Pakistan: అజ్ఞాత వ్యక్తుల చేతిలో లష్కరే తోయిబా టాప్ కమాండర్ హతం..
- పాకిస్తాన్లో గుర్తుతెలియని వ్యక్తుల మరో దాడి..
- లష్కరే తోయిబా టాప్ కమాండర్ హతం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్తాన్లో మరోసారి గుర్తుతెలియని వ్యక్తుల హల్చల్ చేశారు. ఉగ్రవాద నాయకుడిపై మరోసారి టార్గెటెడ్ అటాక్ జరిగింది. ఆ దేశంలోని బలూచిస్తాన్ ప్రావిన్సులో అజ్ఞాత వ్యక్తుల చేతిలో లష్కరే తోయిబా ఉగ్రసంస్థ సీనియర్ కమాండర్ మీర్ శుక్ర ఖాన్ రైసాని హతమయ్యాడు. ఇటీవల కాలంలో లష్కరేకు చెందిన పెద్ద తలకాయలను గుర్తుతెలియని వ్యక్తులు టార్గెట్ చేస్తు్న్నారు. ఏ ప్రావిన్సులో ఉన్నా కూడా వెతికి మరి చంపుతున్నారు.
తాజాగా జరిగిన సంఘటన బలూచిస్తాన్ రాజధాని క్వెట్టాలో జరిగింది. ఒక లష్కరే తోయిబా కార్యక్రమంలో పాల్గొన్న కొద్దిసేపటికే రైసాని అనుమానాస్పద స్థితిలో మరణించాడు. ఈ దాడిపై పాకిస్తాన్ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే, ఇప్పటి వరకు ఈ హత్యకు ఏ సంస్థ కూడా బాధ్యత తీసుకోలేదు. ఇలాంటి ఘటనలకు పాకిస్తాన్ ప్రభుత్వం పరోక్షంగా భారత్ సహకరిస్తుందని ఆరోపిస్తోంది.
Also Read
- Iran-US Mediation: పాక్పై నమ్మకం లేదు.. ఇరాన్ యుద్ధంలో భారత్నే నమ్ముతున్న రష్యా
- PM Modi: అబుదాబిలో మోడీకి ప్రత్యేక గౌరవం.. ఎఫ్-16 యుద్ధ విమానాలతో రక్షణ
- Bermuda Triangle Mystery: బెర్ముడా రహస్యాన్ని ఛేదించిన శాస్త్రవేత్తలు.. అక్కడ ఏముందంటే..
- Pakistan: పాకిస్థాన్ సైన్యాన్ని వణికించిన ఉగ్రవాదులు.. సైనిక స్థావరంపై ఆత్మాహుతి దాడి.. 15 మంది మృతి!
రైసానీ మరణానికి ఒక రోజు ముందు క్వెట్టాలో లష్కరే తోయిబా నిర్వహించిన ‘‘మార్కా-ఎ-హక్’’ వార్షికోత్సవక కార్యక్రమంలో పాల్గొన్నాడు. లష్కర్ బలూచిస్తాన్ చీఫ్ హాఫిజ్ ఇద్రీస్తో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నాడు. రైసాని బలూచ్ లష్కరే నెట్వర్క్లో ప్రముఖ వ్యక్తి. ఉగ్రవాద సంస్థ రిక్రూట్మెంట్, శిక్షణ వంటి కీలక కార్యకలాపాల్లో పాలుపంచుకుంటున్నాడు. బలూచిస్తాన్ ఉగ్రవాద నెట్వర్క్లో చీలికలు, అంతర్గత పోరు, వేర్పాటువాదుల తిరుగుబాటు నేపథ్యంలో ఈ హత్య జరిగింది.
టీవలి నెలల్లో, షేక్ యూసుఫ్ అఫ్రిది, అమీర్ హమ్జా తదితరులతో సహా పలువురు ఉన్నత స్థాయి లష్కర్-ఎ-తైబా కమాండర్లు ఇలాంటి గుర్తుతెలియని సాయుధ దాడులలో హతమయ్యారు. హఫీజ్ సయీద్ స్థాపించిన ఈ ఉగ్ర సంస్థ భారత్లో విధ్వంసమే లక్ష్యంగా పని చేస్తోంది. 2008 ముంబై ఉగ్ర దాడులకు ఈ సంస్థే సూత్రధారి.
తాజావార్తలు
-
Pakistan: అజ్ఞాత వ్యక్తుల చేతిలో లష్కరే తోయిబా టాప్ కమాండర్ హతం..
-
ICC: పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు ఐసీసీ డబుల్ షాక్.. ఆటగాళ్లపై 40 శాతం జరిమానా.. కారణం ఇదే..
-
Tollywood : పర్సంటేజ్’ స్పెషల్ కమిటీ.. దిల్ రాజు, అల్లు అరవింద్ సహా నిర్మాతలు ఎవరంటే?
-
Maharashtra: ఇండిగోలో సాధారణ ప్రయాణికులతో కలిసి బెంగళూరు వెళ్లిన సీఎం ఫడ్నవిస్
-
Fact Check : ఆదివారం పెట్రోల్ బంకులు బంద్.. క్లారిటీ ఇచ్చిన సివిల్ సప్లైస్ కమిషనర్
ట్రెండింగ్
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!