Canada: మహత్మాగాంధీ విగ్రహం ధ్వంసం.. ప్రధానిపై విద్వేష రాతలు.. ఖలిస్తానీవాదుల అరాచకం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mahatma Gandhi statue defaced: ఖలిస్తానీ వేర్పాటువాదులు రెచ్చిపోతున్నారు. ఇండియాకు వ్యతిరేకంగా విదేశాల్లో విధ్వంసానికి పాల్పడుతున్నారు. బ్రిటన్, కెనడా, యూఎస్ఏ, ఆస్ట్రేలియా ప్రాంతాల్లో హిందూ దేవాలయాలు, రాయబార కార్యాలయాలపై దాడులకు తెగబడుతున్నారు. తాజాగా కెనడా ఓంటారియో ప్రావిన్స్ లో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. హామిల్టన్ పట్టణంలోని సిటీ హాల్ సమీపంలో గురువారం తెల్లవారుజామున ఈ సంఘటన జరిగింది. ఈ ప్రాంతంలో 2012 నుంచి విగ్రహం ఉంది.
భారత ప్రభుత్వం బహుమతిగా ఇచ్చిన ఆరుడుగుల పొడవైన కాంస్య విగ్రహాన్ని ధ్వంసం చేయడంతో పాటు గ్రాఫిటీతో విద్వేషపూరిత రాతలు రాశారు. ప్రధాని నరేంద్రమోదీని విద్వేషపూరిత వ్యాఖ్యలను రాశారు. విగ్రహం వద్ద ఉన్న వాకింగ్ స్టిక్ కు ఖలిస్తానీ జెండాను ఎగరేశారు. తెల్లవారుజామున ఈ విధ్వంసాన్ని స్థానిక అధికారులు గమనించి విగ్రహాన్ని శుభ్రం చేయించారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు హామిల్టన్ పోలీసులు వెల్లడించారు.
Also Read
- Petrol Prices: పొరుగు దేశంలో భారీగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు.. లీటరుకు రూ.6 తగ్గిస్తూ ప్రభుత్వం సంచలన నిర్ణయం!
- Kyiv Air Strike: దద్దరిల్లిన ఉక్రెయిన్ రాజధాని.. యుద్ధ రంగంలోకి ‘ఒరేశ్నిక్’ హైపర్సోనిక్ మిస్సైల్!
- Iran: ఇరాన్ సంచలన నిర్ణయం.. ప్రపంచ దేశాలకు బిగ్ రిలీఫ్! హోర్ముజ్ జలసంధిపై బిగ్ అనౌన్స్మెంట్..
- Pakistan: హైజాక్ చేసిన అదే రైలు.. "జాఫర్ ఎక్స్ప్రెస్"నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు..?
Read Also: Girl Kidnap: 12ఏళ్ల బాలిక కిడ్నాప్.. పదిరోజుల తరువాత పోలీసులకు ఫిర్యాదు
గత ఫిబ్రవరిలో గ్రేటర్ టొరంటో ఏరియాలోని హిందూ ఆలయంపై, ఎనిమిది నెలల క్రితం ఇదే తరహాలో శ్రీరామ మందిరంపై దాడులు చేశారు. జనవరి 30న బ్రాంప్టన్ లోని గౌరీ శంకర్ మందిర్, రిచ్ మండ్ హిల్ లోని విష్ణు మందిర్ ఆలయం వద్ద ఉన్న మహాత్మా గాంధీ విగ్రహాన్ని గతేడాది జూలై ధ్వంసం చేశారు. సెప్టెంబర్ నెలలో టొరంటోని బీఏపీఎస్ శ్రీ స్వామినారాయన్ మందిర్ ముందు ద్వారం వద్ద ఇటువంటి విధ్వంసమే జరిగింది. ఈ ఘటనల వెనక ఉన్నవారిని ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదు. ఖలిస్తానీ వేర్పాటు వాదులు, సిఖ్ ఫర్ జస్టిస్(ఎస్ఎఫ్జే) వారి ప్రయేయం ఉందని భారత్ చాలా సార్లు కెనడా ప్రభుత్వానికి తెలిపింది.
ఖలిస్తానీ వేర్పాటువాద నేత, వారిస్ పంజాబ్ దే నాయకుడు అమృత్ పాల్ సింగ్ కోసం పంజాబ్ పోలీసులు వేట కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇతడికి మద్దతుగా వేర్పాటువాదులు విదేశాల్లో భారత దేశాన్ని టార్గెట్ చేస్తున్నారు. గత ఆదివారం, బుధవారాల్లో యూకే లండన్ లోని భారత రాయబార కార్యాలయంపై ఖలిస్తానీ మద్దతుదారులు దాడి చేశారు.
తాజావార్తలు
-
PBKS: ఒక్క మ్యాచ్తో ముగ్గురి కథ క్లోజ్.. పాపం సర్పంచ్ సాబ్ ఆశలను ముంచేసిన ‘వాంఖేడే’ పోరు..
-
Virat Kohli: ఈ గడ్డం ఏంటి బాబోయ్.. గిల్ కొత్త లుక్పై కోహ్లీ సెటైర్లు.. వీడియో వైరల్
-
Petrol Prices: పొరుగు దేశంలో భారీగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు.. లీటరుకు రూ.6 తగ్గిస్తూ ప్రభుత్వం సంచలన నిర్ణయం!
-
CM Revanth Reddy: తెలంగాణ మహిళలకు రేవంత్ సర్కార్ కానుక.. రేపే ప్రారంభం..
-
Aayan: ‘మీట్ అవర్ వైజాగ్ హీరో’.. అక్కయ్యపాలెం టు హైదరాబాద్.. అయాన్ ఎమోషనల్ కామెంట్స్!
ట్రెండింగ్
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!