Israel-Hamas War: హమాస్ వద్ద బందీలుగా 210 మంది.. ఇజ్రాయిల్ సైన్యం ప్రకటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel-Hamas War: అక్టోబర్ 7న ఇజ్రాయిల్పై పాలస్తీనా హమాస్ ఉగ్రవాదులు క్రూరమైన దాడి జరిపారు. ఈ దాడిలో ఇజ్రాయిల్ లోని 1400 మంది చనిపోయారు. మహిళలు, పిల్లలు అనే తేడా లేకుండా దారుణంగా ఊచకోతకు పాల్పడ్డారు. మరికొంత మందిని బందీలుగా గాజా ప్రాంతంలోకి తీసుకెళ్లారు. అయితే ప్రస్తుతం హమాస్ వద్ద 210 మంది ఇజ్రాయిల్ ప్రజలు బందీలుగా ఉన్నట్లు ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) వెల్లడించింది. అయితే ఇది తుది సంఖ్య కాదని, తప్పిపోయిన వారి కోసం మిలిటరీ దర్యాప్తు జరుగుతోందని, బందీల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని ఐడీఎఫ్ అధికార ప్రతినిధి అన్నారు. నిన్న ఇద్దరు అమెరికన్ తల్లి కూతుళ్లను హమాస్ ఉగ్రవాదులు విడిచిపెట్టారు. వీరు కాకుండా 210 మంది బందీలుగా ఉన్నారని తెలిపారు.
Also Read
- Israel-Turkey: ఇజ్రాయెల్ నెక్ట్స్ టార్గెట్ టర్కీనేనా? గ్రీస్లో శక్తివంతమైన క్షిపణి ఏర్పాట్లు!
- Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
- America Deportations: వలసదారులను నరకంలోకి గెంటేస్తోన్న ట్రంప్ సర్కార్.. అమెరికా భయంకర ముఖం ఇదే!
- PM Modi-Putin Talks: నేడు మోడీ-పుతిన్ భేటీ.. ఎస్-400, యూపీఐ, చమురు, ఇంధనంపై కీలక చర్చలు
గాజాలో మానవతా సంక్షోభం లేదు: ఐడీఎఫ్
గాజాలోని బందీలను విడిపించడంతో పాటు హమాస్ ఉగ్రవాదులను నేలమట్టం చేయడానికి ఇజ్రాయిల్ ప్రణాళిక రచిస్తోంది. ఈ నేపథ్యంలోనే గాజాలోని ఉత్తర భాగం నుంచి ప్రజలు సురక్షితం ప్రదేశమైన దక్షిణ ప్రాంతం వైపు వెళ్లాలని ఆదేశించింది. దీంతో లక్షలాది మంది పాలస్తీయన్లు దక్షిణ వైపు వెళ్లారు. అయితే గాజాలో ఎలాంటి మానవతా సంక్షోభం లేదని ఐడీఎఫ్ శనివారం తెలిపింది. 10 లక్షల మందిలో 7 లక్షల మంది ఉత్తర ప్రాంత నివాసితులు కొన్ని రోజుల క్రితం దక్షిణ ప్రాంతానికి వెళ్లారని తెలిపింది.
నీటి కొరత గాజాలో లేదని, వారాలకు సరిపడే ఫుడ్ ఉందని, మెడిసిన్ సప్లై కూడా ఉందని ఇజ్రాయిల్ రక్షణ అధికారి వెల్లడించారు. హమాస్ ప్రజలు దక్షిణ భాగం వైపు వెళ్లకుండా అడ్డుకుంటుందని ఆరోపించారు. ఈజిప్టు నుంచి గాజా దక్షిణ ప్రాంతంలోని రఫా క్రాసింగ్ నుంచి ఫుడ్, వాటర్, మెడిసిన్ సాయం లభిస్తోందని ఐడీఎఫ్ అధికార ప్రతినిధి డానియల్ హగారి అన్నారు.
గత రెండు వారాల నుంచి ఇజ్రాయిల్-పాలస్తీనా హమాస్ మధ్య తీవ్ర యుద్ధం నెలకొంది. ఈ యుద్ధంలో అక్టోబర్ 7 నాటి హమాస్ దాడి అనంతరం నుంచి గాజా స్ట్రిప్ పై ఇజ్రాయిల్ వైమానికి దళం నిప్పులు కురిపిస్తోంది. గాజాలో ఇప్పటి వరకు 4000 మంది మరణించారు. హమాస్ కీలక ఉగ్రవాదులను ఇజ్రాయిల్ మట్టుబెడుతోంది.
తాజావార్తలు
-
Tilak Varma Century: సెంచరీతో అదరగొట్టిన తిలక్ వర్మ.. సెంచరీతో రికార్డులు బద్దలు..
-
Aata Sandeep: డ్యాన్సర్ల కష్టార్జితంపై రూపాయి కమిషన్ తీసుకోను: సందీప్ సంచలన ప్రకటన!
-
Israel-Turkey: ఇజ్రాయెల్ నెక్ట్స్ టార్గెట్ టర్కీనేనా? గ్రీస్లో శక్తివంతమైన క్షిపణి ఏర్పాట్లు!
-
CM Revanth Reddy : కేసీఆర్ అప్పులపై రేవంత్ ఫైర్.. ‘భారం మోస్తున్నాం’!
-
Allu Arjun : రాకా హైప్ ఓకే.. కంటెంట్ ఆ రేంజ్ లో లేక పోతే?
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!