Netanyahu: ఈ రెండు రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి.. నెతన్యాహు కీలక వ్యాఖ్యలు
- ఈ రెండు రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి
- ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కీలక వ్యాఖ్యలు
- అంర్జాతీయంగా చర్చనీయాంశంగా వ్యాఖ్యలు
- సోషల్ మీడియాలో వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు చేశారు. రేపు లేదా ఎల్లుండి ఏమవుతుందో చూడాలంటూ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారాయి.
ప్రస్తుతం అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలేయ్ ఇజ్రాయెల్లో పర్యటిస్తున్నారు. అయితే పర్యటనలో భాగంగా ఇజ్రాయెల్ ప్రధాని ప్రధాని నెతన్యాహుతో కలిసి ప్రెస్మీట్కు హాజరయ్యారు. జేవియర్ మిలేయ్ కుర్చీలో కూర్చోగా.. నెతన్యాహు మాట్లాడుతూ.. జేవియర్ మిలేయ్ ఇజ్రాయెల్ పర్యటనకు వచ్చినప్పుడల్లా పెద్ద పరిణామాలు జరుగుతుంటాయని.. రేపు లేదా ఎల్లుండి ఏమవుతుందో చూడాలంటూ వ్యాఖ్యానించారు. నెతన్యాహు నోట నుంచి ఆ మాటలు రాగానే జేవియర్ మిలేయ్ పగలబడి నవ్వుకున్నారు. చాలా సేపు నవ్వుతూనే కనిపించారు.
Also Read
- Giorgia Meloni: మెలోని ఢిల్లీలో పోటీ చేస్తే లక్షల ఓట్లు గ్యారెంటీ..
- India-Bangladesh: బంగ్లాదేశ్ పౌరులకు గుడ్న్యూస్.. టూరిస్ట్ వీసాల జారీకి భారత్ గ్రీన్ సిగ్నల్
- Pakistan: సైనికుల జీతాలు 25% పెంచిన పాక్.. సిందూర్ దెబ్బకు పరిహారమా?
- Bangladesh: ‘‘సీఎం సువేందు బాబును ఆపండి’’.. భారత్కు బంగ్లాదేశ్ ఎంపీ విజ్ఞప్తి.
రెండేళ్లలో జేవియర్ మిలేయ్ ఇజ్రాయెల్లో పర్యటించడం ఇది మూడోసారి. జేవియర్ మిలేయ్కు ఇజ్రాయెల్లో ఘన స్వాగతం లభించింది. ఇరువురు నేతలు స్నేహపూర్వకంగా సమావేశమయ్యారు. ‘‘జేవియర్’’ అనే పేరు హీబ్రూ భాషలో ‘‘చావేర్’’ (స్నేహితుడు) అనే పదానికి దగ్గరగా ఉంటుందని నెతన్యాహు సరదాగా వ్యాఖ్యానించారు.
ఇరాన్పై ఉమ్మడి వ్యూహం..
ఇరు దేశాలు ఐజాక్ ఒప్పందాలపై సంతకాలు చేశారు. భద్రత, కృత్రిమ మేధస్సు (AI) రంగాల్లో సహకారాన్ని పెంచుకోవడమే దీని లక్ష్యం. స్వేచ్ఛా దేశాల మధ్య కొత్త కూటమికి నాంది అని నెతన్యాహు అన్నారు. ఈ ఒప్పందం ద్వారా ఇరాన్ ప్రభావాన్ని అడ్డుకోవడంపై కూడా ఇరు దేశాలు దృష్టి పెట్టనున్నాయి. వాణిజ్యం, సాంకేతికత, ఇన్నోవేషన్ రంగాల్లో భాగస్వామ్యం పెంచుకోవాలని నిర్ణయించారు. ఇక పర్యటనలో భాగంగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. టెల్ అవీవ్ నుంచి అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఐరీస్కు నేరుగా విమాన సర్వీసులు నడపాలని నిర్ణయం తీసుకున్నారు. డిసెంబర్ నాటికి సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ప్రయాణ సమయం సుమారు 15-16 గంటలకు తగ్గనుంది. అలాగే అర్జెంటీనా తన రాయబార కార్యాలయాన్ని జెరూసలేంకు మార్చే ప్రణాళికను మిలేయి మరోసారి పునరుద్ఘాటించారు.
نتانیاهو:
هر بار که خاویر مایلی از اسرائیل بازدید میکند، درست قبل از وقوع اتفاق بزرگی است.
چه کسی میداند فردا یا پسفردا چه اتفاقی خواهد افتاد؟ pic.twitter.com/eAJncCmD8Y
— Big Boss News 🇮🇷 (@boss_big666) April 19, 2026
తాజావార్తలు
-
TG20 League 2026: రాయుడు ‘హిట్’ ఇన్నింగ్స్.. పాలమూరు స్ట్రైకర్స్ ఘన విజయం!
-
Friday Horoscope: శుక్రవారం దిన ఫలాలు.. వృత్తి, ఉద్యోగ రంగాల్లో మిశ్రమ ఫలితాలు!
-
Ranabaali : ‘రణబాలి’ వివాదంపై మైత్రి రవిశంకర్ స్పందన.. విజయ్పై కీలక వ్యాఖ్యలు
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
-
8849 Tank 5: ప్రొజెక్టర్తో 8849 ట్యాంక్ 5 స్మార్ట్ఫోన్ విడుదల.. 17,600mAh భారీ బ్యాటరీ, 3K డిస్ప్లే
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!