NASA: 7 ఏళ్ల తర్వాత గ్రహశకల నమూనాతో భూమిని చేరిన నాసా క్యాప్సూల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NASA: అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆస్ట్రాయిడ్ మిషన్ సక్సెస్ అయింది. దాదాపుగా 7 ఏళ్ల తరువాత బెన్నూ అనే గ్రహశకలంపై నుంచి నమూనాలను భూమిపైకి తీసుకువచ్చింది. ఆదివారం అమెరికా ఊటా రాష్ట్రంలో ఎడారిలో నాసా క్యాప్సూల్ దిగింది. నాసా 2016లో ‘ఒరిసిస్ రెక్స్’ అనే స్పేస్ ప్రోబ్ ను అంతరిక్షంలోకి పంపింది. సుమారు 3 ఏళ్లు ప్రయాణించి బెన్నూ అనే గ్రహశకలాన్ని చేరింది. మొత్తంగా మళ్లీ భూమిని చేరడానికి ఏడేళ్లు పట్టింది.
దాదాపుగా 250 గ్రాముల నమూనాలను ఓరిసిస్ రెక్స్ భూమికి తీసుకువచ్చింది. ఇంత వరకు ఇంత పెద్ద నమూనాలనను ఏ ప్రయోగంలో భూమికి తీసుకు రాలేదు. ఈ మిషన్ ద్వారా సౌర వ్యవస్థ ఏర్పాటు, భూమి నివాసయోగ్యం ఎలా అయిందనే విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
Also Read
- US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
- Afghan Women: ‘అమ్మాయి మౌనం పెళ్లికి అంగీకారమే’.. తాలిబన్ కొత్త చట్టంపై ఆగ్రహజ్వాలలు
- Oil Companies: పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచినా.. ఇంకా నష్టాల్లోనే చమురు సంస్థలు.. కారణం ఇదే..
- PM Modi: మోడీకి అరుదైన గౌరవం.. నార్వే అత్యున్నత పురస్కారం అందజేత
Read Also: Manipur: మణిపూర్, మయన్మార్ల మధ్య 70 కి.మీ కంచె.. అర్జెంట్గా అవసరమన్న సీఎం
వాతావరణం అనుకూలించడంతో ఈ రోజు అంతరిక్షం నుంచి ఒరిసిస్ రెక్స్ స్పేస్ ప్రోబ్ నమూనాలు ఉన్న క్యాప్సూల్ ని భూమిపైకి జార విడిచింది. గంటకు 43,000 కిలోమీటర్ల వేగంతో వాతావరణంలోకి ప్రవేశించింది. ఈ సమయంలో భూ వాతావరణంలోకి ప్రవేశిస్తున్నప్పుడు 2800 డిగ్రీల ఉష్ణోగ్రతను తట్టుకునేలా క్యాప్సూల్ ని నాసా డిజైన్ చేసింది. ఎడారిలో సాఫ్ట్ ల్యాండింగ్ చేసేందుకు రెండు పారాచూట్ లు సురక్షితంగా క్యాప్సూల్ ని ఎడారిలో నేలపై ల్యాండ్ చేసింది.
నాసా కన్నా ముందు జపనీస్ స్పేస్ ఏజెన్సీ ఇలాగే గ్రహ శకలం నుంచి నమూనాలను సేకరించింది. దీంట్లో RNAలో ఉన్న యురేసిల్ ఉన్నట్లు కనుగొన్నారు. భూమిపై నీరు, జీవావన్ని గ్రహశకలాలు మోసుకువచ్చాయనే అభిప్రాయం శాస్త్రవేత్తల్ ఉంది. దీంతోనే గ్రహశకలాల నమూనాలపై అధ్యయనం జరుగుతోంది. 500 మీటర్ల వ్యాసం ఉన్న బెన్నూ గ్రహశకలం ప్రతీ ఆరేళ్లకు ఒకసారి సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. 2182లో ఇది భూమి ఢీకొనే అవకాశం ఉంది. ఈ గ్రహశకలం మార్గాన్ని నాసా అధ్యయనం చేస్తోంది.
After a journey of nearly 3.9 billion miles, the #OSIRISREx asteroid sample return capsule is back on Earth. Teams perform the initial safety assessment—the first persons to come into contact with this hardware since it was on the other side of the solar system. pic.twitter.com/KVDWiovago
— NASA (@NASA) September 24, 2023
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!