Ranil Wickremesinghe: ఆర్థిక వ్యవస్థే లేనప్పుడు.. సంస్కరణలతో ఏం ప్రయోజనం?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
No Point In Economic Reforms When We Dont Have Economy Says Landan President: ఆహార, ఆర్థిక సంక్షోభాలతో శ్రీలంక ఎలా అస్తవ్యస్తమైందో అందరికీ తెలుసు. ధరలు ఒక్కసారిగా ఆకాశాన్నంటడంతో.. జనాలు రోడ్లు మీదకి వచ్చి, రాజకీయ నాయకులపై తిరుగుబాటు చేశారు. ఈ దెబ్బకు అక్కడ రాజకీయ అస్థిరత ఏర్పడింది. మే నెలలో అప్పటి దేశ అధ్యక్షడు రాజపక్స దేశం విడిచి పారిపోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఆ తర్వాత రణిల్ విక్రమసింఘే అధ్యక్షుడిగా బాధ్యలు చేపట్టినా.. పరిస్థితులు వెంటనే చక్కదిద్దుకోలేదు. అయితే.. ఇటీవలే రాజకీయ సుస్థిరత నెలకొంది. కానీ.. దేశ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. దీంతో ఆ దేశంలో ఆర్థిక సంస్కరణలు చేపట్టాలనే వాదన మొదలైంది.
ఈ నేపథ్యంలోనే అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే షాకింగ్ కామెంట్స్ చేశారు. దేశంలో ఆర్థిక వ్యవస్థే లేనప్పుడు.. సంస్కరణలతో ఏం ప్రయోజనమని బాంబ్ పేల్చారు. దాని బదులు నూతన ఆర్థిక వ్యవస్థను తయారు చేస్తామని పేర్కొన్నారు. శ్రీలంక ఆర్థిక సదస్సు 2022లో ఆయన మాట్లాడుతూ.. కాలం చెల్లిన ప్రస్తుత ఆర్థిక విధానాలతో ఆర్థిక వ్యవస్థను సరిదిద్దడం ఏమాత్రం సాధ్యం కాదన్నారు. దేశ ఆర్థిక పరిస్థితులు మరింత క్షీణించాయన్న ఆయన.. ప్రస్తుత పరిస్థితులకు ఆర్థిక సంస్కరణలు చేయడం విరుగుడు కాదని తేల్చి చెప్పారు. సంస్కరణలు చేపట్టినా ప్రయోజనం ఉండదని.. బలహీనమైన ప్రస్తుత విధానాలతో ముందుకెళ్తే, అవి మళ్లీ దెబ్బతీస్తాయని పేర్కొన్నారు. అందుకే.. కొత్త ఆర్థిక వ్యవస్థకు రూపకల్పన చేస్తామన్నారు. ఇందుకోసం.. భాగస్వామ్య పక్షాలతో సంప్రదింపులు జరుపుతున్నామని ఆయన అన్నారు.
Also Read
- Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
- Bill Gates: నేనెవరినీ వేధించలేదు.. ఎప్స్టీన్ కేసు విచారణలో బిల్గేట్స్ కీలక వ్యాఖ్యలు
- Iran-US: బెదిరింపులకు భయపడం.. ట్రంప్కు ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్ కౌంటర్
- Netanyahu vs Erdogan: ఇజ్రాయెల్-టర్కీ మధ్య మాటల యుద్ధం.. మధ్యప్రాచ్యంలో కొత్త టెన్షన్!
కాగా.. స్వాతంత్ర తర్వాత శ్రీలంక ఎన్నడూ లేనంత ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈ తరుణంలోనే ఆ దేశాన్ని విదేశీ మారక నిల్వల కొరత వేధిస్తోంది. ఈ దెబ్బకు దివాలా అంచుకు చేరిన ఆ దేశం.. అంతర్జాతీయ రుణాలను చెల్లించలేమని ఏప్రిల్లో చేతులెత్తేసింది. అది నిత్యవసర వస్తువుల దిగుమతులపై తీవ్ర ప్రభావం చూపడంతో.. శ్రీలంక పౌరులకు ఇంధనం, ఔషధాలు, ఎరువుల కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!