Canada: మహత్మాగాంధీ విగ్రహం ధ్వంసం.. ప్రధానిపై విద్వేష రాతలు.. ఖలిస్తానీవాదుల అరాచకం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mahatma Gandhi statue defaced: ఖలిస్తానీ వేర్పాటువాదులు రెచ్చిపోతున్నారు. ఇండియాకు వ్యతిరేకంగా విదేశాల్లో విధ్వంసానికి పాల్పడుతున్నారు. బ్రిటన్, కెనడా, యూఎస్ఏ, ఆస్ట్రేలియా ప్రాంతాల్లో హిందూ దేవాలయాలు, రాయబార కార్యాలయాలపై దాడులకు తెగబడుతున్నారు. తాజాగా కెనడా ఓంటారియో ప్రావిన్స్ లో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. హామిల్టన్ పట్టణంలోని సిటీ హాల్ సమీపంలో గురువారం తెల్లవారుజామున ఈ సంఘటన జరిగింది. ఈ ప్రాంతంలో 2012 నుంచి విగ్రహం ఉంది.
భారత ప్రభుత్వం బహుమతిగా ఇచ్చిన ఆరుడుగుల పొడవైన కాంస్య విగ్రహాన్ని ధ్వంసం చేయడంతో పాటు గ్రాఫిటీతో విద్వేషపూరిత రాతలు రాశారు. ప్రధాని నరేంద్రమోదీని విద్వేషపూరిత వ్యాఖ్యలను రాశారు. విగ్రహం వద్ద ఉన్న వాకింగ్ స్టిక్ కు ఖలిస్తానీ జెండాను ఎగరేశారు. తెల్లవారుజామున ఈ విధ్వంసాన్ని స్థానిక అధికారులు గమనించి విగ్రహాన్ని శుభ్రం చేయించారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు హామిల్టన్ పోలీసులు వెల్లడించారు.
Also Read
- Trump: ముదురుతోన్న అమెరికా-కెనడా వాణిజ్య యుద్ధం.. కార్నీపై ట్రంప్ ఆగ్రహం
- Chatgpt: చాట్ జీపీటీలో అంతరాయం.. వినియోగదారుల్లో ఆందోళన
- Jaishankar-Zelenskyy: కీవ్లో జెలెన్స్కీతో జైశంకర్ భేటీ.. యుద్ధంలో శాంతి ప్రయత్నాలపై చర్చ
- Tata Chemicals: టాటా కెమికల్స్కు కెన్యా షాక్.. వెళ్లిపోవాలని అధ్యక్షుడి ఆదేశం..
Read Also: Girl Kidnap: 12ఏళ్ల బాలిక కిడ్నాప్.. పదిరోజుల తరువాత పోలీసులకు ఫిర్యాదు
గత ఫిబ్రవరిలో గ్రేటర్ టొరంటో ఏరియాలోని హిందూ ఆలయంపై, ఎనిమిది నెలల క్రితం ఇదే తరహాలో శ్రీరామ మందిరంపై దాడులు చేశారు. జనవరి 30న బ్రాంప్టన్ లోని గౌరీ శంకర్ మందిర్, రిచ్ మండ్ హిల్ లోని విష్ణు మందిర్ ఆలయం వద్ద ఉన్న మహాత్మా గాంధీ విగ్రహాన్ని గతేడాది జూలై ధ్వంసం చేశారు. సెప్టెంబర్ నెలలో టొరంటోని బీఏపీఎస్ శ్రీ స్వామినారాయన్ మందిర్ ముందు ద్వారం వద్ద ఇటువంటి విధ్వంసమే జరిగింది. ఈ ఘటనల వెనక ఉన్నవారిని ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదు. ఖలిస్తానీ వేర్పాటు వాదులు, సిఖ్ ఫర్ జస్టిస్(ఎస్ఎఫ్జే) వారి ప్రయేయం ఉందని భారత్ చాలా సార్లు కెనడా ప్రభుత్వానికి తెలిపింది.
ఖలిస్తానీ వేర్పాటువాద నేత, వారిస్ పంజాబ్ దే నాయకుడు అమృత్ పాల్ సింగ్ కోసం పంజాబ్ పోలీసులు వేట కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇతడికి మద్దతుగా వేర్పాటువాదులు విదేశాల్లో భారత దేశాన్ని టార్గెట్ చేస్తున్నారు. గత ఆదివారం, బుధవారాల్లో యూకే లండన్ లోని భారత రాయబార కార్యాలయంపై ఖలిస్తానీ మద్దతుదారులు దాడి చేశారు.
తాజావార్తలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. కూటమిలో గ్యాప్ వద్దు.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Off The Record: కేసీఆర్ సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తారా..?
-
Nitin Gadkari: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు.. గడ్కరీ కీలక ప్రకటన
-
Trump: ముదురుతోన్న అమెరికా-కెనడా వాణిజ్య యుద్ధం.. కార్నీపై ట్రంప్ ఆగ్రహం
-
Konda Surekha : కొండా సురేఖకు ఫైనల్ షాక్.. బర్తరఫ్కు గవర్నర్ ఓకే..
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!