Pakistan: నలుగురు పోలీసులను చంపిన పాక్ తాలిబాన్లు.. ఆఫ్ఘాన్ సరిహద్దుల్లో సమాంతర పాలన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్తాన్ ప్రభుత్వానికి పాక్ తాలిబాన్లు సవాల్ విసరుతూనే ఉన్నారు. బలూచిస్తాన్, ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్సుల్లో సైన్యం, పోలీసులు టార్గెట్ గా దాడులు చేస్తున్నారు. ఈ దాడులను పాక్ ప్రభుత్వం తిప్పికొట్టలేకపోతోంది. తాజాగా బలూచిస్తాన్ ప్రావిన్సుల్లో ఆదివారం జరిగిన కాల్పుల్లో నలుగురు భద్రతా సిబ్బంది మరనించారని, పాక్ తాలిబాన్లు దాడి చేశారని అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. ఝోబ్ జిల్లాలోని హైవే చెక్పాయింట్ వద్ద దాదాపు డజను మంది తాలిబాన్లు, పోలీసులు, పారామిలిటీర ఫ్రాంటియర్ కానిస్టేబుల్ అధికారులపై దాడి చేశారని, రెండు గంటల పాటు ఇరువర్గాల మధ్య కాల్పులు జరిగాయని అధికారులు తెలిపారు.
Read Also: Faria Abdullah : బీచ్ లో చీర కట్టుతో రచ్చ చేసిన ఫరియా.
Also Read
- PM Modi: అబుదాబిలో మోడీకి ప్రత్యేక గౌరవం.. ఎఫ్-16 యుద్ధ విమానాలతో రక్షణ
- Bermuda Triangle Mystery: బెర్ముడా రహస్యాన్ని ఛేదించిన శాస్త్రవేత్తలు.. అక్కడ ఏముందంటే..
- Pakistan: పాకిస్థాన్ సైన్యాన్ని వణికించిన ఉగ్రవాదులు.. సైనిక స్థావరంపై ఆత్మాహుతి దాడి.. 15 మంది మృతి!
- Donald Trump: “అమెరికా క్షీణించింది 100% నిజమే”.. జిన్పింగ్ వ్యాఖ్యలపై ట్రంప్ సంచలన పోస్ట్..!
ఈ దాడిలో ముగ్గురు పోలీసులు మరియు ఒక ఫ్రాంటియర్ కార్ప్స్ అధికారితో సహా నలుగురు భద్రతా అధికారులు మరణించారు. ఒక ఉగ్రవాది కూడా మరణించాడని, అయితే అతనిని ఇంకా గుర్తించలేదని ఝోబ్ కమిషనర్ సయీద్ ఉమ్రానీ తెెలిపారు. తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ (TTP) తామే ఈ దాడి చేసినట్లు ప్రకటించింది. 2021లో ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత పాక్ తాలిబాన్లు రెచ్చిపోతున్నారు. ఆఫ్ఘనిస్తాన్ ను అనుకుని ఉన్న పాకిస్తాన్ ప్రాంతాల్లో క్రమంగా దాడులు చేస్తున్నారు. ఈ ఏడాది జనవరి నెలలో పెషావర్ నగరంలోని పోలీస్ కాంపౌండ్ లోని ఓ మసీదుల్లో ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో 80 మందికిపైగా అధికారులు మరణించారు. పాక్ తాలిబాన్లే ఈ దాడికి పాల్పడ్డారు.
ముఖ్యంగా ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్సుల్లోని గిరిజన ప్రాంతాల్లో ప్రభుత్వానికి సమాంతరంగా తాలిబాన్ల పాలన నడుస్తోంది. ఈ ప్రాంతంలో తరుచుగా పోలీసులపై దాడులు జరుగుతున్నాయి. మరోవైపు బలూచిస్తాన్ ప్రావిన్సులో ‘బలూచ్ లిబరేషన్ ఫ్రంట్’ సైన్యం, పోలీసులు లక్ష్యంగా దాడులు చేస్తోంది. ఈ ప్రాంతంలో జరిగే సీపెక్(చైనా-పాక్ ఎకనామిక్ కారిడార్) పనులను ఎప్పటికప్పుడు బీఎల్ఎఫ్ అడ్డుకుంటోంది.
తాజావార్తలు
-
Monsoon 2026: గుడ్న్యూస్.. కేరళలోకి ఆరు రోజులు ముందుగానే మాన్సూన్ ఎంట్రీ! ఖరారు చేసిన ఐఎండీ..
-
PM Modi: అబుదాబిలో మోడీకి ప్రత్యేక గౌరవం.. ఎఫ్-16 యుద్ధ విమానాలతో రక్షణ
-
Bhojshala case: “భోజ్శాల ఒక దేవాలయం”.. మందిర్-మసీదు కేసులో హైకోర్టు సంచలన తీర్పు..
-
Keralam: మాజీ సీఎం విజయన్ను కలిసిన సతీశన్.. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చ
-
Film Chamber Meeting : ‘పెద్ది’ సినిమాకు లైన్ క్లియర్: థియేటర్ల వివాదంపై తెలుగు ఫిలిం ఛాంబర్ కీలక నిర్ణయం!
ట్రెండింగ్
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!