Pakistan: నలుగురు పోలీసులను చంపిన పాక్ తాలిబాన్లు.. ఆఫ్ఘాన్ సరిహద్దుల్లో సమాంతర పాలన..
Pakistan: పాకిస్తాన్ ప్రభుత్వానికి పాక్ తాలిబాన్లు సవాల్ విసరుతూనే ఉన్నారు. బలూచిస్తాన్, ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్సుల్లో సైన్యం, పోలీసులు టార్గెట్ గా దాడులు చేస్తున్నారు. ఈ దాడులను పాక్ ప్రభుత్వం తిప్పికొట్టలేకపోతోంది. తాజాగా బలూచిస్తాన్ ప్రావిన్సుల్లో ఆదివారం జరిగిన కాల్పుల్లో నలుగురు భద్రతా సిబ్బంది మరనించారని, పాక్ తాలిబాన్లు దాడి చేశారని అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. ఝోబ్ జిల్లాలోని హైవే చెక్పాయింట్ వద్ద దాదాపు డజను మంది తాలిబాన్లు, పోలీసులు, పారామిలిటీర ఫ్రాంటియర్ కానిస్టేబుల్ అధికారులపై దాడి చేశారని, రెండు గంటల పాటు ఇరువర్గాల మధ్య కాల్పులు జరిగాయని అధికారులు తెలిపారు.
Read Also: Faria Abdullah : బీచ్ లో చీర కట్టుతో రచ్చ చేసిన ఫరియా.
Also Read
- Maulana Salman Azhar: భారత్ శత్రువులకు పాక్ గడ్డపై నూకలు చెల్లాయా? జైష్ టాప్ కమాండర్ సల్మాన్ అజార్ ఖతం!
- UAE OPEC Exit: యూఏఈ ఒపెక్ ఎగ్జిట్.. భారత్కు లాభం, పాకిస్తాన్కు నష్టం..
- Donald Trump: ట్రంప్ను రోస్ట్ చేసిన కింగ్ చార్లెస్.. మేము లేకపోతే మీరు ఫ్రెంచ్ మాట్లాడేవారంటూ ఎగతాళి
- Ali Pervaiz Malik: పాక్ మంత్రి షాకింగ్ వ్యాఖ్యలు.. మా దగ్గర ఒక్క రోజుకు కూడా పెట్రోల్ లేదు.. భారత్తో మనం పోల్చుకోలేము
ఈ దాడిలో ముగ్గురు పోలీసులు మరియు ఒక ఫ్రాంటియర్ కార్ప్స్ అధికారితో సహా నలుగురు భద్రతా అధికారులు మరణించారు. ఒక ఉగ్రవాది కూడా మరణించాడని, అయితే అతనిని ఇంకా గుర్తించలేదని ఝోబ్ కమిషనర్ సయీద్ ఉమ్రానీ తెెలిపారు. తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ (TTP) తామే ఈ దాడి చేసినట్లు ప్రకటించింది. 2021లో ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత పాక్ తాలిబాన్లు రెచ్చిపోతున్నారు. ఆఫ్ఘనిస్తాన్ ను అనుకుని ఉన్న పాకిస్తాన్ ప్రాంతాల్లో క్రమంగా దాడులు చేస్తున్నారు. ఈ ఏడాది జనవరి నెలలో పెషావర్ నగరంలోని పోలీస్ కాంపౌండ్ లోని ఓ మసీదుల్లో ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో 80 మందికిపైగా అధికారులు మరణించారు. పాక్ తాలిబాన్లే ఈ దాడికి పాల్పడ్డారు.
ముఖ్యంగా ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్సుల్లోని గిరిజన ప్రాంతాల్లో ప్రభుత్వానికి సమాంతరంగా తాలిబాన్ల పాలన నడుస్తోంది. ఈ ప్రాంతంలో తరుచుగా పోలీసులపై దాడులు జరుగుతున్నాయి. మరోవైపు బలూచిస్తాన్ ప్రావిన్సులో ‘బలూచ్ లిబరేషన్ ఫ్రంట్’ సైన్యం, పోలీసులు లక్ష్యంగా దాడులు చేస్తోంది. ఈ ప్రాంతంలో జరిగే సీపెక్(చైనా-పాక్ ఎకనామిక్ కారిడార్) పనులను ఎప్పటికప్పుడు బీఎల్ఎఫ్ అడ్డుకుంటోంది.
తాజావార్తలు
-
Cigarette Price Hike: సిగరెట్ లవర్స్కు బ్యాడ్ న్యూస్.. మే నెలలో పెరగనున్న సిగరెట్ ధరలు?
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీపై రూ.10 కోట్లు..! ఆ జట్టు కొనుగోలు చేసే అవకాశం..
-
Rohit Sharma గాయంపై కీలక అప్డేట్.. కెప్టెన్ Hardik Pandya ఏమన్నాడంటే.!
-
Measles Outbreak : బంగ్లాదేశ్ లో విజృంభిస్తున్న మీజిల్స్ మహమ్మారి..భారత్ కి ముప్పు తప్పదా ?
-
Babar Azam: ఒక్క సెంచరీతో.. విరాట్ కోహ్లీ, అభిషేక్ శర్మ సరసన నిలిచిన బాబర్ ఆజమ్..
ట్రెండింగ్
-
Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
-
Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్లో బంధువులు!
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?