North Korea: 3 ఏళ్లుగా కోవిడ్ ఐసోలేషన్లో నార్త్ కొరియా.. ఆకలితో చనిపోతున్న ప్రజలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
North Korea: కిమ్ జాంగ్ ఉన్ నియంత పాలనలో ఉత్తర కొరియా ప్రజలు దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. మూడేళ్లుగా ఆ దేశం పూర్తిగా ఐసోలేషన్ లో ఉంది. సరిహద్దులను మూసేసి, ఇతర దేశాలతో సంబంధాలను తెంచుకుంది. కోవిడ్ భయంతో కిమ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే ప్రస్తుతం ఆ దేశంలో పరిస్థితులు దుర్భరంగా మారాయి. కోవిడ్ వల్ల చనిపోవడం కన్నా ఆకలిలో ప్రజలు చనిపోతున్నట్లు బీబీసీ వెల్లడించింది.
2020లో కోవిడ్ నేపథ్యంలో నార్త్ కొరియా తన సరిహద్దుల్ని మూసేసింది. ఆ తరువాత నుంచి ఇతర దేశాల నుంచి వచ్చే ఆహార సరఫరా నిలిచిపోయింది. దీంతో 1990లో ఏర్పడిన భయంకరమైన ఆహార సంక్షోభం తర్వాత ఇప్పుడు మరోసారి ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. ఈ విషయాలను అక్కడి కొంతమంది ప్రజలు రహస్యంగా బీబీసీకి వెల్లడించారు. ముఖ్యంగా చైనా నుంచి వచ్చే ఆహార పదార్థాల సరఫరా ఆగిపోయింది. ఆహారం పండించేందుకు ఎరువులు, యంత్రాలు ఉత్తర కొరియాకు రావడం నిలిచిపోయింది. క్షిపణి ప్రయోగాలకు మిలియన్ల డబ్బును వెచ్చిస్తున్న నార్త్ కొరియా, తన 2.6 కోట్ల మంది ప్రజలకు ఆహారాన్ని అందించలేకపోతోంది.
Also Read
- Iran: భారీ ఆదాయం సమకూర్చుకునే పనిలో ఇరాన్.. వాటిపై ‘డిజిటల్ టాక్స్’ వసూలుకు ప్లాన్..
- Pakistan: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ను గద్దె దించేందుకు అమెరికా కుట్ర.. బయటపడ్డ సంచలన రహస్యాలు!
- Donald Trump: త్వరగా నిర్ణయం తీసుకోండి, లేకపోతే మీకు ఏమీ మిగలదు.. ఇరాన్ను మళ్లీ హెచ్చరించిన ట్రంప్
- Mexico Gun Attack: రక్తసిక్తమైన మెక్సికో.. ప్యూబ్లాలో విచక్షణారహితంగా కాల్పులు.. చిన్నారితో సహా 10 మంది మృతి!
Read Also: Priya Prakash Varrier Hot Pics: ప్రియా ప్రకాష్ వారియర్ పరువాల విందు.. సైడ్ యాంగిల్స్తో చంపేస్తోంది!
రాజధాని ప్యాంగ్యాంగ్ లో ఒక మహిళ ఇంట్లో ఆకలితో ముగ్గురు మరణించినట్లు బీబీసీకి అక్కడి వ్యక్తుల చెప్పారు. ‘‘మేము వారికి నీరు అందించాలని తలుపు తట్టాము.. కానీ ఎవరూ సమాధానం ఇవ్వలేదు, అధికారులు లోపలికి వెళ్లి చూస్తే చనిపోయినట్లు తెలిసింది’’ అని చెప్పారు. చైనా సరిహద్దు ప్రాంతంలో నివసించే మరో నిర్మాణ కార్మికుడు మాట్లాడుతూ.. ఆహార సరఫరా చాలా తక్కువగా ఉందని, తమ గ్రామంలో ఆకలితో ఇప్పటికే ఐదుగురు మరణించారని వెల్లడించాడు. నేను కోవిడ్ తో మరణిస్తానని భయపడ్డాను, కానీ ఆకలితో చనిపోతానేమో అనే ఆందోళన మొదలైనట్లు బీబీసీకి తెలిపాడు. 1990లో నార్త్ కొరియాలో ఏర్పడిన కరువు 30 లక్షల మందిని చంపింది. సాధారణ, మధ్య తరగతి ప్రజలు ఆకలితో చనిపోవడం ఆందోళనకరంగా ఉందని ఉత్తర కొరియా ఆర్థికవేత్త పీటర్ వార్డ్ అన్నారు.
తాజావార్తలు
-
Redmi K100: 200MP కెమెరాతో రెడ్మీ K100 చవకైన స్మార్ట్ఫోన్.. 10,000mAh బ్యాటరీ!
-
IPL 2026: ఐపీఎల్ 2026లో మజా లేదు.. ఆ సమరం ఎక్కడ అంటున్న ఫాన్స్?
-
GR Gopinath: రూపాయికే విమాన టికెట్.. సామాన్యుడి విమాన కల నిజం చేసిన వ్యక్తి కథ ఇది! ఆయన ఎవరో తెలుసా?
-
AP Heatwave Alert: ఏపీలో ఎండల తీవ్రత.. వారం రోజుల పాటు హీట్వేవ్స్ హెచ్చరిక
-
Hyderabad Traffic Alert: ఉప్పల్ రింగ్ రోడ్డు క్లోజ్.. నగర, వరంగల్-హైదరాబాద్ ప్రయాణికులకు రూట్ మ్యాప్ ఇదే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..