Pig kidney transplant: పంది కిడ్నీ మార్పిడి, మెకానికల్ గుండె కలిగిన తొలి మహిళ మృతి..
- పంది కిడ్నీ- మెకానికల్ గుండె కలిగిన తొలి మహిళ మృతి..
- జన్యుపరంగా మార్పిడి చేసిన పంది కిడ్నీ మార్పిడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pig kidney transplant: కిడ్నీ ఫెయిల్యూర్ వ్యక్తులు జీవితాంతం డయాలసిస్ ప్రక్రియ లేదా ఇతరులు కిడ్నీ ఇవ్వడం వల్లే తమ మిగిలిన జీవితాన్ని పొందుతున్నారు. అయితే, ఇటీవల శాస్త్రవేత్తలు, వైద్యులు పలువురికి ‘పంది కిడ్నీ’ని అమర్చారు. అయితే, కొన్ని రోజుల పాటు ఇది పనిచేసినప్పటికీ తర్వాత శరీరం చేత తిరస్కరించబడటమో లేక ఇతర ఆరోగ్య కారణాల వల్లనో మరణించారు. అయితే, దీనిపై మరింత పరిశోధనలు చేయాల్సి ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జన్యుపరంగా పంది కిడ్నీలో మార్పులు చేసి పూర్తి స్థాయిలో మనుషులకు అందుబాటులోకి తీసుకురావడానికి పరిశోధనలు సాగుతున్నాయి.
ఇదిలా ఉంటే తొలిసారి పంది కిడ్నీని మార్పిడి జరిగిన, మెకానికల్ గుండె కలిగిని న్యూజెర్సీకి చెందిన 54 ఏళ్ల మహిళ మరణించింది. ఏప్రిల్ నెలలో ఈ రెండింటిని విజయవంతంగా చేయించుకున్న లిసా పిసానో, మొదటగా అనారోగ్యం నుంచి కోలుకుంటున్నట్లు కనిపించింది. అయితే, ఆమె అనూహ్యంగా ఆమె ఆరోగ్యం క్షీణించడంతో ఆదివారం మరణించినట్లు ఆమె సర్జన్ ప్రకటించారు.
Also Read
- Kim Jong Un: కిమ్ను కలవడం అంత ఈజీ కాదు.. నెల రోజుల ట్రైనింగ్, కఠినమైన రూల్స్
- Pakistan: ఇంగ్లండ్ టూర్లో పాక్ క్రికెటర్లు.. మాజీ ప్రధాని గురించి మాట్లొద్దని పీసీబీ హెచ్చరిక
- Uzbekistan: భారతీయులకు గుడ్న్యూస్.. మోడీ టూర్ ఎఫెక్ట్.. 30 రోజులు వీసా ఫ్రీ
- Nepal Floods: తప్పిన ఘోర విషాదం.. 1,643 మంది విద్యార్థుల ప్రాణాలు కాపాడిన హెడ్మాస్టార్.. క్షణాల్లో మునిగిన స్కూల్
Read Also: Vizag Steel Plant: విశాఖకు కేంద్ర ఉక్కు మంత్రి.. స్టీల్ ప్లాంట్ వర్గాల్లో ఉత్కంఠ..
ఆమె గుండెకు ఇచ్చిన మందుల వల్ల పంది కిడ్నీ డ్యామేజ్ కావడంతో, సర్జరీ జరిగిన 47 రోజుల తర్వాత వైద్యులు ఆ కిడ్నీని తొలగించారు. పిసానోకు తిరిగి డయాలసిస్ ద్వారా చికిత్స అందించడం ప్రారంభించారు. హార్ట్ పంప్ని వైద్యులు కొనసాగించారు. భవిష్యత్తులో మరో వ్యక్తి జీవించడానికి, చనిపోవాల్సిన అవసరం లేకుండా లిసా మాకు సాయం చేసిందని ట్రాన్స్ప్లాంట్ సర్జన్ డాక్టర్ రాబర్ట్ మోంట్గోమెరీ అన్నారు.
న్యూజెర్సీకి చెందిన పిసానో, న్యూ యార్క్లోని ఒక ఆసుపత్రిలో జన్యుపరంగా సవరించిన పంది కిడ్నీ, హార్ట్ పంప్ను అమర్చుకున్నారు. చివరి దశ కిడ్నీ వ్యాధి, గుండె వైఫల్యం కారణంగా వీటిని వైద్యులు ఆమెకు అమర్చారు. ప్రమాదం అని తెలిసినా ఆమె తన భర్త, కుటుంబంతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నారు. పిసానో జన్యపరంగా మార్పు చేసిన పంది కిడ్నీని పొందిన రెండో వ్యక్తి. మొదటి వ్యక్తి రిచర్డ్ స్లేమాన్. స్లేమాన్ సర్జరీ జరిగిన రెండు నెలల తర్వాత మరణించారు.
తాజావార్తలు
-
Cheyutha Pension : చేయూత పింఛన్కు రేపే డెడ్లైన్.. మిస్ అయితే కష్టమే.!
-
Kim Jong Un: కిమ్ను కలవడం అంత ఈజీ కాదు.. నెల రోజుల ట్రైనింగ్, కఠినమైన రూల్స్
-
Pakistan: ఇంగ్లండ్ టూర్లో పాక్ క్రికెటర్లు.. మాజీ ప్రధాని గురించి మాట్లొద్దని పీసీబీ హెచ్చరిక
-
Uzbekistan: భారతీయులకు గుడ్న్యూస్.. మోడీ టూర్ ఎఫెక్ట్.. 30 రోజులు వీసా ఫ్రీ
-
Nepal Floods: తప్పిన ఘోర విషాదం.. 1,643 మంది విద్యార్థుల ప్రాణాలు కాపాడిన హెడ్మాస్టార్.. క్షణాల్లో మునిగిన స్కూల్
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!