Site icon NTV Telugu

Iran War: అమెరికా పైలట్ రెస్క్యూ అంతా వట్టిదేనా.. “యురేనియం” దొంగిలించడానికి ఇదంతా చేసిందా?

Trump

Trump

Iran War: అమెరికా తన పైలట్ కోసం ఇరాన్‌లో భారీ రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించినట్లు చెబుతోంది. ఈ రెస్క్యూ కోసం యూఎస్ భారీ సంఖ్యలో యుద్ధ సామాగ్రిని మోహరించింది. అయితే, ఇరాన్ మాత్రం ఇందుకు వేరే కారణం ఉందని చెబుతోంది. పైలట్ రెస్క్యూ కేవలం సాకు మాత్రమే అని, దీనికి వెనక ‘‘యురేనియం’’ దొంగిలించే ప్లాన్ ఉందని ఇరాన్ ఆరోపిస్తోంది. ఈ మొత్తం ఆపరేషన్ విజయాన్ని తక్కువగా చేసేందుకు ఇరాన్ ప్రయత్నించింది.

Read Also: Donald Trump: మనలోనే ‘‘గూఢచారి’’ ఉన్నాడు.. మీడియాకు ట్రంప్ వార్నింగ్..

ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఖాయీ మాట్లాడుతూ.. ఇది నిజమైన రెస్క్యూ ఆపరేషన్ కాకపోవచ్చని, ఇది ‘‘ఎన్ రిచ్డ్ యురేనియం’’ దొంగిలించడానికి ఒక మోసపూరిత ఆపరేషన్ అయ్యే అవకాశం ఉందని అన్నారు. ఈ మిషన్ చుట్టూ చాలా ప్రశ్నలు, అనిశ్చితులు ఉన్నాయని అన్నారు. అమెరికన్ పైలట్ కోహ్గిలుయే, బోయిర్ అహ్మద్ ప్రావిన్స్‌లో చిక్కుకుపోయినట్లు చెబుతున్నారు, కానీ అమెరికన్ బలగాలు సెంట్రల్ ఇరాన్‌లో దిగేందుకు ప్రయత్నించారని, పైలట్ ఉన్న ప్రాంతానికి చాలా దూరంలో దిగాలని ప్రయత్నించినట్లు ఆయన ఆరోపించారు.

ప్రస్తుతం ఇరాన్ వద్ద 400 నుంచి 450 కిలోల ఎన్‌రిచ్డ్ యురేనియం ఉన్నట్లు భావిస్తున్నారు.ఈ పరిమాణం అణ్వాయుధాలు తయారు చేయడానికి ఉపయోగించవచ్చు. ఇరాన్‌లో యురేనియాన్ని స్వాధీనం చేసుకోవడానికి ట్రంప్ భూతల దాడులకు ప్లాన్ చేస్తున్నట్లు గతంలో అమెరికన్ మీడియా వెల్లడించింది. అంతర్జాతీయ అణుశక్తి సంస్థ డైరెక్టర్ జనరల్ రాఫెల్ గ్రోస్సీ ప్రకారం.. ఈ యురేనియం నటాంజ్, ఇస్ఫహాన్‌లోని అణు సముదాయాల్లో ఉండొచ్చని అంచనా వేశారు.

Exit mobile version