Artemis 2: అంతరిక్ష ప్రయాణంలో కొత్త చరిత్ర.. చంద్రుడిని చేరిన ఆర్టిమిస్-2
- చరిత్ర సృష్టించిన ఆర్టిమిస్-2..
- చంద్రుడి గ్రావిటీ పరిధిలోకి వ్యోమనౌక..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Artemis 2: అంతరిక్ష పరిశోధనలో సరికొత్త చరిత్ర నమోదైంది. మానవసహిత అంతరిక్ష యాత్రలలో అద్భుతం జరిగింది. ఆర్టిమిస్ -2 మిసన్ చంద్రుని గ్రావిటేషనల్ పరిధిలోకి చేరింది. 1972 డిసెంబర్ నుంచి ఏ మానవుడు కూడా భూమి కక్ష్యను దాటి వెళ్లలేదు. ఏప్రిల్ 2, 2026న దీనికి నాసా ఆర్టిమిస్-2 మిషన్ ముగింపు పలిచింది. ఈ మిషన్ ద్వారా ప్రయాణించిన వ్యోమగాములు భూమి నుంచి 4,06,773 కిలోమీటర్ల దూరం ప్రయాణించారు. ఇది అత్యంత సుదూర మానవ అంతరిక్ష యాత్ర రికార్డును బద్దలు కొట్టడానికి సిద్ధంగా ఉంది. 1970లో అపోలో 13 నెలకొల్పిన రికార్డు కన్నా ఇది సుమారుగా 2500 కి.మీ ఎక్కువ.
రికార్డ్ క్రియేట్ చేసిన ఆర్టిమిస్-2:
Also Read
- Meta: మెటాకు భారీ షాక్.. అమెరికా కోర్టు సంచలన తీర్పు.. 567 మిలియన్ డాలర్స్ చెల్లించాలని ఆదేశం
- Thailand School Shooting: స్కూల్లో కాల్పులు.. ఉపాధ్యాయుడు మృతి, 20 మంది విద్యార్థులకు గాయాలు..
- Donald Trump: మన దగ్గర భారీ ఆయుధ నిల్వ ఉంది.. ఇరాన్ పేద దేశం.. యుద్ధంపై ట్రంప్ కీలక ప్రకటన
- Pakistan: పిల్లలపై అత్యాచారం, ట్రాఫికింగ్ నిందితుడు.. PoK ఎన్నికల్లో గెలుపు..
ఆర్టిమిస్ -2 ఏప్రిల్ 7, 2026న భారత కాలమాన ప్రకారం తెల్లవారుజామున 12.15 గంటలకు చంద్రుడి సమీప యాత్రను ప్రారంభించనుంది. వ్యోమగాలులు చంద్రుడి అవతలి వైపు వెళ్లనున్నారు. భూమికి చంద్రుడికి మధ్య దూరం సుమారుగా 3,84,633 కిలోమీటర్లు. 1972లో అపోలో శకం ముగిసిన తర్వాత మొదటిసారిగా చంద్రుడి అవతలి పక్క భాగాన్ని దాటిన రికార్డ్ ఆర్టిమిస్ -2 పేరిట ఉండబోతోంది.
ఇంజన్ ఫెయిల్ అయినా భూమిని చేరుతుంది:
ఆర్టిమిస్-2 ఫ్రీ రిటర్న్ ట్రాజెక్టరీ అనే పిలవబడే మార్గంలో ప్రయాణిస్తోంది. అంటే, ఈ అంతరిక్ష నౌక తిరిగి భూమిపైకి రావడానికి ప్రత్యేకంగా ఇంజన్లను మండించాల్సిన అవసరం లేదు. చంద్రుడిని గురుత్వాకర్షణ శక్తిని ఉపయోగించి సహజంగా భూమి వైపు వస్తుంది. ఒక వేళ ఇంజన్ ఫెయిల్ అయినప్పటికీ, చంద్రుడి గ్రావిటీని ఉపయోగించి సురక్షితగంగా తిరిగి రావచ్చు.
సుదూర విశ్వం ఎందుకంత భిన్నం:
భూమికి 2000 కి.మీ ఎత్తు వరకు ఉన్న ప్రాంతంలో ఉపగ్రహలకు, అంతరిక్ష నౌకలు, అందులో ఉన్న వ్యోమగాములకు భూమి అయస్కాంత క్షేత్రం(ఎర్త్ మాగ్నిటిక్ ఫీల్డ్) రక్షణ కల్పిస్తుంది. సూర్యుడు, సుదూర విశ్వం నుంచి వచ్చే హానికరమైన రేడియేషన్ను భూమి మాగ్నిటిక్ ఫీల్డ్ పక్కకు తప్పిస్తుంది.
వ్యోమనౌక భూమి వాతావరణంలోకి వచ్చేటప్పుడు దాదాపుగా 2760 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు అవుతుంది. వ్యోమనౌకకు ఉండే హీట్ షీల్డ్ ఈ వేడి నుంచి రక్షిస్తుంది. ఈ సమయంలో వాతావరణ ఘర్షణ వల్ల ఇంత వేడి జనరేట్ అవుతుంది. రీఎంట్రీ సమయంలో దాని వేగం గంటకు 40,200 కి.మీ ఉంటుంది.
ఈ మిషన్ చంద్రుడి కోసం కాదు. భవిష్యత్తులో మార్స్ మిషన్ కోసం ట్రయల్ రన్గా భావిస్తున్నారు. మానవశరీరంపై సుదూర విశ్వం ఎలా పనిచేస్తుందని అంచనా వేస్తారు. కొత్త టెక్నాలజీలను పరీక్షిస్తారు. రేడియేషన్ ప్రభావం, అంతరిక్ష నౌక పనితీరును అంచనా వేస్తారు.
తాజావార్తలు
-
Bhatti Vikramarka: పెట్టుబడులకు తెలంగాణే ఫస్ట్ ఛాయిస్ కావాలి.. ఎన్నారైలకు భట్టి విక్రమార్క పిలుపు
-
Brand Value: రిటైర్ అయినా తగ్గని బ్రాండ్ విలువ.. రూ.1,189 కోట్లతో టాప్లో.. కోహ్లీ, ధోనీ కాదండోయ్!
-
WTC 2025-27: ఆస్ట్రేలియా టాప్, భారత్ 5వ స్థానం.. మిగిలిన 9 మ్యాచ్లు డూ ఆర్ డై..
-
Harish Rao: చేనేత కార్మికుల కళా నైపుణ్యానికి, కష్టానికి, అంకితభావానికి సెల్యూట్..
-
Meta: మెటాకు భారీ షాక్.. అమెరికా కోర్టు సంచలన తీర్పు.. 567 మిలియన్ డాలర్స్ చెల్లించాలని ఆదేశం
ట్రెండింగ్
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్లో లాంచ్..!
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!