Pakistan: నలుగురు పోలీసులను చంపిన పాక్ తాలిబాన్లు.. ఆఫ్ఘాన్ సరిహద్దుల్లో సమాంతర పాలన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్తాన్ ప్రభుత్వానికి పాక్ తాలిబాన్లు సవాల్ విసరుతూనే ఉన్నారు. బలూచిస్తాన్, ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్సుల్లో సైన్యం, పోలీసులు టార్గెట్ గా దాడులు చేస్తున్నారు. ఈ దాడులను పాక్ ప్రభుత్వం తిప్పికొట్టలేకపోతోంది. తాజాగా బలూచిస్తాన్ ప్రావిన్సుల్లో ఆదివారం జరిగిన కాల్పుల్లో నలుగురు భద్రతా సిబ్బంది మరనించారని, పాక్ తాలిబాన్లు దాడి చేశారని అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. ఝోబ్ జిల్లాలోని హైవే చెక్పాయింట్ వద్ద దాదాపు డజను మంది తాలిబాన్లు, పోలీసులు, పారామిలిటీర ఫ్రాంటియర్ కానిస్టేబుల్ అధికారులపై దాడి చేశారని, రెండు గంటల పాటు ఇరువర్గాల మధ్య కాల్పులు జరిగాయని అధికారులు తెలిపారు.
Read Also: Faria Abdullah : బీచ్ లో చీర కట్టుతో రచ్చ చేసిన ఫరియా.
Also Read
- Hamas: హమాస్కు కొత్త బాస్.. ఖలీల్ అల్-హయ్యా చేతుల్లోకి పగ్గాలు!
- FIFA ఫైనల్లో ట్రంప్కు ఊహించని అవమానం.. అసలేం జరిగిందంటే?
- US - Iran War: ఇరాన్పై ఒత్తిడి పెంచుతున్న అమెరికా.. వరుస దాడులతో ఉద్రిక్తత.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- JD Vance Fourth Child: నాలుగోసారి తండ్రైన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్.. 150 ఏళ్ల అమెరికా చరిత్రలో అరుదైన ఘట్టం
ఈ దాడిలో ముగ్గురు పోలీసులు మరియు ఒక ఫ్రాంటియర్ కార్ప్స్ అధికారితో సహా నలుగురు భద్రతా అధికారులు మరణించారు. ఒక ఉగ్రవాది కూడా మరణించాడని, అయితే అతనిని ఇంకా గుర్తించలేదని ఝోబ్ కమిషనర్ సయీద్ ఉమ్రానీ తెెలిపారు. తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ (TTP) తామే ఈ దాడి చేసినట్లు ప్రకటించింది. 2021లో ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత పాక్ తాలిబాన్లు రెచ్చిపోతున్నారు. ఆఫ్ఘనిస్తాన్ ను అనుకుని ఉన్న పాకిస్తాన్ ప్రాంతాల్లో క్రమంగా దాడులు చేస్తున్నారు. ఈ ఏడాది జనవరి నెలలో పెషావర్ నగరంలోని పోలీస్ కాంపౌండ్ లోని ఓ మసీదుల్లో ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో 80 మందికిపైగా అధికారులు మరణించారు. పాక్ తాలిబాన్లే ఈ దాడికి పాల్పడ్డారు.
ముఖ్యంగా ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్సుల్లోని గిరిజన ప్రాంతాల్లో ప్రభుత్వానికి సమాంతరంగా తాలిబాన్ల పాలన నడుస్తోంది. ఈ ప్రాంతంలో తరుచుగా పోలీసులపై దాడులు జరుగుతున్నాయి. మరోవైపు బలూచిస్తాన్ ప్రావిన్సులో ‘బలూచ్ లిబరేషన్ ఫ్రంట్’ సైన్యం, పోలీసులు లక్ష్యంగా దాడులు చేస్తోంది. ఈ ప్రాంతంలో జరిగే సీపెక్(చైనా-పాక్ ఎకనామిక్ కారిడార్) పనులను ఎప్పటికప్పుడు బీఎల్ఎఫ్ అడ్డుకుంటోంది.
తాజావార్తలు
-
New Airport: మారబోతున్న ఉత్తర తెలంగాణ రూపురేఖలు.. రూ. 496.86 కోట్లతో ఆ విమానాశ్రయానికి ఆమోదం..
-
Naga Chaitanya : నాగార్జున నైజం బయటపెట్టిన నాగచైతన్య.. ‘లెనిన్’ సక్సెస్ మీట్లో సంచలన వ్యాఖ్యలు!
-
Indian IPL Player: బిగ్షాక్.. ఆ IPL స్టార్ ఆటగాడిని వెంటనే అరెస్ట్ చేయండి.. హైకోర్టు ఆదేశం..
-
Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్ కేసులో కొత్త మలుపు.. మద్యం మత్తే.. ఆత్మహత్యాయత్నం కాదంటున్న పోలీసులు!
-
Attack On Ship: ఉక్రెయిన్ ఒడెసా పోర్టులో కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయులు మృతి..
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!