Netanyahu: ఈ రెండు రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి.. నెతన్యాహు కీలక వ్యాఖ్యలు
- ఈ రెండు రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి
- ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కీలక వ్యాఖ్యలు
- అంర్జాతీయంగా చర్చనీయాంశంగా వ్యాఖ్యలు
- సోషల్ మీడియాలో వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు చేశారు. రేపు లేదా ఎల్లుండి ఏమవుతుందో చూడాలంటూ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారాయి.
ప్రస్తుతం అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలేయ్ ఇజ్రాయెల్లో పర్యటిస్తున్నారు. అయితే పర్యటనలో భాగంగా ఇజ్రాయెల్ ప్రధాని ప్రధాని నెతన్యాహుతో కలిసి ప్రెస్మీట్కు హాజరయ్యారు. జేవియర్ మిలేయ్ కుర్చీలో కూర్చోగా.. నెతన్యాహు మాట్లాడుతూ.. జేవియర్ మిలేయ్ ఇజ్రాయెల్ పర్యటనకు వచ్చినప్పుడల్లా పెద్ద పరిణామాలు జరుగుతుంటాయని.. రేపు లేదా ఎల్లుండి ఏమవుతుందో చూడాలంటూ వ్యాఖ్యానించారు. నెతన్యాహు నోట నుంచి ఆ మాటలు రాగానే జేవియర్ మిలేయ్ పగలబడి నవ్వుకున్నారు. చాలా సేపు నవ్వుతూనే కనిపించారు.
Also Read
- US-Iran: రెండేళ్లలో ‘హార్ముజ్’ విలువలేనిదిగా మారొచ్చు.. ఇరాన్పై కఠిన ఆంక్షలకు అమెరికా ప్లాన్
- Extra Marital Affair: భార్య అక్రమ సంబంధాన్ని రోబో వాక్యూమ్ కెమెరాతో పట్టుకున్న భర్త.. చివరికిలా..!
- Keir Starmer: ఇంగ్లండ్ మాజీ ప్రధాని మరో కీలక నిర్ణయం.. ఎంపీ పదవికి కూడా రాజీనామా
- Nepal Floods: నేపాల్లో వందలాది మృతదేహాలను ఎందుకు పూడ్చిపెడుతున్నారు..? అసలు కారణం ఇదే
రెండేళ్లలో జేవియర్ మిలేయ్ ఇజ్రాయెల్లో పర్యటించడం ఇది మూడోసారి. జేవియర్ మిలేయ్కు ఇజ్రాయెల్లో ఘన స్వాగతం లభించింది. ఇరువురు నేతలు స్నేహపూర్వకంగా సమావేశమయ్యారు. ‘‘జేవియర్’’ అనే పేరు హీబ్రూ భాషలో ‘‘చావేర్’’ (స్నేహితుడు) అనే పదానికి దగ్గరగా ఉంటుందని నెతన్యాహు సరదాగా వ్యాఖ్యానించారు.
ఇరాన్పై ఉమ్మడి వ్యూహం..
ఇరు దేశాలు ఐజాక్ ఒప్పందాలపై సంతకాలు చేశారు. భద్రత, కృత్రిమ మేధస్సు (AI) రంగాల్లో సహకారాన్ని పెంచుకోవడమే దీని లక్ష్యం. స్వేచ్ఛా దేశాల మధ్య కొత్త కూటమికి నాంది అని నెతన్యాహు అన్నారు. ఈ ఒప్పందం ద్వారా ఇరాన్ ప్రభావాన్ని అడ్డుకోవడంపై కూడా ఇరు దేశాలు దృష్టి పెట్టనున్నాయి. వాణిజ్యం, సాంకేతికత, ఇన్నోవేషన్ రంగాల్లో భాగస్వామ్యం పెంచుకోవాలని నిర్ణయించారు. ఇక పర్యటనలో భాగంగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. టెల్ అవీవ్ నుంచి అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఐరీస్కు నేరుగా విమాన సర్వీసులు నడపాలని నిర్ణయం తీసుకున్నారు. డిసెంబర్ నాటికి సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ప్రయాణ సమయం సుమారు 15-16 గంటలకు తగ్గనుంది. అలాగే అర్జెంటీనా తన రాయబార కార్యాలయాన్ని జెరూసలేంకు మార్చే ప్రణాళికను మిలేయి మరోసారి పునరుద్ఘాటించారు.
نتانیاهو:
هر بار که خاویر مایلی از اسرائیل بازدید میکند، درست قبل از وقوع اتفاق بزرگی است.
چه کسی میداند فردا یا پسفردا چه اتفاقی خواهد افتاد؟ pic.twitter.com/eAJncCmD8Y
— Big Boss News 🇮🇷 (@boss_big666) April 19, 2026
తాజావార్తలు
-
Elephant Death: విద్యుత్ షాక్తో ఏనుగు మృతి.. పవన్ కల్యాణ్ సీరియస్.. కీలక ఆదేశాలు
-
Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
-
OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్లో మంటలు రేపుతున్నాయా..?
-
Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
-
US-Iran: రెండేళ్లలో ‘హార్ముజ్’ విలువలేనిదిగా మారొచ్చు.. ఇరాన్పై కఠిన ఆంక్షలకు అమెరికా ప్లాన్
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!