Iskcon: ఆ పూరీ జగన్నాథుడే ట్రంప్ను రక్షించాడు..
- ట్రంప్ ప్రాణాలతో బయటపడటానికి పూరీ జగన్నాథుడి అనుగ్రహమే కారణం..
- రథయాత్రతో ట్రంప్కు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసిన అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం..
- ప్రపంచవ్యాప్తంగా జగన్నాథుడి రథయాత్ర కొనసాగుతుంది: ఇస్కాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Iskcon: అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష రేసులో ఉన్న డొనాల్డ్ ట్రంప్పై హత్యాయత్నంతో ప్రపంచమంతా ఒక్కసారిగా షాక్కు గురైయ్యారు. అయితే, ఆయన ప్రాణాలతో బయటపడటానికి పూరీ జగన్నాథుడి కృపే కారణమని అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం తెలిపింది. రథయాత్రతో ట్రంప్కు ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది. ఇది కచ్చితంగా ఆ పూరీ జగన్నాథుడి కృపే.. 48 ఏళ్ల క్రితం రథయాత్రకు ట్రంప్ సహకారం అందించాగా.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా రథయాత్ర ఉత్సవాలు కొనసాగుతున్నాయి.. ఈ సమయంలోనే ఆయనపై హత్యాయత్నం జరగటం.. ఆ భగవంతుడి అనుగ్రహమే ఆయన్ను రక్షించిందని ఇస్కాన్ ప్రతినిధి రాధారమణ్ దాస్ పేర్కొన్నారు. 1976లో ఇస్కాన్ భక్తులు రథయాత్ర కోసం రథాలు సిద్ధం చేసుకునేందుకు ఉచితంగా తన ట్రైన్యార్డ్ను ఇచ్చి సహకరించారని వెల్లడించారు.
Read Also: Danger Stunt At Mumbai: ముంబైలో యువకుడి ప్రమాదకర విన్యాసాలు.. ఆగ్రహించిన నెటిజన్స్..
Also Read
కాగా, పెన్సిల్వేనియాలోని బట్లర్ పట్టణంలో ఎన్నికల ప్రచారంలో డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతుండగా ఓ యువకుడు కాల్పులు జరపడంతో ఆయన చెవికి గాయమైంది. తృటిలో ఆయన మృత్యువు నుంచి తప్పించుకోవడంతో.. అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ ఘటన జరిగిన సమయంలో సభలో ఉన్న ఓ వ్యక్తి ప్రాణాలు విడిచాడు. గాయపడిన ట్రంప్ చుట్టూ వెంటనే భద్రతా బలగాలు వలయంగా ఏర్పడ్డాయి. సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లలో కొందరు ఆయన్ను అక్కడి నుంచి సేఫ్ ప్లేస్ కి తరలించగా, అదే సమయంలో మరి కొందరు దుండగుడిపై కాల్పులు జరిపి చంపేశారు.
Read Also: Gun Fire : తుపాకీ కాల్పులతో దద్దరిల్లిన అమెరికా.. వేర్వేరు ఘటనల్లో ఒక చిన్నారి సహా ఏడుగురు మృతి
ఇక, ఒడిశాలోని పూరీ జగన్నాథుడి రథయాత్ర జులై 7వ తేదీన వైభవోపేతంగా ప్రారంభమై.. జగన్నాథుడు, బలభద్ర, సుభద్ర..ఈ ముగ్గురు మూర్తులు రథాలపై పెంచిన తల్లి గుండిచాదేవి ఆలయం దగ్గరకు చేరుకున్నాయి. నేడు తిరుగు రథయాత్ర కొనసాగుతుంది. ఈ వేడుకను బహుడా యాత్రగా పిలుస్తారు. ఈ ఉత్సవంలో 7 నుంచి 8 లక్షల మంది భక్తులు పాల్గొంటారన్న అంచనాతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసింది. రథయాత్ర మాదిరిగా బహుడా వేడుకకు పూరీలో మూడంచెల భద్రత కల్పిస్తున్నారు. తొక్కిసలాట జరగకుండా పొహండి, రథాలు లాగే సమయంలో ప్రత్యేక బలగాలను నియమించినట్లు అధికారులు వెల్లడించారు.
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?