Luna-25: చంద్రయాన్-3, అంతరిక్ష రంగంలో భారత కీర్తిపతాకాన్ని రెపరెపలాడించింది. ఎవరికి సాధ్యం కాని చంద్రుడి దక్షిణ ధృవంపై విక్రమ్ ల్యాండర్ని విజయవంతంగా దించింది. చంద్రుడిపై ఇలా ల్యాండర్, రోవర్లని దించిన నాలుగో దేశంగా, దక్షిణ ధృవంపై దిగిన మొదటి దేశంగా కీర్తిగడించింది. అంతకుముందు అమెరికా, రష్యా, చైనాలు మాత్రమే చంద్రుడిపై ల్యాండర్లను దించాయి. అయితే చంద్రయాన్-3 సమయంలో రష్యా తన లూనా-25 స్పెస్క్రాఫ్టుని, చంద్రయాన్ కన్నా ముందు దక్షిణ ధృవంపై దించాలని విఫలమైంది. దీని తర్వాత నాలుగు రోజులకు చంద్రయాన్-3 జాబిల్లిని చేరింది.
లూనా-25 చంద్రుడిపై కుప్పకూలింది. అన్ని అనుకున్నట్లు జరిగితే చంద్రయాన్ కన్నా ముందే లూనా-25 జాబిల్లిని చేరేది. అయితే ఇలా కుప్పకూలడానికి కారణాలను రష్యా అంతరిక్ష సంస్థ రోస్కాస్మోస్ వెల్లడించింది. ఆగస్టు 19న లూనా-25 అదుపుతప్పి చంద్రుడి ఉపరితలంపై కుప్పకూలింది. అంతరిక్ష నౌకలో ఏర్పడిన సాంకేతిక లోపమే ఇందుకు కారణమని వెల్లడించింది.
Read Also: Haryana: అమ్మాయిల వేధింపులు.. 9వ తరగతి బాలుడు ఆత్మహత్య..
ఆన్-బోర్డ్ కంట్రోల్ యూనిట్లో లోపం ఏర్పడిందని, కంట్రోల్ యూనిట్ ప్రొపల్షన్ యూనిట్ను సరైన సమయంలో నిలిపేయలేదని, దీని వల్ల లూనా-25 చంద్రుడి వైపు వేగంగా దూసుకెళ్తున్న సమయంలో అనుకున్న దాని కన్నా ఒకటిన్నర రెట్లు ఎక్కువ సేపు ఇంజన్లు మండాయని తెలిపింది.
చంద్రుడిపై స్పేస్ క్రాఫ్ట్ దిగేందుకు వృత్తాకార కక్ష్యను, దీర్ఘవృత్తాకార కక్ష్యలోకి బదిలీ చేసేసమయంలో లూనా-25లోని ప్రొపెల్షన్ సిస్టమ్ 84 సెకన్లకు బదులుగా 125 సెకన్ల పాటు పనిచేసిందని రోస్ కాస్మోస్ వెల్లడించింది. తప్పుడు డేటా కమాండ్ కారణంగా ఆన్ బోర్డు కంట్రోల్ సిస్టమ్ కోణీయ వేగాన్ని కొలిచే యూనిట్ పనిచేయకపోవడంతో క్రాష్ జరిగిందని గుర్తించింది. దీంతో అవసరమై నమయంలో ఇంజన్లు ఆఫ్ కాలేదని, ఈ కారణంగా లూనా-25 కుప్పకూలిందని తెలిపింది.