Putin-Melania Trump: పుతిన్కు మెలానియా లేఖ.. ఏముందంటే..!
- పుతిన్కు మెలానియా లేఖ
- స్వయంగా అందజేసిన ట్రంప్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అలాస్కాలో ట్రంప్-పుతిన్ భేటీ జరిగింది. ఈ సమావేశం ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఆసక్తి రేపింది. ఇద్దరి భేటీతో మేలు జరుగుతుందని భావించారు. చివరికి ఎలాంటి పురోగతి లేకుండా సమావేశం ముగియడం నిరాశ పరిచింది.
ఇది కూడా చదవండి: Trump-Putin: ట్రంప్-పుతిన్ భేటీ ఆడంబరమేనా? నిపుణులు ఏమంటున్నారంటే..!
Also Read
- Thailand: 11 ఏళ్ల బాలుడి ర్యాష్ డ్రైవింగ్.. 9 మంది సన్యాసుల ప్రాణాలు బలి.! వీడియో వైరల్..
- BLA: గ్వాదర్ కోస్ట్ గార్డ్ క్యాంప్పై దాడి.. 30 మంది పాకిస్తానీ భద్రతా సిబ్బందిని హతమార్చినట్లు బీఎల్ఏ ప్రకటన
- Khamenei: ఖమేనీ అంత్యక్రియల్లో హృదయ విదారక దృశ్యం.. 14 నెలల మనవరాలి పార్థివదేహం
- Pakistan: విదేశీ మహిళలపై పాక్ ఉప ప్రధాని మనవడి గ్యాంగ్ రేప్.
ఇక పుతిన్కు అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ లేఖ రాశారు. ఆ లేఖను అలాస్కా సమావేశంలో పుతిన్కు స్వయంగా ట్రంప్ అందజేశారు. అయితే ఆ లేఖలో ఏముంది అనేది సర్వత్రా ఆసక్తిరేకిత్తించింది. అయితే లేఖలో ప్రధానంగా ఉక్రెయిన్ పిల్లల నిర్బంధ ప్రస్తావన పొందిపరిచారు. 2022లో ఉక్రెయిన్-రష్యా యుద్ధం ప్రారంభమైనప్పుడు.. ఉక్రెయిన్ పిల్లలను రష్యా నిర్బంధించినట్లుగా తెలుస్తోంది. ఆ విషయాన్నే మెలానియి ప్రస్తావించినట్లు శుక్రవారం వైట్హౌస్ తెలిపింది. ఇంతకు మంచి ఏ విషయాలను అధికారులు వెల్లడించలేదు. ఉక్రెయిన్ పిల్లల్ని రష్యా నిర్బంధించడంపై ఆమె ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. పిల్లల్ని తల్లిదండ్రులకు దూరం చేయడం ఏ మాత్రం భావ్యం కాదని పేర్కొ్నట్లు తెలుస్తోంది. గతంలో ఇదే విషయాన్ని యూఎన్ కూడా తప్పుపట్టింది. 10 వేల మంది చిన్నారులను రష్యా నిర్బంధంలో ఉంచడం ఏ మాత్రం భావ్యంకాదని.. రష్యా మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడిందని పేర్కొంది.
ఇది కూడా చదవండి:AI Chatbots: నిజమైన మహిళ అనుకుని.. ఏఐ చాట్ బాట్ తో 76 ఏళ్ల వృద్ధుడు ప్రేమాయణం.. కలవడానికి వెళ్తూ ఘోరం
2022 ఫిబ్రవరిలో మాస్కో దాడి అనంతరం తమ దేశానికి చెందిన వేలాది మంది చిన్నారులను రష్యా తీసుకెళ్లినట్లు ఉక్రెయిన్ ఆరోపించింది. దీన్ని యుద్ధ నేరంగా అభివర్ణించింది. అయితే దుర్భర పరిస్థితుల్లో ఉన్న చిన్నారులను రక్షిస్తున్నామని మాస్కో సమర్థించుకుంది.
2022 నుంచి రష్యా-ఉక్రెయిన్ యుద్ధం జరుగుతోంది. ఇప్పటికే ఇరు దేశాలు చాలా నష్టపోయాయి. దీంతో ట్రంప్-పుతిన్ భేటీతో యుద్ధానికి ఒక ముగింపు లభిస్తుందని భావించారు. చివరికి ఎలాంటి ఒప్పందం జరగకుండా సమావేశం ముగిసింది. ఇది ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మేలు జరుగుతుందని అంతా భావిస్తే.. చివరికి ‘తుస్’ మనిపించారు. ఇక ఇద్దరి భేటీ తర్వాత పుతిన్ మాట్లాడుతూ.. 2022లో ట్రంప్ అధికారంలో ఉండుంటే.. యుద్ధం జరిగేదే కాదన్నారు. ప్రస్తుతానికి ఒక అవగాహనకు వచ్చినట్లు తెలిపారు. ఇక ట్రంప్ మాట్లాడుతూ.. యుద్ధం ముగింపునకు పుతిన్ ఇంకా నిర్ణయానికి రాలేదని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Janhvi Kapoor: ఒక్క ఇన్స్టా పోస్ట్కే అన్ని లక్షలా!… జాన్వీ డిజిటల్ ఆదాయం షాకింగ్
-
Thailand: 11 ఏళ్ల బాలుడి ర్యాష్ డ్రైవింగ్.. 9 మంది సన్యాసుల ప్రాణాలు బలి.! వీడియో వైరల్..
-
Renault Kwid Facelift: రెనాల్ట్ క్విడ్ ఫేస్లిఫ్ట్ విడుదల.. 17 స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లు, రూ.4.52 లక్షలకే..!
-
Ahilyanagar: అదుపుతప్పి బోల్తా పడ్డ స్కూల్ బస్సు.. 50 మంది విద్యార్థులతో వెళ్తుండగా ప్రమాదం.!
-
England Playing XI: వాడు వచ్చేశాడు.. భారత బ్యాటర్లకు దబిడిదిబిడే.. బుడ్డోడు ఆడినా బెదరాల్సిందే!
ట్రెండింగ్
-
Smartphones in Budget: రూ. 15,000 లోపు భారీ బ్యాటరీ లైఫ్ బెస్ట్ 5G స్మార్ట్ఫోన్లు ఇవే.. రెండు రోజుల బ్యాకప్ గ్యారెంటీ!
-
EV కారు కొనాలనుకుంటున్నారా? Hyundai Creta ఎలక్ట్రిక్ కు కొత్త BaaS ప్లాన్.. రూ.7 లక్షల వరకు తగ్గింపు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ అరంగేట్రంపై విమర్శలు.. మా ఇష్టం అంటూ మాజీలకు గట్టిగా ఇచ్చిపడేసిన బీసీసీఐ!
-
Indonesia: దొంగతనానికి వచ్చి ‘మమ్మీ’లుగా మారిపోయారు.. వైరల్ వీడియో
-
Instagram: ఇంస్టాగ్రామ్కు కేంద్రం నోటీసులు.!