SBI ATM Robbery: బుక్కరాయసముద్రంలో ఎస్బీఐ ఏటీఎం చోరీ.. నగదు దోచుకుని మిషన్ను..!
- మరోసారి రెచ్చిపోయిన ఏటీఎం దొంగల ముఠా
- బుక్కరాయసముద్రంలో ఎస్బీఐ ఏటీఎం చోరీ
- మిషన్ను పొలాల్లో పడేసిన దుండగులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Robbers Steal SBI ATM Machine in Bukkarayasamudram: ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఏటీఎం దొంగల ముఠా మరోసారి రెచ్చిపోయింది. అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని ఎస్బీఐ ఏటీఎం మిషన్ను పూర్తిగా పెకలించి ఎత్తుకెళ్లారు. అనంతరం నగదును దోచుకుని మిషన్ పరికరాలను సింగనమల మండలం ఆకులేడు గ్రామ సమీపంలోని పొలాల్లో పడేసి పరారయ్యారు. కేసు చేసుకున్న పోలీసులు పలు బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు.
పోలీసుల ప్రాథమిక విచారణ వివరాల ప్రకారం.. దుండగులు బొలెరో వాహనంలో వచ్చి తాడు సహాయంతో ఎస్బీఐ ఏటీఎం మిషన్ను లాగి బయటకు తీసుకెళ్లారు. ఈ ఘటన మొత్తం ఏటీఎం వద్ద ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. దుండగులు అత్యంత ప్రణాళికాబద్ధంగా ఈ చోరీకి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఏటీఎం మిషన్ కనిపించకపోవడంతో అప్రమత్తమైన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో సింగనమల మండలం ఆకులేడు గ్రామ పరిధిలోని పొలాల్లో ఏటీఎం మిషన్ పరికరాలు గుర్తించారు. నగదును తీసుకుని మిషన్ను అక్కడ పడేసి వెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఏటీఎంలో ఎంత మొత్తం నగదు ఉందనే విషయాన్ని బ్యాంకు అధికారులు నిర్ధారించాల్సి ఉంది.
Also Read
- Ivolga high-speed train: భారత్కు రష్యా బంపర్ ఆఫర్.. హైస్పీడ్ ‘‘ఇవోల్గా’’ రైలు ప్రతిపాదన..
- PM Kisan: పీఎం కిసాన్ 24 విడత డబ్బులు ఎప్పుడు వస్తాయి..? కీలక అప్డేట్..
- BRICS: మోడీ విందుకు జిన్పింగ్ డుమ్మా.. కారణం ఏంటంటే..?
- Vijayawada: అప్పులు.. ఈఎంఐలు.. ఆర్భాటపు జీవితం.. దొంగగా మారిన 22 ఏళ్ల బీటెక్ యువకుడు..
ఏటీఎం చోరీపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. క్లూస్ టీం వేలిముద్రలను సేకరించగా, డాగ్ స్క్వాడ్ సహాయంతో పరిసర ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. ఇతర రాష్ట్రాలకు చెందిన దొంగల ముఠా ఈ ఘటనలో పాల్గొని ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. గత నెలలో ధర్మవరంలో కూడా ఇదే తరహాలో దుండగులు బొలెరో వాహనం సాయంతో ఏటీఎంను లాగి ఎత్తుకెళ్లారు. వారం రోజుల క్రితం గుంతకల్లులోనూ ఏటీఎం చోరీకి ప్రయత్నించారు. వరుస ఘటనల నేపథ్యంలో ఒకే ముఠా ఈ దోపిడీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఏటీఎం చోరీల వెనుక ఉన్న ముఠాను పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సీసీ కెమెరా దృశ్యాలు, సాంకేతిక ఆధారాల ఆధారంగా దుండగుల ఆచూకీ కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో వరుస ఏటీఎం చోరీలు కలకలం రేపుతున్నాయి.
తాజావార్తలు
-
Ivolga high-speed train: భారత్కు రష్యా బంపర్ ఆఫర్.. హైస్పీడ్ ‘‘ఇవోల్గా’’ రైలు ప్రతిపాదన..
-
Mega Mass Moment: ఒకే ఫ్రేమ్లో చిరంజీవి, రామ్చరణ్, రవితేజ.. ‘ఇరుముడి’ టీమ్కు మెగా సర్ప్రైజ్ .. పిక్స్ వైరల్!
-
PM Kisan: పీఎం కిసాన్ 24 విడత డబ్బులు ఎప్పుడు వస్తాయి..? కీలక అప్డేట్..
-
Harmanpreet Kaur: ఆమె డేంజరస్ ప్లేయర్.. త్వరగా ఔట్ చేయకుంటే ఓటమి ఖాయం.. హర్మన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
BRICS: మోడీ విందుకు జిన్పింగ్ డుమ్మా.. కారణం ఏంటంటే..?
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!