NTV Telugu Site icon

Labanon: ఓ వైపు ఐరాసలో నెతన్యాహు ప్రసంగం.. ఇంకోవైపు లెబనాన్‌పై దాడులు

Labanon

Labanon

హిజ్బుల్లా అంతమే తమ లక్ష్యమంటూ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఐకరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ప్రతిజ్ఞ చేసిన కొన్ని నిమిషాలకే ఇజ్రాయెల్ సైన్యం దక్షిణ లెబనాన్‌పై భీకరదాడులకు దిగింది. హిజ్బుల్లా సంస్థకు చెందిన స్థావరాలు టార్గెట్‌గా దాడులు చేస్తున్నట్లు ఇజ్రాయెల్ మిలిటరీ ఒక ప్రకటనలో తెలిపింది. లెబనాన్ రాజధాని బీరూట్‌కు దక్షిణాన వైమానిక దాడులు నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది. బీరుట్‌కు దక్షిణాన జనసాంద్రత ఎక్కువగా ఉండే ప్రాంతంలో భారీగా పొగ మేఘాలు కమ్ముకున్నాయి.

ఇది కూడా చదవండి: Dussehra Holidays: విద్యార్థులకు గుడ్‌న్యూస్.. దసరా సెలవుల ప్రకటన

ఇజ్రాయెల్ సైనిక ప్రతినిధి డేనియల్ హగారి మాట్లాడుతూ.. దక్షిణ శివార్లలోని హిజ్బుల్లా సెంట్రల్ హెడ్‌క్వార్టర్స్‌ లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నట్లు తెలిపారు. న్యూయార్క్‌లోని యూఎన్ జనరల్ అసెంబ్లీ ప్రతినిధులను ఉద్దేశించి నెతన్యాహు ప్రసంగాన్ని ముగించిన కొద్ది క్షణాల తర్వాత బాంబు దాడి జరిగింది. ఆ సమయంలో హిజ్బుల్లాకు వ్యతిరేకంగా దాడులను కొనసాగిస్తామని, హమాస్‌పై విజయం సాధించేవరకు పోరాడతానని నెతన్యాహు ప్రతిజ్ఞ చేశారు.

అక్టోబర్ 7న హమాస్.. ఇజ్రాయెల్‌పై హఠాత్తుగా దండెత్తింది. ఇజ్రాయెల్ పౌరులను బందీలుగా తీసుకుపోయారు. ఆ ఘటనతో ఇజ్రాయెల్ పగతో రగిలిపోయింది. ఆ నాటి నుంచి ప్రతీకార దాడులు చేస్తూనే ఉంది. హమాస్ లక్ష్యంగా గాజాను ధ్వంసం చేసింది. హమాస్‌కు వత్తాసు పలికిన లెబనాన్‌పై కూడా దాడులు కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. తాజాగా ఐరాస వేదికగా నెతన్యాహు మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. 90 శాతం మంది హమాస్‌ రాకెట్లను నాశనం చేసినట్లు చెప్పుకొచ్చారు. వారి సగం బలగాలను అంతం చేయడమో, బంధించడమో చేశామని.. వారు లొంగిపోకపోతే పూర్తి విజయం సాధించే వరకు పోరాడతామని చెప్పారు. మా లక్ష్యాలను చేరేవరకు హెజ్బుల్లాపై పోరాటం కొనసాగిస్తామని శపథం చేశారు. ఏడాది కాలంగా ఈ పరిస్థితులను సహిస్తూనే వస్తున్నామని బెంజమిన్‌ నెతన్యాహు పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: CM Chandrababu Naidu: తిరుమల లడ్డూ వివాదంపై మరోసారి చంద్రబాబు ఫైర్

ఈసారి ఐరాస సమావేశాలకు రావాలనే ఉద్దేశం లేనప్పటికీ.. తమపై కొన్ని దేశాధినేతలు చేసిన అవాస్తవాలను ఖండించడానికే ఇక్కడికి వచ్చినట్లు నెతన్యాహు తెలిపారు. ఇజ్రాయెల్‌ శాంతిని కోరుకుంటుదన్నారు. ఒకవేళ ఇరాన్ దాడి చేస్తే ప్రతిదాడి తప్పదని పరోక్షంగా హెచ్చరించారు. చాలా కాలంగా యావత్ ప్రపంచం ఇరాన్‌ను బుజ్జగిస్తూ వస్తోందని.. దానికి ముగింపు పలకాలని పిలుపునిచ్చారు.

ఇదిలా ఉంటే ఇటీవల నెతన్యాహు మాట్లాడుతూ.. హిజ్బుల్లాపై పూర్తి స్థాయిలో దాడులు చేయాలని ఆదేశించారు. ఇక ఇజ్రాయెల్‌ ముందుగా హెచ్చరించినట్లుగానే మరో అడుగు ముందుకేసింది. లెబనాన్‌లోని హెజ్బుల్లా స్థావరాలే లక్ష్యంగా భూతల దాడులు చేసేందుకు సరిహద్దు ప్రాంతంలో వేల సంఖ్యలో యుద్ధ ట్యాంకర్లను మోహరించింది. దీంతో ఏ క్షణమైనా గ్రౌండ్‌ ఆపరేషన్‌ చేపట్టే అవకాశాలున్నాయని మీడియా కథనాలు వెలువడుతున్నాయి.

ఇది కూడా చదవండి: Tirumala Laddu Issue: రేపు సిట్ బృందం తిరుపతికి రాక