Canada: మహత్మాగాంధీ విగ్రహం ధ్వంసం.. ప్రధానిపై విద్వేష రాతలు.. ఖలిస్తానీవాదుల అరాచకం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mahatma Gandhi statue defaced: ఖలిస్తానీ వేర్పాటువాదులు రెచ్చిపోతున్నారు. ఇండియాకు వ్యతిరేకంగా విదేశాల్లో విధ్వంసానికి పాల్పడుతున్నారు. బ్రిటన్, కెనడా, యూఎస్ఏ, ఆస్ట్రేలియా ప్రాంతాల్లో హిందూ దేవాలయాలు, రాయబార కార్యాలయాలపై దాడులకు తెగబడుతున్నారు. తాజాగా కెనడా ఓంటారియో ప్రావిన్స్ లో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. హామిల్టన్ పట్టణంలోని సిటీ హాల్ సమీపంలో గురువారం తెల్లవారుజామున ఈ సంఘటన జరిగింది. ఈ ప్రాంతంలో 2012 నుంచి విగ్రహం ఉంది.
భారత ప్రభుత్వం బహుమతిగా ఇచ్చిన ఆరుడుగుల పొడవైన కాంస్య విగ్రహాన్ని ధ్వంసం చేయడంతో పాటు గ్రాఫిటీతో విద్వేషపూరిత రాతలు రాశారు. ప్రధాని నరేంద్రమోదీని విద్వేషపూరిత వ్యాఖ్యలను రాశారు. విగ్రహం వద్ద ఉన్న వాకింగ్ స్టిక్ కు ఖలిస్తానీ జెండాను ఎగరేశారు. తెల్లవారుజామున ఈ విధ్వంసాన్ని స్థానిక అధికారులు గమనించి విగ్రహాన్ని శుభ్రం చేయించారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు హామిల్టన్ పోలీసులు వెల్లడించారు.
Also Read
- US Airstrike: తారాస్థాయికి చేరిన అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు.. రంగంలోకి బీ-1 బాంబర్!
- Ebola: ఎబోలా విజృంభణ.. వెయ్యికి పైగా జనాలు మృతి.. WHO వార్నింగ్..
- Donald Trump: ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలే టార్గెట్.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్..
- Pakistan: మధ్యవర్తిత్వం చేశాం కదా $10 బిలియన్లు ఇవ్వండి.. అమెరికాను కోరిన పాకిస్తాన్..
Read Also: Girl Kidnap: 12ఏళ్ల బాలిక కిడ్నాప్.. పదిరోజుల తరువాత పోలీసులకు ఫిర్యాదు
గత ఫిబ్రవరిలో గ్రేటర్ టొరంటో ఏరియాలోని హిందూ ఆలయంపై, ఎనిమిది నెలల క్రితం ఇదే తరహాలో శ్రీరామ మందిరంపై దాడులు చేశారు. జనవరి 30న బ్రాంప్టన్ లోని గౌరీ శంకర్ మందిర్, రిచ్ మండ్ హిల్ లోని విష్ణు మందిర్ ఆలయం వద్ద ఉన్న మహాత్మా గాంధీ విగ్రహాన్ని గతేడాది జూలై ధ్వంసం చేశారు. సెప్టెంబర్ నెలలో టొరంటోని బీఏపీఎస్ శ్రీ స్వామినారాయన్ మందిర్ ముందు ద్వారం వద్ద ఇటువంటి విధ్వంసమే జరిగింది. ఈ ఘటనల వెనక ఉన్నవారిని ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదు. ఖలిస్తానీ వేర్పాటు వాదులు, సిఖ్ ఫర్ జస్టిస్(ఎస్ఎఫ్జే) వారి ప్రయేయం ఉందని భారత్ చాలా సార్లు కెనడా ప్రభుత్వానికి తెలిపింది.
ఖలిస్తానీ వేర్పాటువాద నేత, వారిస్ పంజాబ్ దే నాయకుడు అమృత్ పాల్ సింగ్ కోసం పంజాబ్ పోలీసులు వేట కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇతడికి మద్దతుగా వేర్పాటువాదులు విదేశాల్లో భారత దేశాన్ని టార్గెట్ చేస్తున్నారు. గత ఆదివారం, బుధవారాల్లో యూకే లండన్ లోని భారత రాయబార కార్యాలయంపై ఖలిస్తానీ మద్దతుదారులు దాడి చేశారు.
తాజావార్తలు
-
Vijayashanti: నటించాలని లేదు కానీ.. విజయశాంతి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kandula Jessie: 108 దేశాలు, 12 వేల మంది పోటీదారులు.. ప్రపంచ అంతరిక్ష మిషన్కు ఎంపికైన ఏపీ ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని!
-
AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్, నేతన్నలకు భరోసా..
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Yuvraj Singh: 2027 వరల్డ్కప్కు యువరాజ్ జట్టు ఇదే.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లకు దక్కని చోటు!
ట్రెండింగ్
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?
-
Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!
-
6 ఏళ్ల తర్వాత ‘S’ సిరీస్ కమ్బ్యాక్.. ప్రీమియం ఫీచర్లతో అతి త్వరలో రాబోతున్న Vivo S2 స్మార్ట్ ఫోన్.!