Ban Phones In Classroom: క్లాస్ రూముల్లో మొబైల్స్ నిషేధం.. యూరోపియన్ దేశం కీలక నిర్ణయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
No Phones In Classrooms: ప్రస్తుతం కాలంలో అన్ని దేశాల్లో తరగతి గదుల్లోకి సెల్ ఫోన్లు తీసుకురావడం పరిపాటిగా మారింది. విద్యపై దృష్టి సారించడం కన్నా క్లాస్ రూముల్లో మొబైల్ ఫోన్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నవారు కూడా ఉన్నారు. మన దేశంలో క్లాసురూముల్లోకి సెల్ ఫోన్లు తీసుకురావడంపై కాస్త కఠినంగానే వ్యవహరిస్తారు. కానీ యూరప్ దేశాల్లో మాత్రం ఇది సర్వసాధారణం. అలాంటిది ఇప్పుడు ఓ ఓ యూరోపియన్ దేశం సంచలన నిర్ణయం తీసుకుంది.
Read Also: Russia: మాస్కోపై డ్రోన్ అటాక్.. అమెరికా, నాటో పనే అని రష్యా ఆరోపణలు..
Also Read
- Hamas Crypto Funding: హమాస్కు చావుదెబ్బ.. క్రిప్టో నెట్వర్క్పై FBI మెరుపుదాడి.. రూ. కోట్లలో నిధులు సీజ్!
- US Iran Conflict: మిడిల్ ఈస్ట్లో మిసైల్ వార్.. అమెరికాపై ఇరాన్ ఎదురుదాడితో హైటెన్షన్!
- US-Iran: రెండేళ్లలో ‘హార్ముజ్’ విలువలేనిదిగా మారొచ్చు.. ఇరాన్పై కఠిన ఆంక్షలకు అమెరికా ప్లాన్
- Extra Marital Affair: భార్య అక్రమ సంబంధాన్ని రోబో వాక్యూమ్ కెమెరాతో పట్టుకున్న భర్త.. చివరికిలా..!
తాజా విద్యా సంస్కరణల్లో భాగంగా నెదర్లాండ్స్ క్లాసురూముల్లోకి మొబైల్ ఫోన్లను నిషేధించింది. పాఠాలకు అంతరాయం కలిగించే మొబైల్ ఫోన్లను క్లాసురూముల్లోకి తీసుకురాకుండా నిషేధిస్తున్నామని అక్కడి ప్రభుత్వం మంగళవారం తెలిపింది. మొబైల్లు, ట్యాబ్లెట్లు, స్మార్ట్వాచ్లు విద్యార్థుల అభ్యాసానికి ఆటంకం కలిగిస్తున్నాయని, వాటిని వచ్చే ఏడాది నుంచి తరగతిలోకి అనుమతించబోమని డచ్ ప్రభుత్వం తెలిపింది.
పాఠాలు చెప్పే సమయంలో మొబైల్ ఫోన్లు హానికరమైన ప్రభావాన్ని చూపుతున్నాయని.. వీటి వల్ల విద్యార్థులు ఏకాగ్రత తగ్గడంతో పాటు పనితీరు దెబ్బతింటోందని ప్రభుత్వం వెల్లడించింది. దీంతో మొబైల్ ఫోన్లు, అలాగే టాబ్లెట్లు, స్మార్ట్వాచ్లు ఇకపై జనవరి 1, 2024 నుండి తరగతి గదుల్లోకి అనుమతించబడవని ప్రకటించింది. అక్టోబర్ నాటికి ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు అంతర్గత నిబంధనలను అంగీకరించాలని ప్రభుత్వ పాఠశాల అధికారులు కోరుతున్నారు. అయితే దేశంలోని రైట్ సంకీర్ణ ప్రభుత్వం అధికార నిషేధాన్ని విధించలేదు. వచ్చే ఏడాది ఫలితాలను బట్టి అధికార నిషేధాన్ని విధించే అవకాశం ఉంది. ఈ చర్య ‘‘సాంస్కృతిక పరివర్తన’’కు దారి తీస్తుందని.. విద్య అభ్యాసాన్ని మెరుగుపరుస్తుందని విద్యాశాఖ మంత్రి రాబర్ట్ డిజ్క్గ్రాఫ్ పార్లమెంటుకు తెలిపారు.
తాజావార్తలు
-
Emmy Awards 2026: ఈ నెలలోనే 78వ ఎమ్మీ అవార్డ్స్ .. ఎక్కువ నామినేషన్లు అందుకున్న షోలు ఇవే!
-
Congress 1000 Days: కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై బీఆర్ఎస్ ఛార్జ్షీట్..!
-
YS Jagan: ‘నాన్నా.. మిమ్మల్ని ఎప్పటికీ మిస్ అవుతూనే ఉంటాను’.. వైఎస్ జగన్ భావోద్వేగ ట్వీట్!
-
Devaraaya: శ్రీకృష్ణదేవరాయలుగా కిచ్చా సుదీప్.. ‘దేవరాయ’ ఫస్ట్ లుక్ అదిరిపోయిందిగా!
-
BRB First Look: కిచ్చా సుదీప్ బర్త్డేకు అదిరిపోయే ట్రీట్.. మంచు ప్రపంచంలో మాస్ అవతార్!
ట్రెండింగ్
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!
-
8,050mAh బ్యాటరీ, 185Hz AMOLED డిస్ప్లే, 200MP కెమెరాతో ఫ్లాగ్షిప్ ఫోన్ POCO F9 Ultra లాంచ్.!
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!