Netanyahu: ఈ రెండు రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి.. నెతన్యాహు కీలక వ్యాఖ్యలు
- ఈ రెండు రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి
- ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కీలక వ్యాఖ్యలు
- అంర్జాతీయంగా చర్చనీయాంశంగా వ్యాఖ్యలు
- సోషల్ మీడియాలో వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు చేశారు. రేపు లేదా ఎల్లుండి ఏమవుతుందో చూడాలంటూ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారాయి.
ప్రస్తుతం అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలేయ్ ఇజ్రాయెల్లో పర్యటిస్తున్నారు. అయితే పర్యటనలో భాగంగా ఇజ్రాయెల్ ప్రధాని ప్రధాని నెతన్యాహుతో కలిసి ప్రెస్మీట్కు హాజరయ్యారు. జేవియర్ మిలేయ్ కుర్చీలో కూర్చోగా.. నెతన్యాహు మాట్లాడుతూ.. జేవియర్ మిలేయ్ ఇజ్రాయెల్ పర్యటనకు వచ్చినప్పుడల్లా పెద్ద పరిణామాలు జరుగుతుంటాయని.. రేపు లేదా ఎల్లుండి ఏమవుతుందో చూడాలంటూ వ్యాఖ్యానించారు. నెతన్యాహు నోట నుంచి ఆ మాటలు రాగానే జేవియర్ మిలేయ్ పగలబడి నవ్వుకున్నారు. చాలా సేపు నవ్వుతూనే కనిపించారు.
Also Read
- Russia-Ukraine War: నాలుగేళ్లుగా సాగుతున్న ఉక్రెయిన్ యుద్ధంపై.. రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక ప్రకటన
- UFO Files: ఏలియన్ల గుట్టు రట్టు.. చరిత్రలో తొలిసారిగా 'UFO' రహస్య పత్రాలను బయటపెట్టిన అమెరికా!
- Kim Jong Un: కిమ్ జోంగ్ ఉన్ హత్యకు గురైతే, ప్రళయమే.. ఉత్తరకొరియా సంచలన నిర్ణయం..
- US: ‘‘ఇది ఇండియా కాదు’’.. టెక్సాస్ గవర్నర్ అభ్యర్థిని రెచ్చగొట్టే వ్యాఖ్యలు
రెండేళ్లలో జేవియర్ మిలేయ్ ఇజ్రాయెల్లో పర్యటించడం ఇది మూడోసారి. జేవియర్ మిలేయ్కు ఇజ్రాయెల్లో ఘన స్వాగతం లభించింది. ఇరువురు నేతలు స్నేహపూర్వకంగా సమావేశమయ్యారు. ‘‘జేవియర్’’ అనే పేరు హీబ్రూ భాషలో ‘‘చావేర్’’ (స్నేహితుడు) అనే పదానికి దగ్గరగా ఉంటుందని నెతన్యాహు సరదాగా వ్యాఖ్యానించారు.
ఇరాన్పై ఉమ్మడి వ్యూహం..
ఇరు దేశాలు ఐజాక్ ఒప్పందాలపై సంతకాలు చేశారు. భద్రత, కృత్రిమ మేధస్సు (AI) రంగాల్లో సహకారాన్ని పెంచుకోవడమే దీని లక్ష్యం. స్వేచ్ఛా దేశాల మధ్య కొత్త కూటమికి నాంది అని నెతన్యాహు అన్నారు. ఈ ఒప్పందం ద్వారా ఇరాన్ ప్రభావాన్ని అడ్డుకోవడంపై కూడా ఇరు దేశాలు దృష్టి పెట్టనున్నాయి. వాణిజ్యం, సాంకేతికత, ఇన్నోవేషన్ రంగాల్లో భాగస్వామ్యం పెంచుకోవాలని నిర్ణయించారు. ఇక పర్యటనలో భాగంగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. టెల్ అవీవ్ నుంచి అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఐరీస్కు నేరుగా విమాన సర్వీసులు నడపాలని నిర్ణయం తీసుకున్నారు. డిసెంబర్ నాటికి సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ప్రయాణ సమయం సుమారు 15-16 గంటలకు తగ్గనుంది. అలాగే అర్జెంటీనా తన రాయబార కార్యాలయాన్ని జెరూసలేంకు మార్చే ప్రణాళికను మిలేయి మరోసారి పునరుద్ఘాటించారు.
نتانیاهو:
هر بار که خاویر مایلی از اسرائیل بازدید میکند، درست قبل از وقوع اتفاق بزرگی است.
چه کسی میداند فردا یا پسفردا چه اتفاقی خواهد افتاد؟ pic.twitter.com/eAJncCmD8Y
— Big Boss News 🇮🇷 (@boss_big666) April 19, 2026
తాజావార్తలు
-
Himanta Biswa Sarma: హిమంత ది అన్స్టాపబుల్.. శాసనసభ పక్ష నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నిక.. సీఎం ఓత్ ఫిక్స్ డేట్
-
Buttermilk vs Lassi: మజ్జిగ వర్సెస్ లస్సీ.. ఈ మండుటెండలో ఏది ఎక్కువ మేలు చేస్తుంది..?
-
Hyderabad Liquor Scam: బ్రాండెడ్ మందు బాబులకు షాక్.. ప్రీమియం లిక్కర్లో చీప్ లిక్కర్..
-
CM Chandrababu Delhi Tour: రేపు ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. అమిత్ షా సహా కేంద్ర మంత్రులతో కీలక భేటీలు
-
PM Modi: తమిళనాడు సీఎంగా విజయ్ పట్టాభిషేకం.. దళపతికి ప్రధాని మోడీ స్పెషల్ సందేశం..