సముద్రంలో కూలిపోయిన హెలికాప్టర్.. ఈత కొడుతూ ఒడ్డుకు చేరిన మంత్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘భూమిపై నూకలు ఉంటే ఎలాగైనా బతుకుతాడు’ అని పెద్దలు చెబుతుంటారు.. అది నూటికి నూరుపాళ్లు నిజమని రుజువైంది.. ఎందుకంటే.. సముద్రంలో హెలికాప్టర్ కుప్పకూలిపోయింది.. ఇక, ఎవ్వరూ ప్రాణాలతో బయటపడే అవకాశం లేదు.. కానీ, 57 ఏళ్ల వయసులోనూ ఏమాత్రం ధైర్యాన్ని కోల్పోకుండా.. ఏకంగా 12 గంటల పాటు ఈత కొడుతూ ఒడ్డుకు చేరిన మంత్రి అందరినీ ఔరా! అనిపించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. హిందూ మహాసముద్రంలో మడగాస్కర్ మంత్రి సెర్జ్ గెల్లె ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కుప్పకూలిపోయింది.. ప్రమాద సమయంలో.. హెలికాప్టర్లో మొత్తం నలుగురు ఉన్నా.. మిగతావారు ఏమయ్యారో తెలియదు కానీ.. మంత్రి సెర్జ్ గెల్లె మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు.
ఇక, ఈ ఘటనపై తన అనుభవాన్ని.. ప్రాణాలతో బయటపడిన విధాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు మంత్రి సెర్జ్ గెల్లె.. ప్రమాదం జరిగిన సమయంలో హెలికాప్టరులో మేం నలుగురం ప్రయాణం చేస్తున్నాం.. నేను పైలెట్ వెనుక కూర్చున్నాను.. ఒక్కసారిగా ప్రమాదం జరిగింది.. నాకు లైఫ్ జాకెట్ కూడా లేదు.. కానీ, నేను సీటును విప్పి దానిని ఉపయోగించాను, నా బూట్లు, బెల్టు, ఇతర బరువైన వస్తువులను అన్నీ తీసేసి సముద్రంలో ఈదటం ప్రారంభించాను. 12 గంటల పాటు సముద్రంలో ఈదుతూ వచ్చి ఒడ్డుకు చేరాను.. ఈ ప్రమాదంలో నా సెల్ ఫోన్ పోగొట్టుకున్నాను అంటూ ట్వీట్ చేశారు. ఇక, తాను ప్రాణాలతో బయటపడినందుకు దేవుడికి మంత్రి ధన్యవాదాలు తెలిపారు. తనతో పాటు ప్రయాణం చేసిన స్నేహితులు బతికి ఉన్నారో లేదో తెలియదు అంటూ విచారం వ్యక్తం చేశారు మంత్రి.. ఇక, మంత్రిగారి ధైర్యసాహాసాలపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది.. అసలైన హీరో మేరేనంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు..
Also Read
- US: అమెరికాస్ గాట్ టాలెంట్ షోలో అదరగొట్టిన చైనా రోబోలు.. వీడియో వైరల్
- Pakistan: పాక్లో ఇంధన మంటలు.. రూ.400కు చేరిన లీటర్ పెట్రోల్.. గాడిదలతో నాయకుల నిరసన
- Imran Khan: ‘‘బ్రిటన్ జోక్యం చేసుకోవాలి’’.. ఇమ్రాన్ఖాన్పై యూకే మాజీ ప్రధాని కీలక వ్యాఖ్యలు..
- Netherlands: విమానం గాల్లో ఉండగా పేలిన పవర్ బ్యాంక్.. షాకైన ప్రయాణికులు.. ఆ తర్వాత ఏమైందంటే..!
కాగా, సోమవారం ఈ ప్రమాదం జరిగిన తర్వాత వారికోసం అన్వేషణ కొనసాగించారు పోలీసులు.. వారు తెలిపిన వివరాల ప్రకారం, ప్రమాదానికి గల కారణాలు వెంటనే తెలియరాలేదు. దేశ పోలీసు సెక్రటరీ ఆఫ్ స్టేట్ సెర్జ్ గెల్లె, పోలీసు అధికారి మంగళవారం ఉదయం విడివిడిగా ఒడ్డుకు చేరుకున్నారు. మడగాస్కర్ యొక్క ఈశాన్య తీరంలో ఓడ ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని పరిశీలించడానికి హెలికాప్టర్ లో వెళ్లిన సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది.. ఇక, ఓడ ప్రమాదంలో శిథిలాల నుంచి మరో 18 మృతదేహాలను రెస్క్యూ సిబ్బంది వెలికితీసినట్లు చెబుతున్నారు.. దీంతో ఆ ఘటనలో మృతుల సంఖ్య 39కి చేరింది. ప్రమాద సమయంలో బోటులో మొత్తం 130 మంది ప్రయాణికులు ఉండగా, అందులో 45 మందిని రక్షించారు.
తాజావార్తలు
-
No UPI-Only Cash: నో యూపీఐ ఓన్లీ క్యాష్.. దుకాణాల ముందు ప్రత్యక్షమవుతున్న బోర్డులు..
-
Rahul Gandhi: ఈ వ్యవస్థలో విద్యార్థులు భవిష్యత్ను చూడలేకపోతున్నారు.. రాహుల్గాంధీ కీలక వ్యాఖ్యలు
-
BJP: ‘‘ప్రతిధ్వని’’ ఎక్కడ.? ‘‘ధమకా’’ ఇక్కడే.. రాహుల్పై బీజేపీ సెటైర్లు..
-
Samsung Galaxy S27 Ultra: శాంసంగ్ గెలాక్సీ S27 అల్ట్రా.. భారత్లో దీని ధర ఎంతో తెలుసా..?
-
Danam Nagender : దానం నాగేందర్ కేసులో బిగ్ ట్విస్ట్.. సుప్రీంకోర్టుకు అప్పీల్
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!