India Vs Pak: రక్షణ వెబ్సైట్ పై పాక్ సైబర్ దాడి.. తిప్పికొట్టిన భారత్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దక్షిణ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన దారుణమైన ఉగ్రవాద దాడి భారత్-పాకిస్థాన్ మధ్య సంబంధాలను మరింత దిగజార్చింది. ఈ దాడిలో 26 మంది, ప్రధానంగా పర్యాటకులు, తమ ప్రాణాలను కోల్పోయారు. ఈ ఘటన భౌతిక సరిహద్దుల్లోనే కాక, డిజిటల్ రంగంలో కూడా ఉద్రిక్తతలను రగిల్చింది. పాకిస్థాన్ హ్యాకర్లు భారత రక్షణ సంస్థలను లక్ష్యంగా చేసుకుని సైబర్ దాడులకు పాల్పడుతూ, దేశ రక్షణ వ్యవ్యస్థకి సవాలు చేస్తున్నారు. అయితే, భారత సైబర్ రక్షణ ఏజెన్సీలు ఈ దాడులను దీటుగా ఎదుర్కొంటూ, దేశ భద్రతను కాపాడుతున్నాయి.
Read More: Pakisthan: పాక్ కవ్వింపు.. 120 కిమీ రేంజ్ క్షిపణి ప్రయోగించిన పాకిస్తాన్
Also Read
- Netanyahu vs Erdogan: ఇజ్రాయెల్-టర్కీ మధ్య మాటల యుద్ధం.. మధ్యప్రాచ్యంలో కొత్త టెన్షన్!
- Sri Lanka: ఈస్టర్ బాంబు దాడి వెనుక కుట్ర.. శ్రీలంక మాజీ అధ్యక్షుడు, స్పై చీఫ్పై సంచలన ఆరోపణలు
- Trump-Iran: పశ్చిమాసియా రౌడీ చనిపోయాడు.. ఇరాన్పై ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు
- Pakistan: పాకిస్తాన్పై మీర్పూరీ ముస్లింల తిరుగుబాటు..
సోమవారం జరిగిన ఒక సైబర్ దాడిలో, ‘పాకిస్థాన్ సైబర్ ఫోర్స్’ అనే హ్యాకర్ గ్రూప్ భారత సైనిక ఇంజనీరింగ్ సర్వీస్ (MES), మనోహర్ పారికర్ ఇన్స్టిట్యూట్ ఫర్ డిఫెన్స్ స్టడీస్ అండ్ అనాలిసిస్ (MP-IDSA)కు సంబంధించిన సున్నితమైన డేటాను దొంగిలించినట్లు ప్రకటించింది. ఈ హ్యాకర్లు రక్షణ సిబ్బంది వ్యక్తిగత సమాచారం, లాగిన్ వివరాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఇంతటితో ఆగక, రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే ఆర్మర్డ్ వెహికల్ నిగమ్ లిమిటెడ్ (AVNL) అధికారిక వెబ్సైట్ను కూడా హ్యాక్ చేసేందుకు ప్రయత్నించారు. ఈ దాడిలో వెబ్సైట్పై పాకిస్థాన్ జెండా, ‘అల్ ఖలీద్’ ట్యాంక్ చిత్రాలను ప్రదర్శించి, రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ఈ దాడిని గమనించిన అధికారులు, భద్రతా కారణాల రీత్యా AVNL వెబ్సైట్ను తాత్కాలికంగా మూసివేశారు.
Read More: Suhas : ఊరమాస్ లుక్ లో సుహాస్.. పోస్టర్ తోనే హైప్..
నష్టం ఎంతమేరకు జరిగిందో క్షుణ్ణంగా పరిశీలించేందుకు నిపుణులు రంగంలోకి దిగారు. ఈ సంఘటన భారత రక్షణ సంస్థలపై పాకిస్థాన్ సైబర్ దాడుల ఉద్దేశాన్ని స్పష్టంగా తెలియజేస్తోంది. ఈ సైబర్ దాడులను ఎదుర్కొనేందుకు భారత సైబర్ భద్రతా సంస్థలు నిరంతరం అప్రమత్తంగా ఉన్నాయి. ఈ సంఘటనల నేపథ్యంలో, భారత ప్రభుత్వం మరియు సైబర్ రక్షణ ఏజెన్సీలు దేశ డిజిటల్ రక్షణ వ్యవస్థలను మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నాయి. సైబర్ దాడుల నుంచి కీలకమైన సమాచారాన్ని కాపాడటంతో పాటు, భవిష్యత్తులో ఇలాంటి దాడులను నిరోధించేందుకు అత్యాధునిక సాంకేతికతను అభివృద్ధి చేస్తున్నాయి.
తాజావార్తలు
-
Rao Bahadur Teaser: ఈసారి సత్యదేవ్ కొట్టేలా ఉన్నాడు.. ‘రావు బహదూర్’ టీజర్ డేట్ ఫిక్స్.. రిలీజ్ డేట్ అప్పుడే!
-
Nandini Reddy: ‘పెద్ది’ వివాదంపై నందిని రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. బుచ్చిబాబు తప్పు ఒప్పుకున్నాడు!
-
Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
-
Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
-
PM Modi: ఎన్డీఏ రాకతో దేశ తలరాత మారిపోయింది.. 12 ఏళ్ల వేడుకలో మోడీ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!