Earthquake : మళ్లీ ఆఫ్ఘాన్లో భూకంపం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇటీవల భారత పొరుగు దేశాలైన పాకిస్థాన్, ఆప్ఘానిస్థాన్లలో భారీ భూకంప సంభించిన విషయం తెలసిందే. ఈ భూకంప ధాటికి వెయ్యిమందికి పైగా మృతి చెందారు. అంతేకాకుండా సుమారు పదిహేను వందల మందికి పైగా గాయపడ్డారు. శిథిలాల కింద ఎంతమంది సజీవ సమాధి అయ్యారన్నది ఇంకా తెలియదు. అయితే.. ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో.. సహాయక చర్యలు కూడా ముందుకు సాగలేకపోతున్నాయని అక్కడి అధికారులు అంటున్నారు. భూకంపం ఎఫెక్ట్కు ఖోస్ట్ ప్రావిన్స్ స్పెరా జిల్లాలో ఎక్కువ భాగం దెబ్బతిన్నట్లు అధికారులు గుర్తించారు. అలాగే పాక్టికా ప్రావిన్స్లోని బర్మలా, జిరుక్, నాకా, గియాన్ జిల్లాల్లోని ఊర్లపై భూకంప ప్రభావం అధికంగా ఉంది.
గియాన్ జిల్లాలో ఘోరమైన ప్రాణ నష్టం వాటిల్లింది. ఇదిలా ఉంటే.. గురువారం ఉదయం మళ్లీ అఫ్గనిస్థాన్లో భూకంపం చోటు చేసుకుంది. భారత కాలమానం ప్రకారం.. గురువారం ఉదయం 7 గంటల సమయంలో ఫజ్యాబాద్కు 76 కిలోమీటర్ల దూరంలో.. 163 కిలోమీటర్ల లోతున భూకంపం సంభించినట్లు అధికారులు గుర్తించారు. ఈ భూకంపం ప్రభావం రిక్టర్ స్కేల్పై 4.3గా నమోదైంది. ప్రకంపనలతో వణికిపోయిన ప్రజలు.. వీధుల్లోకి పరుగులు తీశారు. అయితే నష్టం గురించి వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read
- Hantavirus Outbreak: హంటావైరస్ కలకలం.. లక్షణాలు, చికిత్సపై WHO కీలక హెచ్చరిక.. కొత్త మహమ్మారిగా మారుతుందా..?
- Russia-Ukraine War: నాలుగేళ్లుగా సాగుతున్న ఉక్రెయిన్ యుద్ధంపై.. రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక ప్రకటన
- UFO Files: ఏలియన్ల గుట్టు రట్టు.. చరిత్రలో తొలిసారిగా 'UFO' రహస్య పత్రాలను బయటపెట్టిన అమెరికా!
- Kim Jong Un: కిమ్ జోంగ్ ఉన్ హత్యకు గురైతే, ప్రళయమే.. ఉత్తరకొరియా సంచలన నిర్ణయం..
తాజావార్తలు
-
CM Vijay: తమిళనాడు సీఎంగా దళపతి విజయ్ .. ‘జన నాయగన్’ సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
-
Hantavirus Outbreak: హంటావైరస్ కలకలం.. లక్షణాలు, చికిత్సపై WHO కీలక హెచ్చరిక.. కొత్త మహమ్మారిగా మారుతుందా..?
-
PM Modi: పరాన్నజీవి కాంగ్రెస్, డీఎంకేను వెన్నుపోటు పొడిచింది.. ప్రధాని మోడీ ఫైర్..
-
CSK vs LSG: నేడు చెపాక్లో అసలైన యుద్ధం.. ఈ మ్యాచ్లో అయిన ధోనీ ఉంటాడా?
-
IPL 2026: ఆర్సీబీకి తలనొప్పిగా మారిన ఇద్దరు స్టార్ ప్లేయర్లు.. కోట్లు ఖర్చు చేసినా ఫలితం శూన్యం..!