NASA Artemis 1 Launch: రేపే ఆర్టెమిస్-1 ప్రయోగం.. సిద్ధం చేసిన నాసా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NASA Artemis 1 Launch: చంద్రుడిపైకి వ్యోమనౌకలను పంపేందుకు నాసా చేపట్టిన ఆర్టెమిస్-1 ప్రయోగం సెప్టెంబర్ 3వ తేదీన చేపట్టనున్నారు. ఈ విషయాన్ని నాసా అధికారికంగా ప్రకటించింది. సోమవారమే జరగాల్సిన ఈ ప్రయోగం ఇంధన ట్యాంకులో సమస్య కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. తాజాగా ఆ సమస్యలను సరిచేసి రాకెట్ను ప్రయోగానికి సిద్ధం చేశారు. నాసా ఇప్పటి వరకు నిర్మించిన అత్యంత శక్తిమంతమైన రాకెట్ ఇదే కావడం విశేషం. శనివారం ప్రయోగానికి అనువైన వాతావరణం ఉండే అవకాశాలు 40 శాతం వరకు ఉన్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీంతో దాదాపు 322 అడుగుల పొడవున్న ఈ భారీ రాకెట్ను కెన్నెడీ స్పేస్ సెంటర్లోనే ఉంచారు. ప్రారంభించిన మొదటి ప్రయోగాన్ని ఇంజిన్ ఇబ్బందులతో నిలిపివేసిన తర్వాత నాసా శనివారం తన శక్తివంతమైన తదుపరి తరం చంద్ర రాకెట్ను ప్రయోగించడానికి రెండవ ప్రయత్నం చేస్తోంది.
ఏదేమైనా వాతావరణ సూచన శనివారం నాడు అనుకూలమైన ప్రయోగ పరిస్థితులకు కేవలం 40శాతం అవకాశం ఉందని అంచనా వేస్తోంది. మొదటి ప్రయోగాన్ని ప్రభావితం చేసిన అదే సమస్యలు మళ్లీ కనిపించడానికి ఇప్పటికీ అవకాశం ఉందని నాసా అంగీకరించింది. అన్ని సానుకూలంగా జరిగితే శనివారం మధ్యాహ్నం 2.17 నిమిషాలకు ఈ రాకెట్ ప్రయోగం జరుగుతుంది. ఈ సారి మానవరహిత ఓరియన్ స్పేస్ క్యాప్సుల్ను రాకెట్తో పాటు అంతరిక్షంలోకి పంపనున్నారు.
Also Read
- Explained: ఇథనాల్ పెట్రోల్ వాడకంలో బ్రెజిల్ సక్సెస్.. భారత్లో ఈ85 ఎందుకు సవాల్గా మారుతుంది?
- Jaishankar: యూఎస్ విదేశాంగ కార్యదర్శి రూబియోకి జైశంకర్ ఫోన్.. అమెరికాకు భారత్ బిగ్ వార్నింగ్..
- Fenya: ‘అమమ్మ’ అంటే డబ్బు, ‘చెత్త’ అంటే పోలీసులు..! దొంగలకు ఆయుధంగా మారిన రహస్య భాష..
- Netanyahu: నేను ప్రధానిగా ఉన్నంత కాలం ఇరాన్ అణ్వస్త్రంగా మారదు.. నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు
Bihar: చెవి నొప్పి ఉందని ఆసుపత్రికి వెళ్తే.. చేయి కోల్పోయింది..
50 ఏళ్ల తర్వాత చంద్రునిపై మళ్లీ మనుషులు కాలుమోపేందుకు నాసా ప్రతిష్ఠాత్మకంగా ఆర్టెమిస్ ప్రాజెక్టును చేపట్టింది. సోమవారం ప్రయోగానికి మొత్తం సిద్ధం చేశాక.. ప్రధాన ఇంజిన్లు పనిచేయడానికి అవసరమైన ప్రీలాంఛ్ ఉష్ణోగ్రతను అందుకోవడంలో విఫలం అయ్యాయి. దీంతో ప్రయోగాన్ని చివరి నిమిషంలో నిలిపివేశారు. దీనిపై నాసా ఆర్టెమిస్ లాంఛ్ డైరెక్టర్ ఛార్లీ బ్లాక్వెల్ థాంప్సన్ మాట్లాడుతూ ఈ సారి ఇంజిన్ల కూలింగ్ ప్రక్రియ లాంఛ్ కౌంట్డౌన్కు 30 నిమిషాల ముందే మొదలు పెడతామని పేర్కొన్నారు. చంద్రుడిపై మనిషి కాలుపెట్టి అర్ధశతాబ్దం దాటింది. తొలిసారిగా 1969లో అమెరికాకు చెందిన వ్యోమగామి నీల్ఆర్మ్స్ట్రాంగ్ చంద్రుడిపై కాలు మోపారు. 1969 నుంచి 1972 వరకు అపోలో మిషన్ ద్వారా 24 మంది వ్యోమగాములను నాసా చంద్రుడి వద్దకు పంపింది. వీరిలో 12 మంది చంద్రునిపై కాలుమోపారు. ఆ తర్వాత ఎవ్వరు కూడా జాబిల్లిపై అడుగుపెట్టలేదు. చంద్రుడి మీదకు చివరిసారిగా మనుషులు వెళ్లి వచ్చిన నాసా అపోలో 17 మిషన్కు ఈ ఏడాది డిసెంబర్లో 50 ఏళ్లు పూర్తవుతాయి. 50 ఏళ్ల విరామం తర్వాత ఇప్పుడు చంద్రుడి మీదకు మళ్లీ మనుషులను పంపించటానికి నాసా శ్రీకారం చుడుతోంది. ఈసారి మూన్ మిషన్కు ‘ఆర్టిమిస్ ప్రోగ్రామ్’ అని నాసా పేరు పెట్టింది. ఈ ఆర్టిమిస్ ప్రయోగాలను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చేపడతామని నాసా కొన్నేళ్ల కిందటే ప్రకటించింది. చంద్రుడి మీదకు నాసా సిద్ధం చేసిన ఆర్టెమిస్-1ను శనివారం ప్రయోగించనున్నారు.
తాజావార్తలు
-
Story Board: ట్రంప్ ప్రపంచాన్ని ఏం చేద్దామనుకుంటున్నారు..? యుద్ధం పేరు చెప్పి గేమ్స్ ఏంటి..?
-
Drishyam 3 OTT: మోహన్ లాల్ దృశ్యం 3 ఓటీటీలోకి.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే?
-
Kaala Hiran Controversy : ఆ సినిమా విడుదలను ఆపేయండి… కొత్త వివాదంలో కోర్టుకెక్కిన సల్మాన్ ఖాన్
-
Most Beautiful Waterfalls in India: భారతదేశపు నయాగరా నుంచి దూద్సాగర్ వరకు.. సందర్శించాల్సిన టాప్ జలపాతాలు ఇవే..
-
IAF AN-32: అస్సాంలో IAF AN-32 విమానానికి ప్రమాదం.. ల్యాండింగ్ తర్వాత ఒక్కసారిగా మంటలు!
ట్రెండింగ్
-
Tirumala: అత్యంత అరుదైన దర్శనం.. ‘వ్యూహ లక్ష్మి అచ్చు’ గురించి తెలుసా.?
-
200MP కెమెరా, 5000 నిట్స్ AMOLED డిస్ప్లే, మిలిటరీ గ్రేడ్ రక్షణతో Motorola Moto G Max 5G లాంచ్.!
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!