో పోలీసులు అన్ని కోణాల్లో కేసును దర్యాప్తు చేస్తున్నారు. బాధితురాల్లలో ఒకరు నెదర్లాండ్స్, మరొకరు వెనిజులాకు చెందినవారు. జూన్ 29న లాహోర్లో వీరిద్దరినీ అపహరించి సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.
Also Read
- Khamenei: ఖమేనీ అంత్యక్రియలకు హాజరైన సౌదీ అరేబియా.. అమెరికాతో చెడిందా?
- Russia-Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య మళ్లీ భీకర దాడులు.. 15 మంది మృతి
- 1991 Hijack: విమానం హైజాక్ జరిగితే, నిద్ర పోయిన పాకిస్తాన్ మాజీ ప్రధాని భుట్టో..
- Pakistan: ‘‘దౌత్యం కడుపు నింపదు’’.. పాక్ పరువు తీసిన సింగపూర్ దౌత్యవేత్త..
బాధితుల్లో ఒకరి తండ్రి స్పెయిన్ నుంచి పోలీసులకు ఫోన్ చేసి తన కుమార్తెకు ప్రమాదం గురించి తెలియజేయడంతో జూన్ 29న లాహోర్లో వీరిద్దరినీ అపహరించి సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. పోలీసులు స్పందించి ఇద్దరు మహిళలను సురక్షితంగా రక్షించారు. లాహోర్ పోలీసులు గురువారం ఐదుగురు నిందితులపై కిడ్నాప్, సామూహిక అత్యాచారం సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితులలో నలుగురిని అరెస్టు చేయగా, ఐదవ వ్యక్తి పరారీలో ఉన్నాడు. ఇతని కోసం దాడులు చేస్తున్నారు.
ఇద్దరు మహిళలు అక్టోబర్ 2025లో సింగపూర్లో ముహమ్మద్ రజా దార్ను కలిశారు. వీరిద్దరిని పాకిస్తాన్ రమ్మని ఆహ్వానించారు. ఇద్దరు మహిళల్ని క్రిప్టో కరెన్సీ వ్యాపారం కోసమని నమ్మంచి పాకిస్తాన్ రప్పించారు. రజా దార్ ఇద్దర మహిళలకు బిజినెస్ వీసాలు ఏర్పాటు చేశాడు. జూన్ 29న ఇద్దర కూడా లాహోర్ విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత, అక్కడి నుంచి కిడ్నాప్ చేసి, ఒక గదిలో బంధించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. విడుదల చేయడానికి నిందితులు డబ్బుల్ని డిమాండ్ చేసినట్లు బాధితులు ఆరోపించారు. కోర్టు విచారణ సమయంలో రజా దార్ను ప్రధాన నిందితుడిగా ఇద్దరు మహిళలు గుర్తించారు.
తాజావార్తలు
-
Pakistan: విదేశీ మహిళలపై పాక్ ఉప ప్రధాని మనవడి గ్యాంగ్ రేప్.
-
OTR: చంద్రబాబు సొంత నియోజకవర్గంలో కొత్త లొల్లి..?
-
OTR: పాలకుర్తి టిక్కెట్ గురించి అప్పుడే కాంగ్రెస్లో చర్చలు
-
Khamenei: ఖమేనీ అంత్యక్రియలకు హాజరైన సౌదీ అరేబియా.. అమెరికాతో చెడిందా?
-
Jupally Krishna Rao : రూ.8.21 లక్షల కోట్ల అప్పు.. జూపల్లి బిగ్ ఛాలెంజ్.!
ట్రెండింగ్
-
Indonesia: దొంగతనానికి వచ్చి ‘మమ్మీ’లుగా మారిపోయారు.. వైరల్ వీడియో
-
Instagram: ఇంస్టాగ్రామ్కు కేంద్రం నోటీసులు.!
-
Smoking While Drinking Tea: ‘టీ’తో పాటు ‘సిగరెట్’ తాగుతున్నారా.? ఆ రోగాలకు రెడ్ కార్పెట్ పరిచినట్లే.!
-
Home Tips : ఇంట్లోకి తేళ్లు రాకుండా ఉండాలా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
14 రోజుల బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో HUAWEI Band 11 సిరీస్ భారత్లో లాంచ్..!