Fuel Price Hike: యుద్ధం ఎఫెక్ట్.. వరుసగా నాల్గోసారి పెరిగిన పెట్రో ధరలు.. పెట్రోల్పై రూ.17, డీజిల్పై రూ.25 వడ్డింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fuel Price Hike: మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, ముఖ్యంగా అమెరికా-ఇరాన్ మధ్య పెరిగిన ఉద్రిక్త పరిస్థితుల ప్రభావం పొరుగు దేశమైన నేపాల్పై తీవ్రంగా పడుతోంది. ఈ ప్రభావంతో నేపాల్లో ఇంధన ధరలు వరుసగా నాలుగోసారి పెరగడం గమనార్హం. కేవలం రెండు నెలల వ్యవధిలోనే పెట్రోల్, డీజిల్ ధరలు గణనీయంగా పెరిగాయి. తాజా పెంపుతో నేపాల్లో లీటరు పెట్రోల్ ధర రూ.216.50కు చేరగా, డీజిల్ ధర రూ.204.50గా నమోదైంది. ఈసారి పెట్రోల్పై రూ.17, డీజిల్పై రూ.25 పెంపు అమల్లోకి వచ్చింది. అర్ధరాత్రి నుంచి ఈ కొత్త ధరలు అమలులోకి వచ్చాయి.
Also Read
- Explained: యుద్ధంలో ట్రంప్ ఘోర పరాజయం.. ప్రపంచం ముందు నవ్వులపాలైన అమెరికా!
- Hormuz Strait: ప్రపంచానికి ఊపిరి పోసిన అమెరికా-ఇరాన్ ఒప్పందం.. హర్మూజ్ గుండా చమురు రవాణా షురూ..
- Giorgia Meloni: జీ 7 సదస్సుకు కుమార్తెతో హాజరైన మెలోని.. ఫొటోలు వైరల్
- India-Bangladesh: ‘‘ఇది షేక్ హసీనా ప్రభుత్వం కాదు’’.. భారత్కు బంగ్లా ప్రధాని సలహాదారు ఘాటు సందేశం
నేపాల్ ఆయిల్ కార్పొరేషన్ ప్రకారం, అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరగడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. చమురు దిగుమతులపై భారీ వ్యయం పెరగడంతో ప్రభుత్వం ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ప్రస్తుతం ఇంధన ధరల కారణంగా కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతోందని అంచనా వేస్తున్నారు. గత రెండు నెలల్లోనే నాలుగు సార్లు ధరలు పెరగడం ప్రజలపై భారంగా మారింది. మార్చి 1న రూ.157గా ఉన్న పెట్రోల్ ధర, ఇప్పుడు రూ.216 దాటడం పరిస్థితి తీవ్రతను సూచిస్తోంది. డీజిల్ ధరలు కూడా ఇదే విధంగా పెరిగాయి.
ఇంధన ధరల పెరుగుదల ఉన్నప్పటికీ, నేపాల్ ప్రభుత్వం ఇంకా భారీ నష్టాలను ఎదుర్కొనే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో వినియోగదారులు సహకరించాలని నేపాల్ ఆయిల్ కార్పొరేషన్ విజ్ఞప్తి చేసింది. ఇక ఆసక్తికరంగా, నేపాల్తో పోలిస్తే భారతదేశంలోని బీహార్ రాష్ట్రంలోని రక్సౌల్ ప్రాంతంలో ఇంధన ధరలు తక్కువగా ఉన్నాయి. దీంతో సరిహద్దు ప్రాంతాల్లో ధరల వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తోంది. మొత్తానికి, అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావం నేపాల్ ఆర్థిక వ్యవస్థపై ప్రత్యక్షంగా పడుతూ, ప్రజల దైనందిన జీవితాన్ని మరింత భారంగా మార్చుతోంది.
తాజావార్తలు
-
Ayodhya Ram Mandir: రాముడికి ప్రసాదంగా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండ్లు.!
-
Microsoft Surface Pro: OLED డిస్ప్లే, 16GB RAM, ప్రీమియం ఫీచర్లతో.. మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ ప్రో ల్యాప్టాప్ విడుదల
-
SBI ATM Robbery: బుక్కరాయసముద్రంలో ఎస్బీఐ ఏటీఎం చోరీ.. నగదు దోచుకుని మిషన్ను..!
-
FIFA World Cup: సెనెగల్పై ‘కిలియన్ ఎంబాపే’ డబుల్ ట్రీట్.. 3-1 తేడాతో విజయం.!
-
The India Story : కాజల్ అగర్వాల్ ‘ది ఇండియా స్టోరీ’ మూవీ స్టోరీ లీక్
ట్రెండింగ్
-
Historical Day: నేడు ట్రిపుల్ ధమాకా.. టీమిండియా ఫ్యాన్స్కు పండగే.. 12 గంటల పాటు నాన్స్టాప్ ఎంటర్టైన్మెంట్!
-
8560mAh భారీ బ్యాటరీ, 6000 నిట్స్ డిస్ప్లే, IP69K రక్షణతో HONOR X70 Pro Max లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా.!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 7540mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI Turbo 5 లాంచ్.! ధర ఎంతంటే.?
-
T20 World Cup 2026లో సంచలనం.. శ్రీలంక చరిత్రాత్మక విజయం.. డిఫెండింగ్ ఛాంపియన్కు వరుసగా రెండో షాక్!
-
6000mAh బ్యాటరీ, IP69 రేటింగ్, 50MP సోనీ కెమెరాతో TECNO SPARK 50 Pro లాంచ్.!