Mumbai : ముంబై విమానాశ్రయంలో 3.2 కోట్ల విలువైన బంగారం పట్టివేత..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శుక్రవారం, శనివారం మధ్య, ముంబై ఎయిర్పోర్ట్ కస్టమ్స్ అధికారులు ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో వేర్వేరు సందర్భాలలో ఎనిమిది మంది వ్యక్తులను అడ్డగించారు మరియు రూ. 3.2 కోట్ల విలువైన 6.19 కిలోల బంగారంతో పాటుగా మూడు బ్రాండెడ్ వాచీలను స్వాధీనం చేసుకున్నారు.. అధికారులు అడ్డగించిన వారంతా భారతీయ పౌరులని అంతర్జాతీయ విమానాల నుండి ల్యాండ్ అయిన తర్వాత పట్టుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
మొదటి సందర్భంలో, విమానాశ్రయంలో కేరళ వాసి పట్టుబడ్డాడు. ఇండిగో విమానంలో దుబాయ్ నుంచి ముంబైకి వెళుతుండగా అనుమానం వచ్చి పట్టుకోగా రూ. 54 లక్షల విలువైన మూడు బ్రాండెడ్ వాచీలు (రోలెక్స్, పటెక్ ఫిలిప్, బ్రెగ్యుట్)తో పాటు 10.80 గ్రాముల బరువున్న 18 క్యారెట్ల బంగారు కొక్కాలు దాచి ఉంచారు. తన దుస్తులలో తీసుకెళ్తున్నట్లు తెలిపారు.. కొల్హాపూర్కు చెందిన మరో ప్రయాణికుడు 2,250 గ్రాముల బరువున్న రెండు పౌచ్లలో 24 క్యారెట్ల బంగారు డస్ట్ను మైనపులో దాచాడు. అతని లోదుస్తుల లోపల పర్సులు కనిపించాయి.
Also Read
- PM Modi: నార్వే నుంచి ఇటలీకి బయల్దేరిన మోడీ.. జార్జియా మెలోనితో భేటీకానున్న ప్రధాని
- PM Modi: భారత్-నార్వే ప్రపంచ శాంతిని కోరుకుంటున్నాయి.. ఉగ్రవాదం విషయంలో రాజీపడబోమన్న మోడీ
- Donald Trump : ‘మేక్ అమెరికా క్రిస్టియన్’.. అమెరికా రాజకీయాల్లో కొత్త ట్రెండ్.?
- Iran: ఈసారి శత్రువు కాలుదువ్వితే కొత్త యుద్ధం చూస్తారు.. ఇరాన్ వార్నింగ్
అలాగే దుబాయ్ నుంచి వస్తున్న రాయగఢ్, కేరళ, హర్యానాకు చెందిన మరో ముగ్గురు ప్రయాణికులు ప్యాంటు, షూలు, బాడీలో దాచుకున్న 1,570 గ్రాములు, 289 గ్రాములు, 239 గ్రాముల బంగారంతో పట్టుబడ్డారు. సోదాల్లో బంగారం దొరికింది.. బ్యాంకాక్, దమ్మామ్ మరియు రియాద్ నుండి ప్రయాణిస్తున్న మరో ముగ్గురు ప్రయాణికులపై అనుమానం రావడం వారిని కూడా తనిఖీలు చేసి వారి నుండి బంగారం స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకాక్ నుంచి ప్రయాణిస్తున్న ముంబై నివాసి తన పురీషనాళంలో 725 గ్రాముల బరువున్న మైనపులో (మూడు ముక్కలు) 24 KT బంగారు ధూళిని దాచి ఉంచగా, దమ్మామ్ నుండి ప్రయాణిస్తున్న ప్రయాణికుడు తన బూట్లలో 699.30 గ్రాముల బరువున్న 24 KT బంగారు కడ్డీలను (ఆరు ముక్కలు) దాచిపెట్టాడు’ అని చెప్పారు అధికారులు..రియాద్ నుండి ముంబైకి ప్రయాణిస్తున్న కేరళలోని కాసర్గోడ్ నివాసి అయిన ఒక భారతీయ జాతీయుడిని అడ్డగించగా, 415 గ్రాముల (నెట్) బరువున్న మైనపులో (మూడు పౌచ్లు) 24 కెటి బంగారు ధూళిని అతని ప్యాంటు లో దాచిపెట్టినట్లు అధికారి తెలిపారు… మొత్తంగా పట్టుబడిన బంగారం విలువ మూడు కోట్లకు పైనే ఉంటుందని అధికారులు తెలిపారు..
తాజావార్తలు
-
RR Vs LSG: మార్ష్ వీర విహారం.. రాజస్థాన్ రాయల్స్ ముందు భారీ టార్గెట్..
-
Chairmans Desk : ప్రపంచమంతా మాంద్యం గుప్పిట్లో ఉంటే.. దక్షిణాది మాత్రం సేఫ్ జోన్లోనే ఉందా..? |
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Telangana Jobs : మెడికల్ జాబ్స్ అలర్ట్.. 433 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల మెరిట్ లిస్ట్ విడుదల.!
-
PM Modi: నార్వే నుంచి ఇటలీకి బయల్దేరిన మోడీ.. జార్జియా మెలోనితో భేటీకానున్న ప్రధాని
ట్రెండింగ్
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!