Round The World Cruise: ప్రయాణికుడ్ని వదిలి క్రూజ్ షిప్ జంప్.. 17 లక్షలు స్వాహా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Man Spent 17 Lakh On Round-The-World Cruise It Left Without Him: పాపం ఆ వ్యక్తి.. ప్రపంచాన్ని చుట్టేద్దామని రూ.17 లక్షలకు పైగా ఖర్చు వెచ్చించాడు. తనకోసం క్రూజ్ షిప్లో ఒక బెర్త్ సొంతం చేసుకున్నాడు. కానీ.. మార్గమధ్యంలో జరిగిన కొన్ని పరిణామాల కారణంగా, ఆ షిప్ అతడ్ని వదిలేసి వెళ్లిపోయింది. తన మెడికల్ చెకప్స్ చేయించుకొని ఆ వ్యక్తి తిరిగొచ్చేలోపే.. ఆ షిప్ జంప్ అయిపోయింది. దీంతో చేసేదేమీ లేక.. సదరు వ్యక్తి తిరిగి తన ఇంటి దారి పట్టాల్సి వచ్చింది. ఆ వివరాల్లోకి వెళ్తే.. యూకేకి చెందిన క్రిస్టోఫర్ ఛాపెల్ (72 ఏళ్లు) తన జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించేశాడు. చివరగా అతనికి మిగిలింది ఒకే ఒక్క కల.. అదే ప్రపంచాన్ని చుట్టేయడం. ఒక క్రూజ్ షిప్ యూకే నుంచి వరల్డ్ టూర్కి బయలుదేరుతోందన్న విషయం తెలిసి, ఆ షిప్లో 17500 పౌండ్స్ (రూ.17.83 లక్షలు) వెచ్చించి, తన కోసం బెర్తు బుక్ చేసుకున్నాడు.
EasyJet Flight: అత్యవసర ల్యాండింగ్ చేయించారు.. అడ్డంగా బుక్ అయ్యారు
Also Read
ఈ ఏడాది ప్రారంభంలో ఆ షిప్ యూకే నుంచి బయలుదేరింది. అయితే.. మార్గమధ్యంలో క్రిస్టోఫర్ కాస్త అస్వస్థతకు గురయ్యాడు. దీంతో.. అతడు మెడికల్ చెకప్ కోసం క్రూజ్ షిప్ వైద్యుడ్ని సంప్రదించాడు. ఆ వైద్యుడు క్రిస్టోఫర్ని పరీక్షించిన అనంతరం.. ఓసారి ఫుల్ చెకప్ చేయించుకోవాలని, ఆ తర్వాత షిప్లో అనుమతిస్తామని చెప్పాడు. ఆ వైద్యుడి సూచన మేరకు.. మార్చి 4వ తేదీన ఫిలిప్పీన్స్లోని పలావాన్ ద్వీపంలో క్రూజ్ షిప్ నుంచి దిగాడు. అతడు పరీక్షలు చేయించుకోగా.. అదృష్టవశాత్తూ క్రిస్టోఫర్కు తేలికపాటి హార్ట్ స్ట్రోక్ మాత్రమే వచ్చినట్టు తేలింది. కానీ.. బ్యాడ్ లక్ ఏమిటంటే, క్రిస్టోఫర్ వైద్యు పరీక్షలు పూర్తయ్యే సమయానికి ఆ ఓడ అతడ్ని వదిలి, అక్కడి నుంచి వెళ్లిపోయింది. అప్పుడు క్రిస్టోఫర్, అతని మేనకోడలు వెంటనే క్రూజ్ షిప్ సిబ్బంది, ప్రయాణ బీమా సంస్థలను సంప్రదించారు. క్రిస్టోఫర్ పరిస్థితి విషమంగా ఉందని తేలడంతో, ఆయన్ను వదిలి వెళ్లాల్సి వచ్చిందని, ఇప్పుడు తిరిగి రావడం కష్టతరం అవుతుందని వాళ్లు సమాధానం ఇచ్చారు.
Ex-Boyfriend Acid Attack: పెళ్లిలో షాకింగ్ ఘటన.. వరుడిపై యువతి యాసిడ్ దాడి
ఇంకేముంది.. తిరిగి ఇంటికి వెళ్లేందుకు క్రిస్టోఫర్ సిద్ధమయ్యాడు. అయితే.. విమాన మార్గం ద్వారా వెళ్లడం వీలు కాదని ఎయిర్లైన్ సంస్థలు అతనికి ఝలక్ ఇచ్చాయి. చివరికి ఏప్రిల్ 7వ తేదీన తనకు విమానంలో వెళ్లేందుకు అనుమతి లభించడంతో.. క్రిస్టోఫర్ తిరిగి యూకేలోని తన ఇంటికి వెళ్లిపోయాడు. ఈ ఘటనపై క్రిస్టోఫర్ మాట్లాడుతూ.. తనని ఓడ నుంచి బయటకు పంపిన వ్యక్తి పూర్తిగా పరీక్షించలేదని వాపోయాడు. వైద్య పరీక్షలకు ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి, ఆ ఓడ తన కోసం వేచి ఉండాల్సిందన్నాడు. తన పరిస్థితి నిజంగానే క్లిష్టంగా ఉన్నట్లైతే.. తనకు మరింత సమాచారం ఎందుకు ఇవ్వలేదని, మెడికల్ రిపోర్ట్ ఎక్కడంటూ మండిపడ్డాడు. ప్రస్తుతం అతడు షిప్లో ఉన్న లగేజ్ కోసం వేచి చూస్తున్నాడు.
తాజావార్తలు
-
Arun Matheswaran: స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ను హీరోగా ఎలా ఒప్పించాడో చెప్పిన డీసీ డైరెక్టర్!
-
Fake NOC Colleges: ఫేక్ ఫైర్ ఎన్ఓసీలతో అనుమతులు పొందిన 52 కళాశాలలు.. కాలేజీల పూర్తి లిస్ట్ ఇదే..
-
Modi-Netanyahu: మోడీకి నెతన్యాహు ఫోన్.. ఉద్రిక్తతల వేళ కీలక సంభాషణ
-
Botsa Satyanarayana: డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలి.. మంత్రి లోకేష్ రాజీనామా చేయాలి..
-
West Bengal: మసీదు లౌడ్స్పీకర్లపై బెంగాల్లో రగడ.. అమిత్ షా ముందు పంచాయతీ..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!