Israel: ఇజ్రాయిల్, పాలస్తీనా మధ్య తీవ్ర ఉద్రిక్తత.. టెల్ అవీవ్, వెస్ట్ బ్యాంక్ టార్గెట్ గా దాడులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel: మధ్యప్రాచ్చంలో ఇజ్రాయిల్, పాలస్తీనా మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బుధవారం రోజు జెరూసలెంలోని ప్రఖ్యాత అల్-అక్సా మసీదులో ఘర్షణ తర్వాత ఇజ్రాయిల్ వరసగా దాడులను ఎదుర్కొంటోంది. అల్-అక్సా ఘటన తర్వాత పాలస్తీనా గాజా నుంచి, లెబనాన్ నుంచి రాకెట్ దాడులను ఎదర్కొంది ఇజ్రాయిల్. దీనికి ప్రతీగా ఇజ్రాయిల్ పాలస్తీనా, లెబనాన్ పై వైమానిక దాడులు చేస్తోంది.
ఇదిలా ఉంటే తాజాగా ఇజ్రాయిల్ వాణిజ్య నగరం, వెస్ట్ బ్యాంక్ టార్గెట్ గా పాలస్తీనా దాడులు చేసింది. ఈ దాడుల్లో ముగ్గురు మరణించారు. ఇందులో ఇటలీకి చెందిన ఓ మహిళ కూడా ఉంది. ఈ దాడుల తర్వాత ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమెన్ నెతన్యాహు పోలీస్, ఆర్మీ రిజర్వ్ దళాలను సమీకరణకు ఆదేశాలు ఇచ్చారు. యూదుల పాస్ ఓవర్, ముస్లింల రంజాన్ మాసం ఇజ్రాయిల్ లో ఉద్రిక్తతకు కారణం అయింది. అల్-అక్సా మసీదులో ఇజ్రాయిల్ దళాలు పాలస్తీనియన్లలో ఘర్షణ జరిగిన తర్వాత ఈ ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.
Also Read
Read Also: Accused Of Gang Raping: అత్యాచారం కేసులో 21 మంది పోలీసులు.. నిర్దోషులుగా విడుదల
సెంట్రల్ టెల్ అవీవ్ లో సముద్ర తీరం వెంబడి నడుస్తున్న వ్యక్తులపైకి కారు దూసుకెళ్లడంతో ఓ వ్యక్తి మరణించాడు. మరో ఏడుగురు వ్యక్తుల గాయపడినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. ఈ దాడికి పాల్పడిన ఉగ్రవాదిని భద్రతా బలగాలు అంతం చేశాయి. వెస్ట్ బ్యాంకులో జరిగిన కాల్పుల్లో ఇద్దరు మరణించారు. ఈ ఘటనలకు పాల్పడిన నేరస్తుల కోసం ఇజ్రాయిల బలగాలు గాలింపు చర్యలను చేపట్టింది.
అంతకుముందు లెబనాన్, పాలస్తీనా జరిపిన దాడుల తర్వాత ఇజ్రాయిల్ హమాస్ ఉగ్రవాదులకు సంబంధించిన స్థావరాలపై వైమానిక దాడులు చేసింది. రాకెట్ల ద్వారా ఇజ్రాయిల్ పైకి చేసిన దాడులను ఇజ్రాయిల్ క్షిపణి రక్షణ వ్యవస్థ ‘ఐరన్ డోమ్’ దాడులను అడ్డుకుంది. ఈ ఉద్రిక్తతలపై ఐరాస చీఫ్ ఆంటోనియోగుటెరస్ సంయమనం పాటించాలని ఇరు దేశాలను కోరారు. అమెరికా, ఫ్రాన్స్ కూడా ఇలాగే స్పందించాయి.
తాజావార్తలు
-
Sabari River Flood: పోలవరం జిల్లాలో శబరి నది ఉగ్రరూపం.. అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక!
-
Explainer: టార్గెట్ ఇండియా? పాక్కు బాంబులు పంపుతున్న టర్కీ!
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Vivo T5 5G: వివో T5 5G భారత్ లో రిలీజ్ డేట్ ఫిక్స్.. 7,050mAh బ్యాటరీ, 144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే
-
Suryapet Bus Accident: సూర్యాపేట జిల్లాలో ఘోర ప్రమాదం.. బస్సు-కంటైనర్ ఢీ, ఆరుగురు మృతి
ట్రెండింగ్
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!