Artificial Intelligence: ఏఐతో ఉద్యోగావకాశాలు.. బాధ్యతాయుతంగా వ్యవహారించాలంటున్న టెక్ దిగ్గజాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Artificial Intelligence: ప్రపంచాన్ని ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ కుదిపేస్తోంది. ఏఐ అనేది సరికొత్త టెక్నాలజీ. అత్యాధునిక టెక్నాలజీ. దీనితో ఏదైనా చేయవచ్చు. అటువంటి ఆధునిక టెక్నాలజీతో ఉపయోగాలతోపాటు.. నష్టాలు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు అయితే ఏఐతో ఎక్కువ సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు ఉంటున్నాయని.. వాటిని బాధ్యతాయుతంగా ఉపయోగించాల్సిన అవసరం ఉందని ఐటీ కంపెనీల యజమానులు.. ఐటీ రంగ నిపుణులు చెబుతున్నారు. ఏఐతో బాధ్యతాయుతంగా లేకపోతే తీవ్ర నష్టాలు ఉంటాయని చెబుతున్నారు. ఏఐ వల్ల ఉత్పాదకతతో పాటు ఉద్యోగావకాశాలలూ పెరుగుతాయంటున్న ఐటీ కంపెనీల అధిపతులు.. ఈ సాంకేతికతను బాధ్యతాయుతంగా వినియోగించుకోవాలని సూచిస్తున్నారు. ఏఐ వల్ల ప్రయోజనాలు, నష్ట భయాలపై సీఐఐ ఆధ్వర్యంలో ‘బీ20 సమ్మిట్ ఇండియా 2023 జరిగింది. ఈ సమ్మిట్లో పలు అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలు పాల్గొన్నాయి. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కూడా పాల్గొన్నారు.
Read Also: Hyderabad: భోలక్ పూర్ లో వింత ఘటన.. విషం పెట్టి పిల్లులను చంపారని ఫిర్యాదు
Also Read
- Putin: విదేశాల ఒత్తిడికి భారత్ ఎన్నడూ లొంగలేదు.. ట్రంప్కు పుతిన్ స్ట్రాంగ్ మెసేజ్..
- Putin-Zelensky: యుద్ధం ముగిద్దాం.. పుతిన్కు జెలెన్స్కీ లేఖ.. రెస్పాన్స్పై సర్వత్రా ఆసక్తి
- Pakistan: మమ్మల్ని కాపాడినందుకు ట్రంప్నకు రుణపడి ఉంటాం: షహబాజ్ షరీఫ్..
- Iran: యురేనియం బదిలీపై ఇరాన్ సంచలన నిర్ణయం.. పాక్కు కీలక సమాచారం!
సమ్మిట్లో ఐబీఎమ్ ఛైర్మన్, సీఈఓ అరవింద్ కృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏఐ వల్ల వ్యాపార వ్యయాలు తగ్గుతాయని.. కోడింగ్ 60 శాతం మెరుగుపడుతుందన్నారు. ఐబీఎమ్ విషయానికే వస్తే మొత్తం కార్యకలాపాల్లో 20 శాతంతక్కువ స్థాయి అవగాహనతో చేసే పని ఉంటుందని.. ఇందులో 30 శాతాన్ని ఏఐ ద్వారా చేయగలుగుతున్నామన్నారు. తద్వారా క్లయింట్లకు తక్కువ వ్యయాలతో పని పూర్తి చేయొచ్చని.. ఈ విభాగాల్లోని ఉద్యోగులను ఇతర పనులకు వినియోగించుకోవచ్చని అంటున్నారు. ఇప్పుడైనా, భవిష్యత్లోనైనా అధిక అవగాహనతో చేసే పనులను మానవులే చేయాలన్నారు. టీసీఎస్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ మాట్లాడుతూ గత 10 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ మార్పు కనిపించిందని.. తదుపరి ఏఐ వంతు వచ్చిందని తెలిపారు. మనదేశంతో పాటు ప్రపంచ దక్షిణ ప్రాంతంలో అధిక సంఖ్యలో ఉన్న ప్రజలకు సేవలు అందించడంలో చాలా సవాళ్లు ఎదురవుతున్నాయి. 30 కోట్ల మందికి ఆరోగ్య సంరక్షణ, విద్యా సేవలు అందడం లేదు. కొన్నేళ్ల క్రితం బ్యాంకింగ్ సేవలూ అందుబాటులో ఉండేవి కాదు. మరో వైపు ఏటా కోటి నుంచి 1.2 కోట్ల మంది ఉద్యోగాలకు సిద్ధమవుతున్నారు. ఈ రెండు సమస్యలనూ తీర్చాలంటే.. సాంకేతికతను ముఖ్యంగా ఏఐను అందిపుచ్చుకోవాల్సిందేనని చంద్రశేఖరన్ చెప్పారు. తక్కువ నైపుణ్యం ఉన్నవారు సైతం ఏఐతో అద్భుత నిపుణులుగా మారగలరని.. ఇండియాలో మరిన్ని ఉద్యోగాలకు ఏఐ దోహదం చేయగలదని ఆయన తెలిపారు.
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!