North Korea: 3 ఏళ్లుగా కోవిడ్ ఐసోలేషన్లో నార్త్ కొరియా.. ఆకలితో చనిపోతున్న ప్రజలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
North Korea: కిమ్ జాంగ్ ఉన్ నియంత పాలనలో ఉత్తర కొరియా ప్రజలు దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. మూడేళ్లుగా ఆ దేశం పూర్తిగా ఐసోలేషన్ లో ఉంది. సరిహద్దులను మూసేసి, ఇతర దేశాలతో సంబంధాలను తెంచుకుంది. కోవిడ్ భయంతో కిమ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే ప్రస్తుతం ఆ దేశంలో పరిస్థితులు దుర్భరంగా మారాయి. కోవిడ్ వల్ల చనిపోవడం కన్నా ఆకలిలో ప్రజలు చనిపోతున్నట్లు బీబీసీ వెల్లడించింది.
2020లో కోవిడ్ నేపథ్యంలో నార్త్ కొరియా తన సరిహద్దుల్ని మూసేసింది. ఆ తరువాత నుంచి ఇతర దేశాల నుంచి వచ్చే ఆహార సరఫరా నిలిచిపోయింది. దీంతో 1990లో ఏర్పడిన భయంకరమైన ఆహార సంక్షోభం తర్వాత ఇప్పుడు మరోసారి ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. ఈ విషయాలను అక్కడి కొంతమంది ప్రజలు రహస్యంగా బీబీసీకి వెల్లడించారు. ముఖ్యంగా చైనా నుంచి వచ్చే ఆహార పదార్థాల సరఫరా ఆగిపోయింది. ఆహారం పండించేందుకు ఎరువులు, యంత్రాలు ఉత్తర కొరియాకు రావడం నిలిచిపోయింది. క్షిపణి ప్రయోగాలకు మిలియన్ల డబ్బును వెచ్చిస్తున్న నార్త్ కొరియా, తన 2.6 కోట్ల మంది ప్రజలకు ఆహారాన్ని అందించలేకపోతోంది.
Also Read
- Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
- Lufthansa Boeing 787 : గేట్ వద్దే కుప్పకూలిన బోయింగ్ 787 విమానం.. వైరల్ వీడియోలతో కలకలం
- Trump: నా యుద్ధ అధికారాల్ని పరిమితం చేయడం దేశద్రోహం.. డెమోక్రాట్లపై ట్రంప్ ఆగ్రహం
- Forbes Billionaires List: 4 గదుల ఫ్లాట్ నుంచి 92.8 బిలియన్ డాలర్ల సామ్రాజ్యం వరకు..! అంబానీని దాటేసిన టిక్టాక్ సృష్టికర్త..
Read Also: Priya Prakash Varrier Hot Pics: ప్రియా ప్రకాష్ వారియర్ పరువాల విందు.. సైడ్ యాంగిల్స్తో చంపేస్తోంది!
రాజధాని ప్యాంగ్యాంగ్ లో ఒక మహిళ ఇంట్లో ఆకలితో ముగ్గురు మరణించినట్లు బీబీసీకి అక్కడి వ్యక్తుల చెప్పారు. ‘‘మేము వారికి నీరు అందించాలని తలుపు తట్టాము.. కానీ ఎవరూ సమాధానం ఇవ్వలేదు, అధికారులు లోపలికి వెళ్లి చూస్తే చనిపోయినట్లు తెలిసింది’’ అని చెప్పారు. చైనా సరిహద్దు ప్రాంతంలో నివసించే మరో నిర్మాణ కార్మికుడు మాట్లాడుతూ.. ఆహార సరఫరా చాలా తక్కువగా ఉందని, తమ గ్రామంలో ఆకలితో ఇప్పటికే ఐదుగురు మరణించారని వెల్లడించాడు. నేను కోవిడ్ తో మరణిస్తానని భయపడ్డాను, కానీ ఆకలితో చనిపోతానేమో అనే ఆందోళన మొదలైనట్లు బీబీసీకి తెలిపాడు. 1990లో నార్త్ కొరియాలో ఏర్పడిన కరువు 30 లక్షల మందిని చంపింది. సాధారణ, మధ్య తరగతి ప్రజలు ఆకలితో చనిపోవడం ఆందోళనకరంగా ఉందని ఉత్తర కొరియా ఆర్థికవేత్త పీటర్ వార్డ్ అన్నారు.
తాజావార్తలు
-
Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
-
Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్గా ‘పెద్ది’?
-
Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!