Mark Rutte: రష్యాతో స్నేహం చేస్తే దెబ్బతింటారు.. భారత్, చైనాకు నాటో చీఫ్ వార్నింగ్
- రష్యాతో స్నేహం చేస్తే దెబ్బతింటారు
- భారత్, చైనాకు నాటో చీఫ్ వార్నింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశాల మధ్య మళ్లీ ఉద్రిక్తతలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ప్రశాంత వాతావరణం నెలకొనగా.. ఉక్రెయిన్-రష్యా యుద్ధం కారణంగా మళ్లీ టెన్షన్ వాతావరణం నెలకొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఉక్రెయిన్పై యుద్ధం ఆపాలని రష్యాపై అమెరికా ఒత్తిడి తెస్తోంది. కానీ పుతిన్ మాత్రం ఏ మాత్రం వెనుకడుగు వేయడం లేదు. యుద్ధం ఆపేదిలేదని తెగేసి చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రష్యాతో వాణిజ్య సంబంధాలు కలిగిన దేశాలను ఇబ్బంది పెట్టాలని ట్రంప్ భావిస్తున్నారు. ఇప్పటికే ఇలాంటి వార్నింగ్ ఇచ్చారు. రష్యాతో సంబంధాలు కలిగిన దేశాలపై 500 శాతం సుంకాలు విధిస్తామని.. భారత్, చైనాలను హెచ్చరించారు. అంతేకాకుండా 50 రోజుల్లో రష్యా శాంతి ఒప్పందాలకు రాకపోతే భారీగా సుంకాలు విధిస్తామని రష్యాను హెచ్చరించారు. ఇలా రష్యాపై అనేక రకాలుగా ఒత్తిళ్లు పెంచుతున్నారు.
ఇది కూడా చదవండి: Ukraine: ఉక్రెయిన్ ప్రధాని రాజీనామా.. కొత్త ప్రధానిగా జెలెన్స్కీ స్నేహితురాలు
Also Read
- Pakistan: పాకిస్థాన్ డబుల్ గేమ్.. మధ్యవర్తిత్వం పేరుతో ట్రంప్ను ఇలా మోసం చేశారేంట్రా బాబు!
- Trump: ‘విషమ స్థితిలో ఉన్న రోగిలా ఉంది’.. ఇరాన్ తీరును ఎండగట్టిన ట్రంప్
- Ittehad-ul-Mujahideen: పాక్ను వణికిస్తున్న కొత్త ఉగ్ర ముఠా.. వణికిపోతున్న ఇస్లామాబాద్!
- Internet Crisis: ఇంటర్నెట్కు హోర్ముజ్ సెగలు.. భారత్కు ముప్పు తప్పదా?
తాజాగా నాటో చీఫ్ మార్క్ రుట్టే కూడా రష్యాతో వాణిజ్య సంబంధాలు కలిగిన భారత్, చైనా, బ్రెజిల్కు వార్నింగ్ ఇచ్చారు. రష్యాతో వ్యాపారం కొనసాగిస్తే తీవ్రంగా నష్టపోతారని బ్రెజిల్, చైనా, భారతదేశానికి నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే బుధవారం హెచ్చరించారు.
ఇది కూడా చదవండి: Health Warning: జిలేబీ, సమోసాపై వార్నింగ్ లేబుల్స్.. కేంద్రం క్లారిటీ
మార్క్ రుట్టే అమెరికా కాంగ్రెస్లో సెనేటర్లతో సమావేశం అయ్యారు. ట్రంప్తో కూడా భేటీ అయ్యారు. ఈ భేటీ తర్వాతే మార్క్ రుట్టే ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్, చైనా, బ్రెజిల్ దేశాలు పరిశీలన చేసుకోవాలని.. లేదంటే తీవ్రంగా దెబ్బతినాల్సి ఉంటుందని విలేకర్లతో మాట్లాడుతూ రుట్టే ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ మూడు దేశాల పెద్దలు పుతిన్కు ఫోన్ చేసి శాంతి చర్చల గురించి ఆలోచించాలని చెప్పాలని సూచించారు. లేదంటే భారత్, చైనాపై భారీ స్థాయిలో తీవ్ర ప్రభావం పడొచ్చని చెప్పుకొచ్చారు.
ఇది కూడా చదవండి: Trump-Putin: మంచిగా మాట్లాడతాడు.. తర్వాత బాంబ్లు వేస్తాడు.. పుతిన్పై ట్రంప్ ఆగ్రహం
ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఉక్రెయిన్-రష్యా యుద్ధం ఆపేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. కానీ రష్యా అధ్యక్షుడు పుతిన్ మాత్రం అందుకు అంగీకరించట్లేదు. దీంతో ట్రంప్కు కోపం వచ్చింది. ఉక్రెయిన్కు ఆయుధాలు సరఫరా చేసి.. మాస్కోను దెబ్బకొట్టాలని ప్రణాళికలు రచిస్తున్నారు.
తాజావార్తలు
-
CM Chandrababu: అసోం సీఎం ప్రమాణస్వీకారానికి సీఎం చంద్రబాబు.. గౌహతిలో బిజీ షెడ్యూల్!
-
Krishnavataram Part 1: కృష్ణావతారం మూవీ టికెట్ల ధరపై.. సీఎం యోగి ఆదిత్యనాథ్ కీలక ఆదేశాలు!
-
VeeraBhadrudu : వీరభద్రుడు వచ్చేశాడు.. ట్రైలర్ లో అదరగొట్టిన సూర్య
-
Polavaram-Tiger: పోలవరం జిల్లాలో మళ్లీ పెద్దపులి సంచారం.. భయం గుప్పెట్లో హడలెత్తిపోతున్న జనాలు!
-
Pakistan: పాకిస్థాన్ డబుల్ గేమ్.. మధ్యవర్తిత్వం పేరుతో ట్రంప్ను ఇలా మోసం చేశారేంట్రా బాబు!
ట్రెండింగ్
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kathmandu: రన్వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?