Israel – Hamas: ఇజ్రాయెల్- హమాస్ మధ్య కొనసాగుతున్న ఖైదీల విడుదల..
- కొనసాగుతున్న కాల్పుల విరమణ ఒప్పందం..
- బందీలను విడుదల చేస్తున్న ఇజ్రాయెల్- హమాస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel – Hamas: కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిన తర్వాత ఇజ్రాయెల్- హమాస్లు తమ అధీనంలో ఉన్న బందీలను దశల వారిగా విడుదల చేస్తున్నారు. తమ చెరలోని బందీలుగా ముగ్గురిని హమాస్ రిలీజ్ చేయగా.. ఇజ్రాయెల్ కూడా 90 మంది పాలస్తీనా ఖైదీలను విడిచి పెట్టింది. ఈ రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందంతో 15 నెలల భీకర యుద్ధానికి తాత్కాలికంగా స్వస్తి పలికినట్లైంది.
Read Also: Chaudhary Elephant Attack: ఉప సర్పంచ్ రాకేష్ చౌదరి మృతి.. గజరాజుల జాడ కోసం గాలింపు!
Also Read
అయితే, ఆదివారం నాటి నుంచి అమల్లోకి వచ్చిన కాల్పుల విరమణ ఒప్పందం ఆరు వారాల పాటు కొనసాగుతుంది. అప్పటిలోపు హమాస్ 33 మంది బందీలను, ఇజ్రాయెల్ దాదాపు 2వేల మంది పాలస్తీనా ఖైదీలను రిలీజ్ చేయనున్నాయి. మరోవైపు, కాల్పుల విరమణ ఒప్పందాన్ని బెంజిమన్ నెతన్యాహూ సర్కార్ లో భాగస్వామి ఓజ్మా యేహూదిత్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించడంతో పాటు ప్రభుత్వం నుంచి ఆ పార్టీ తప్పుకుంది.
Read Also: Weather Updates : తెలంగాణలో కొనసాగుతున్న చలి తీవ్రత.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
కాగా, 2023 అక్టోబర్ 7వ తేదీన పాలస్తీనాకు చెందిన హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్పై భీకర దాడులు చేసి సుమారు 1200 మందిని చంపడంతో పాటు వేల మంది గాయపడ్డారు. ఈ ఘటనలో కొంత మందిని తమ వెంట బందీలుగా పట్టుకుపోయారు. అయితే, దీనికి ప్రతిగా ఇజ్రాయెల్ గాజాపై జరిపిన దాడుల్లో ఇప్పటి వరకు 47 వేల మంది దాకా చనిపోయినట్లు తెలుస్తుంది. తాజా కాల్పుల విరమణకు అమెరికా, ఈజిప్టు, ఖతార్ మధ్యవర్తిత్వం వహించడంతో ప్రస్తుతం గాజాలో శాంతి నెలకొనే అవకాశం కనిపిస్తుంది.
తాజావార్తలు
-
Movies Postponed: చివరి నిమిషంలో టాలీవుడ్లో చిన్న సినిమాలు పోస్ట్పోన్..!
-
Prabhas-Spirit: మరింత డార్క్ అండ్ బోల్డ్.. యానిమల్కు మించి స్పిరిట్.. థియేటర్లు తగలబడిపోవడం ఖాయం!
-
Onion Price Hike: కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి.. 94 శాతం పెరిగిన ధరలు.. ఉత్పత్తి ఉన్నా ఎందుకీ దుస్థితి?
-
Vice President Radhakrishnan: సర్దార్ పటేల్కు నిజమైన నివాళి అదే.. విమోచన దినోత్సవంలో ఉపరాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు.!
-
KTR: ‘సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించండి’.. సీఎంకు కేటీఆర్ సవాల్.!
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!