Maldives: గత అధ్యక్షుడు ఓ “విదేశీ రాయబారి” చెప్పినట్లు విన్నాడు: మహ్మద్ ముయిజ్జూ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maldives: మాల్దీవుల కొత్త అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జూ మరోసారి పరోక్షంగా భారత వ్యతిరేకతను బయటపెట్టాడు. అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టినప్పటి నుంచి చైనాకు అనుకూలంగా వ్యవహరిస్తూ, భారత్ వ్యతిరేక విధానాలను ప్రోత్సహిస్తున్నారు. ‘‘ఇండియా ఔట్’’ నినాదంలో అధికారంలోకి వచ్చిన ఇతను, వచ్చీ రాగానే మాల్దీవుల్లోని భారత సైనికులను వెళ్లిపోవాలని ఆదేశించారు. మరోవైపు చైనా ప్రయోజనాలకు పెద్ద పీట వేస్తున్నాడు.
తాజాగా మాజీ అధ్యక్షుడు ఇబ్రహీం మహ్మద్ సోలిహ్పై విమర్శలు గుప్పించారు. సోలిహ్ భారత దేశానికి మంచి మిత్రుడు. అధ్యక్షుడు ముయిజ్జూ మాట్లాడుతూ.. సోలిహ్ తన పదవీ కాలంలో ఓ విదేశీ రాయబారి ఆదేశాల మేరకు పనిచేశారని ఆరోపించారు. దేశ స్వతంత్రతను విదేశాల చేతిలో పెట్టాడంటూ మండిపడ్డాడు. టర్కీ నుంచి కొనుగోలు చేసిన డ్రోన్ల కొనుగోలు ఒప్పందంపై ప్రతిపక్షాల నుంచి ఎదురవుతున్న విమర్శల నేపథ్యంలో ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో సోలిహ్పై వ్యాఖ్యలు చేశాడు.
Also Read
- PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
- Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
- Epstein: ఎప్స్టీన్ కేసులో సంచలనం.. వెలుగులోకి కొత్త బాధితులు..
- PM Modi: స్వీడన్లో మోడీకి ఘన స్వాగతం.. గ్రిపెన్ ఫైటర్ జెట్ల ఎస్కార్ట్ వైరల్
Read Also: Amit Shah: అమిత్ షాపై “రౌడీ” వ్యాఖ్యలు.. సీఎం కొడుకుపై ఈసీకి బీజేపీ ఫిర్యాదు..
2018-23 వరకు అధికారంలో ఉన్న మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీకి పార్లమెంట్లో పూర్తి మెజారిటీ ఉన్నప్పటికీ, దేశ స్వతంత్రను కాపాడటంలో విఫమైందని ఆరోపించారు. దేశాన్ని విదేశీ చేతుల్లో పెట్టాడని ఆరోపించారు. ఆర్థికంతో సహా అన్ని విషయాల్లో స్వాతంత్ర్యాన్ని కోల్పోయామని, ఫలితంగా దేశానికి తీవ్ర నష్టం వాటిల్లిందని అన్నారు. ప్రస్తుతం దేశాన్ని మళ్లీ గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నామని, మేం చేస్తున్న ప్రయత్నాలను వారు అంగీకరించరని ముయిజ్జూ అన్నారు.
గత అధ్యక్షుడు సోలిహ్ ప్రభుత్వం చాలా విషయాల్లో భారత్కి మంచి మిత్రుడిగా ఉన్నారు. చైనాను కాదని భారత అనుకూల విధానాలను అనుసరించారు. పాలనాపరంగా భారత్పై సోలిహ్ ఆధారపడ్డారని ప్రస్తుతం ముయిజ్జూకు చెందిన పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్(పీఎన్సీ) ఆరోపిస్తోంది. తాజాగా గత ప్రభుత్వాన్ని విమర్శించడం చూస్తుంటే పరోక్షంగా భారత్ గురించి ఉద్దేశించి వ్యాఖ్యానిస్తున్నాడని తెలుస్తోంది. భారత్ని ఇన్నాళ్లుగా తీవ్రంగా విమర్శిస్తూ వస్తున్న ముయిజ్జూ ఇటీవల మాట్లాడుతూ.. రుణాల నుంచి విముక్తి పొందేందుకు భారత్ తమకు ఎన్నటికి మిత్రదేశమని వ్యాఖ్యానించారు. రుణాల నుంచి విముక్తి కోరుతున్నట్లు తెలిపారు.
తాజావార్తలు
-
KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
-
PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
-
Ragi Mixture: సాయంత్రం స్నాక్స్లోకి క్రిస్పీ ‘రాగి మిక్సర్’.. సింపుల్గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..