Miss Universe beauty pageant: మిస్ యూనివర్స్ అందాల పోటీల్లో పెళ్లైన మహిళలకు అనుమతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Miss Universe to allow married women from 2023: మిస్ యూనివర్స్ అందాల పోటీల్లో పాల్గొనేందుకు కఠినమైన నిబంధనలు ఉంటాయి. ఈ అందాల పోటీల్లో పాల్గొనాలంటే ఖచ్చితం యువతులు పెళ్లి కాని వారై ఉండటంతో, గర్భం ధరించి ఉండకూడదనే నియమాలు ఉన్నాయి. ఈ అర్హతలు కలిగిన వారే పోటీల్లోకి అనుమతించబడతారు. తమ అందాలను, తమ శక్తి సామర్థ్యాలను ప్రదర్శించేందు ప్రతీ ఏడాది అన్ని దేశాల నుంచి కొన్ని వేల మంది ఈ పోటీల్లో నిలుస్తారు. అందాల పోటీలో పెళ్లి కానివారు, పిల్లలు లేని వారు 18-28 ఏళ్ల వయసు ఉన్న యువతులు అర్హులుగా ఉంటారు. అయితే ఇది గతం కొత్తగా.. మిస్ యూనివర్స్ పోటీల్లో నిబంధనలు సవరించారు.
ఇకపై మిస్ యూనివర్స్ పోటీల్లో పెళ్లి అయిన వారు, పిల్లలు ఉన్నవారు కూడా పాల్గొనవచ్చని నిర్ణయం తీసుకుంది. 2023 నుంచి మిస్ యూనివర్స్ పోటీల్లో వీళ్లు కూడా పాల్గొనేందుకు అనుమతి ఇచ్చింది. స్త్రీ తనకు వివాహం అయినా.. కాకపోయినా సమాజంలో మార్పు తీసుకురాగలదనే నిర్వహకులు అభిప్రాయపడ్డారు. ఒక స్త్రీ తన బిడ్డలకు భవిష్యత్తును తీర్చిదిద్దగలిగినప్పుడు.. సమాజం బాగుపడేలా మార్పు తీసుకురాలేదా..? అనే ప్రశ్నలు ఉద్భవిస్తున్న నేపథ్యంలో మిస్ యూనివర్స్ పోటీల్లో పెళ్లైన వారిని కూడా అనుమతిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
Also Read
- Saudi-Israel: హౌతీల నుంచి భారీ ముప్పు.. ఇజ్రాయెల్ సాయం కోరిన సౌదీ!
- Saudi-Houthis: దాడులు తీవ్రం చేసిన హౌతీలు.. అప్రమత్తంగా ఉండాలని పౌరులకు సౌదీ హెచ్చరిక
- Oracle layoffs: ఉదయం 6 గంటలకే ఈమెయిల్.. ఒరాకిల్లో మళ్లీ భారీగా ఉద్యోగాల కోతలు
- Petrol and Diesel Price Hike: పాక్లో మళ్లీ పెరిగిన పెట్రో ధరలు.. లీటర్ రూ.409
Read Also: Ireland: మహిళ వయసు అడిగినందుకు పరిహారం.. రూ.3 లక్షలు చెల్లించిన డోమినోస్
మిస్ యూనివర్స్ పోటీల్లో తీసుకున్న నిర్ణయం పట్ల మిస్ యూనివర్స్ – 2020 ఆండ్రియా మెజా స్పందించారు. టైటిల్ గెలిచిన తర్వాత ఈమె పెళ్లి చేసుకున్నట్లు గతంలో ఆరోపణలు వచ్చాయి. ఈ నిర్ణయాన్ని తాను స్వాగతిస్తున్నట్లు వెల్లడించారు ఆండ్రియా మెజా. గతంలో పురుషులు నాయకత్వ బాధ్యతలు చేపట్టినట్లే.. ప్రస్తుతం మహిళలు కూడా కీలక స్థానాల్లో ఉంటున్నారని ఆమె అన్నారు. కొంత మంది వ్యక్తులు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించవచ్చని.. వారు ఎప్పుడూ కూడా పరిపూర్ణంగా ఉండే స్త్రీని చూడాలని కోరుకోరని విమర్శించారు.
మిస్ యూనివర్స్ పోటీలు ప్రపంచ వ్యాప్తంగా 160పైగా దేశాలకు చెందిన మహిళలు పాల్గొంటారు. 2021లో భారత్ కు చెందిన హర్నాజ్ సంధు మిస్ యూనివర్స్ కిరీటాన్ని దక్కించుకున్నారు. పంజాబ్ చెందిన హర్నాజ్ సంధు ఇజ్రాయిల్ లో ఐలాట్ లో జరిగిన 70వ మిస్ యూనివర్సల్ పోటీల్లో గెలుపొందారు. ఈమె కన్నా ముందు ఇద్దరు భారతీయులు మాత్రమే ఈ ఘనత సాధించారు. 1994లో సుస్మితా సేన్, 2000 లారాదత్తా ఈ ఘనత సాధించిన వారిలో ఉన్నారు.
తాజావార్తలు
-
Erravalli Case : ఎర్రవల్లి పసుపు నీళ్ల వివాదంలో ప్రభుత్వానికి షాక్
-
ICC Rankings: ఆసియా కప్ దెబ్బకు ఐసీసీ ర్యాంకింగ్స్ తారుమారు.. టాప్లోకి దూసుకెళ్లిన ఇండియన్ ప్లేయర్స్..
-
Chandrasekhar Reddy: గేట్లు బద్దలు కొట్టి, సెక్యూరిటీని బెదిరించి.. అల్లు అర్జున్ మామ దౌర్జన్యం..?
-
Saudi-Israel: హౌతీల నుంచి భారీ ముప్పు.. ఇజ్రాయెల్ సాయం కోరిన సౌదీ!
-
Irctc Tickets Booking: OpenAI మరో సంచలనం.. ఏఐతో ఆటోమేటిక్గా రైలు టికెట్లు బుకింగ్
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?