Lebanon Pagers Explosion: లెబనాన్లో విధ్వంసం సృష్టించిన పేజర్ పేలుళ్లు.. తొమ్మిది మంది మృతి..!
- లెబనాన్లో భారీ విధ్వంసం..
- పేజర్ల పేలుళ్లలో తొమ్మిది మంది మృతి.. 2800 మందికి గాయాలు..
- ఈ దాడి వెనక ఇజ్రాయెల్ హస్తం ఉంది: హెజ్బొల్లా సంస్థ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lebanon Pagers Explosion: లెబనాన్, సిరియాలపై మంగళవారం అనూహ్య మెరుపు దాడి జరిగింది. రెండు దేశాల్లో ఒకేసారి వందల పేజర్లు పేలుళ్లు జరిగాయి. ఫలితంగా 9 మంది మరణించారు. 2,750 మందికి పైగా గాయపడ్డారు. ఒక్క సిరియాలోనే ఏడుగురు మృతి చెందగా.. గాయపడిన వారిలో లెబనాన్లోని ఇరాన్ రాయబారితో పాటు హెజ్బొల్లా కీలక నేతలు కూడా ఉన్నారు. ఈ అనూహ్య దాడి వెనుక ఇజ్రాయెల్ హస్తముందనే ఆరోపణలు పెద్దఎత్తున వస్తున్నాయి. పేజర్లు పేలిన ఘటనలో ఇద్దరు హెజ్బొల్లా సభ్యులు మృతి చెందగా.. ఒక ఎంపీ కుమారుడూ కూడా ఉన్నారు. అలాగే, ఇరాన్ రాయబారి భద్రతా సిబ్బంది దగ్గర ఉన్న పేజర్ పేలిపోయింది. తొలుత పేజర్లు వేడెక్కి.. ఆ తర్వాత పేలుళ్లు సంబంవించాయి. ఈ ఘటనలో హెజ్బొల్లా చీఫ్ నస్రుల్లాకు ఎలాంటి ప్రమాదం జరగలేదన్నారు.
Read Also: Astrology: సెప్టెంబర్ 18, బుధవారం దినఫలాలు
Also Read
- PM Modi-Putin Talks: నేడు మోడీ-పుతిన్ భేటీ.. ఎస్-400, యూపీఐ, చమురు, ఇంధనంపై కీలక చర్చలు
- Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
- North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
- Kim Jong Un: కిమ్ను కలవడం అంత ఈజీ కాదు.. నెల రోజుల ట్రైనింగ్, కఠినమైన రూల్స్
ఇక, ఈ పేజర్ల పేలుళ్లకు పాల్పడింది ఇజ్రాయెల్ పనేనని హెజ్బొల్లా ఆరోపణలు చేస్తోంది. పేజర్ల పేలుళ్లతో లెబనాన్లోని ఆసుపత్రులకు వేల మంది బాధితులు వస్తుండటంతో సహాయక చర్యలు చేపట్టారు. ఇది అతి పెద్ద భద్రతా వైఫల్యంగా హెజ్బొల్లా వెల్లడించింది. ఇజ్రాయెల్కు శిక్ష తప్పదని వార్నింగ్ ఇచ్చింది. ఈ క్రిమినల్ చర్యకు ఇజ్రాయెల్ బాధ్యత వహించాల్సిందేనని స్పష్టం చేసింది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి కంప్లైంట్ చేస్తామని లెబనాన్ తెలిపింది. సెల్ఫోన్లు రాక ముందు సమాచారం అందజేయడానికి పేజర్లను వినియోగించేవారు.
Read Also: Ganesh Immersion : గ్రేటర్ పరిధిలో లక్ష 2 వేల 510 వినాయకుల నిమజ్జనం
కాగా, పేజర్ల విస్ఫోటంతో హెజ్బొల్లా నాయకులు, సలహాదారులు తీవ్రంగా గాయపడటం, దాదాపుగా అన్ని పేజర్లు ఒకేసారి పేలడాన్ని బట్టి ఇది సమన్వయంతో చేసిన దాడేనన్న అనుమానాలు వ్యక్తం చేస్తుంది. లెబనాన్. రహస్య ఆపరేషన్లలో దిట్ట అయిన ఇజ్రాయెల్ గూఢచర్య సంస్థలే ఈ పని చేసి ఉంటాయని డౌట్ పడుతున్నాయి. లెబనాన్లో హెజ్బొల్లా సొంత కమ్యూనికేషన్ నెట్వర్క్ను ఏర్పాటు చేసుకుంది. ఈ టెలికం నెట్వర్క్లోకి ఇజ్రాయెల్ చొరబడి ఉంటుందని అనుమానిస్తుంది. గత అక్టోబరు నుంచి లక్షిత దాడుల్లో హెజ్బొల్లా కమాండర్లు అనేక మంది మరణించడమే ఇందుకు కారణం. తాజా ఘటనపై ఇజ్రాయెల్ ఇప్పటి వరకు ఇంకా రియాక్ట్ కాలేదు. ఈ దాడి ఎలా జరిగి ఉంటుందన్న దానిపై భిన్న వాదనలు ప్రచారం అవుతున్నాయి.
తాజావార్తలు
-
GLOF Risk in India: నేపాల్ వరదల తర్వాత భారత్కు భారీ ముప్పు.. హిమాలయాల్లో 200 ‘జల బాంబులు’?
-
Jailer 2: రజనీకాంత్ ‘జైలర్ 2’కు టాలీవుడ్ సినిమాల సెగ.. రిలీజ్ డేట్ మారుతుందా?
-
Hockey World Cup 2026 విజేతగా జర్మనీ.. స్పెయిన్పై 1-0తో విజయం.!
-
ICC Decision: శ్రీలంకకు ఐసీసీ షాక్.. మహిళల ఛాంపియన్స్ ట్రోఫీ 2027 ఆతిథ్య హక్కులు రద్దు, కారణం ఇదే
-
Sai Abhyankkar : హీరో కావాలన్న కోరికను ఇండి ఆల్బమ్స్తో తీర్చుకుంటున్నాడా..?
ట్రెండింగ్
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!