Israel-Gaza: గాజాపై ఇజ్రాయెల్ దాడి.. ఐదుగురు జర్నలిస్టుల మృతి
- గాజాపై ఇజ్రాయెల్ దాడి
- ఐదుగురు జర్నలిస్టుల మృతి
గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తోంది. ఏడాదికి పైగా ఐడీఎఫ్ దళాలు దాడులు సాగిస్తున్నాయి. క్రిస్మస్ రోజున కూడా ఇజ్రాయెల్ కొనసాగించింది. నుసిరత్లోని అల్-అవుడా ఆస్పత్రి పరిసరాల్లో జరిగిన దాడుల్లో అల్-కుద్స్ అల్-యూమ్ టెలివిజన్ ఛానెల్కు చెందిన ఐదుగురు జర్నలిస్టులు చనిపోయినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. టెలివిజన్కు చెందిన వ్యాన్లోని మంటలను సివిల్ డిఫెన్స్ సభ్యులు మంటలు ఆర్పారు.
ఇజ్రాయెల్ దాడిలో ఐదుగురు పాలస్తీనా జర్నలిస్టులు రాత్రిపూట మరణించారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం తెల్లవారుజామున తెలిపింది. మిలిటెంట్ల గుంపును లక్ష్యంగా చేసుకున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. అయితే ఈ దాడిలో ఐదుగురు జర్నలిస్టులు ప్రాణాలు కోల్పోయారు. జర్నలిస్టులు స్థానిక కుడ్స్ న్యూస్ నెట్వర్క్లో పని చేస్తున్నారు.
Also Read
- Ajit Doval: యూఏఈలో అజిత్ దోవల్ పర్యటన.. దౌత్య సంబంధాలపై చర్చ
- Trump: ‘‘ఆ..చెత్తంతా చదవొద్దు’’.. జర్నలిస్ట్పై ట్రంప్ ఆగ్రహం
- Sheikh Yusuf Afridi: ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో దుండగుల కాల్పులు.. లష్కర్-ఎ-తోయిబా అగ్ర కమాండర్ షేక్ అఫ్రిది హతం
- Mojtaba Khamenei: ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మోజ్తాబా ఆరోగ్యంపై సస్పెన్స్ వీడినట్టేనా!? కుడ్యచిత్రం ఆవిష్కరణ
ఇక గాజాలో పరిస్థితులు దయనీయంగా మారాయి. ఏడాదికిపైగా జరుగుతున్న యుద్ధంలో గాజా పూర్తిగా ధ్వంసమైంది. తీవ్ర ఆహార కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంకోవైపు ఉష్ణోగ్రతలు క్షీణించడం.. మరోవైపు ఆహారం, నీరు లేక ఇక్కట్లు పడుతున్నారు. స్వచ్చంధ సంస్థలు ఇచ్చే ఆహారంతోనే కాలం వెళ్లదీస్తున్నారు. ఇక ఆహార పంపిణీ వాహనాలు రాగానే ప్రజలు దోపిడీ చేసుకుని ఎత్తుకుని వెళ్లిపోతున్నారు.
అక్టోబర్ 7, 2023లో హమాస్.. ఇజ్రాయెల్పై దాడి చేసి బందీలుగా తీసుకెళ్లిపోయింది. ఆ నాటి నుంచి ఇజ్రాయెల్ పగతో రగిలిపోయింది. హమాస్ అంతమే లక్ష్యంగా గాజాపై ఇజ్రాయెల్ దాడులకు తెగబడింది. వందలాది మంది ఇప్పటికే ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. అప్పటి నుంచి ఏకధాటిగా యుద్ధం సాగుతోనూ ఉంది. త్వరలో అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఆ నాటికి యుద్ధం ముగియాలని హెచ్చరించారు. ఏమవుతుందో చూడాలి.
తాజావార్తలు
-
Robbery: బిగ్ షాక్.. శ్రీ చైతన్య కాలేజీలో దొంగతనం..
-
Angkrish Raghuvanshi: కోపం ఖరీదు.. 20% మ్యాచ్ ఫీజు జరిమానా.!
-
Padma Awards 2027: దేశ అత్యున్నత పౌర పురస్కారాలు.. నేడే నామినేట్ చేసుకోండి.. పూర్తి వివరాలివే!
-
Ola Electric Share: ఒక్కప్పుడు రారాజు.. ఇప్పుడు బికారి! ఓలా ఎలక్ట్రిక్ రూ.157 నుంచి రూ.20 కి?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!