Iskcon: ఆ పూరీ జగన్నాథుడే ట్రంప్ను రక్షించాడు..
- ట్రంప్ ప్రాణాలతో బయటపడటానికి పూరీ జగన్నాథుడి అనుగ్రహమే కారణం..
- రథయాత్రతో ట్రంప్కు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసిన అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం..
- ప్రపంచవ్యాప్తంగా జగన్నాథుడి రథయాత్ర కొనసాగుతుంది: ఇస్కాన్
Iskcon: అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష రేసులో ఉన్న డొనాల్డ్ ట్రంప్పై హత్యాయత్నంతో ప్రపంచమంతా ఒక్కసారిగా షాక్కు గురైయ్యారు. అయితే, ఆయన ప్రాణాలతో బయటపడటానికి పూరీ జగన్నాథుడి కృపే కారణమని అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం తెలిపింది. రథయాత్రతో ట్రంప్కు ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది. ఇది కచ్చితంగా ఆ పూరీ జగన్నాథుడి కృపే.. 48 ఏళ్ల క్రితం రథయాత్రకు ట్రంప్ సహకారం అందించాగా.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా రథయాత్ర ఉత్సవాలు కొనసాగుతున్నాయి.. ఈ సమయంలోనే ఆయనపై హత్యాయత్నం జరగటం.. ఆ భగవంతుడి అనుగ్రహమే ఆయన్ను రక్షించిందని ఇస్కాన్ ప్రతినిధి రాధారమణ్ దాస్ పేర్కొన్నారు. 1976లో ఇస్కాన్ భక్తులు రథయాత్ర కోసం రథాలు సిద్ధం చేసుకునేందుకు ఉచితంగా తన ట్రైన్యార్డ్ను ఇచ్చి సహకరించారని వెల్లడించారు.
Read Also: Danger Stunt At Mumbai: ముంబైలో యువకుడి ప్రమాదకర విన్యాసాలు.. ఆగ్రహించిన నెటిజన్స్..
Also Read
- UAE OPEC Exit: యూఏఈ ఒపెక్ ఎగ్జిట్.. భారత్కు లాభం, పాకిస్తాన్కు నష్టం..
- Donald Trump: ట్రంప్ను రోస్ట్ చేసిన కింగ్ చార్లెస్.. మేము లేకపోతే మీరు ఫ్రెంచ్ మాట్లాడేవారంటూ ఎగతాళి
- Ali Pervaiz Malik: పాక్ మంత్రి షాకింగ్ వ్యాఖ్యలు.. మా దగ్గర ఒక్క రోజుకు కూడా పెట్రోల్ లేదు.. భారత్తో మనం పోల్చుకోలేము
- UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
కాగా, పెన్సిల్వేనియాలోని బట్లర్ పట్టణంలో ఎన్నికల ప్రచారంలో డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతుండగా ఓ యువకుడు కాల్పులు జరపడంతో ఆయన చెవికి గాయమైంది. తృటిలో ఆయన మృత్యువు నుంచి తప్పించుకోవడంతో.. అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ ఘటన జరిగిన సమయంలో సభలో ఉన్న ఓ వ్యక్తి ప్రాణాలు విడిచాడు. గాయపడిన ట్రంప్ చుట్టూ వెంటనే భద్రతా బలగాలు వలయంగా ఏర్పడ్డాయి. సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లలో కొందరు ఆయన్ను అక్కడి నుంచి సేఫ్ ప్లేస్ కి తరలించగా, అదే సమయంలో మరి కొందరు దుండగుడిపై కాల్పులు జరిపి చంపేశారు.
Read Also: Gun Fire : తుపాకీ కాల్పులతో దద్దరిల్లిన అమెరికా.. వేర్వేరు ఘటనల్లో ఒక చిన్నారి సహా ఏడుగురు మృతి
ఇక, ఒడిశాలోని పూరీ జగన్నాథుడి రథయాత్ర జులై 7వ తేదీన వైభవోపేతంగా ప్రారంభమై.. జగన్నాథుడు, బలభద్ర, సుభద్ర..ఈ ముగ్గురు మూర్తులు రథాలపై పెంచిన తల్లి గుండిచాదేవి ఆలయం దగ్గరకు చేరుకున్నాయి. నేడు తిరుగు రథయాత్ర కొనసాగుతుంది. ఈ వేడుకను బహుడా యాత్రగా పిలుస్తారు. ఈ ఉత్సవంలో 7 నుంచి 8 లక్షల మంది భక్తులు పాల్గొంటారన్న అంచనాతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసింది. రథయాత్ర మాదిరిగా బహుడా వేడుకకు పూరీలో మూడంచెల భద్రత కల్పిస్తున్నారు. తొక్కిసలాట జరగకుండా పొహండి, రథాలు లాగే సమయంలో ప్రత్యేక బలగాలను నియమించినట్లు అధికారులు వెల్లడించారు.
తాజావార్తలు
-
UAE OPEC Exit: యూఏఈ ఒపెక్ ఎగ్జిట్.. భారత్కు లాభం, పాకిస్తాన్కు నష్టం..
-
Gayapadda Simham: స్టార్ హీరోల ఫాన్స్ గెట్ రెడీ ఫర్ బ్లాస్టింగ్ స్పూఫ్స్!
-
Bhatti Vikramarka: ప్రభుత్వ ఉద్యోగులకు మంత్రి ‘భట్టి’ భరోసా.. రూ.1000 కోట్ల బకాయిల విడుదల.!
-
Adhir Ranjan Chowdhury: మమతా బెనర్జీ కళ్లలో భయం, ఇలా ఎప్పుడూ చూడలేదు..
-
Peddi: రామ్ చరణ్ ‘పెద్ది’ నుండి బ్లాస్టింగ్ సాంగ్ దిగుతోంది!
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో