Iran-US Talks: చిత్తశుద్ధి లేదు.. అమెరికాతో చర్చలు ఉండబోవన్న ఇరాన్
- ఆమెరికాకు చిత్తశుద్ధి లేదు
- అమెరికా సముద్ర దొంగ
- చర్చలు ఉండబోవన్న ఇరాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇరాన్తో రెండో విడత చర్చల కోసం జేడీ వాన్స్ బృందం సోమవారం ఇస్లామాబాద్ చేరుకుంటుందని ట్రంప్ ప్రకటించారు. అందుకు తగ్గట్టుగా పాకిస్థాన్ కూడా ఇస్లామాబాద్లో తీవ్ర ఆంక్షలు విధించింది. రాజధానిలోకి ఎవరూ రాకుండా అన్ని రహదారులు మూసేసింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే అమెరికాతో చర్చలు జరిపేందుకు ఇరాన్ నిరాకరించింది. అమెరికాకు చిత్తుశుద్ధి లేదని.. సముద్ర దొంగ అని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అమెరికాతో చర్చలకు భవిష్యత్ ప్రణాళికలు ఏమీ లేవని తేల్చి చెప్పింది.
ఇది కూడా చదవండి: Flight: గాల్లో ఉండగా విమానంలో కుదుపులు.. వెక్కి వెక్కి ఏడ్చిన ప్రయాణికులు.. వీడియో వైరల్
Also Read
- Giorgia Meloni: జీ 7 సదస్సుకు కుమార్తెతో హాజరైన మెలోని.. ఫొటోలు వైరల్
- India-Bangladesh: ‘‘ఇది షేక్ హసీనా ప్రభుత్వం కాదు’’.. భారత్కు బంగ్లా ప్రధాని సలహాదారు ఘాటు సందేశం
- Trump: హార్ముజ్ శాశ్వతంగా టోల్ ఫ్రీగా ఉంటుంది.. జీ 7 సదస్సులో ట్రంప్ ప్రకటన
- US-Iran Peace Deal: ఇరాన్ ఒప్పందంపై ట్రంప్ టీమ్లో చీలిక.. CIA హెచ్చరికలతో ఉద్రిక్తత
ఇరాన్పై నిందలు వేసి ఆట ఆడుతోందని ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఆరోపించారు. వివాదాన్ని పరిష్కరించడంలో అమెరికాకు చిత్తశుద్ధి లేదని నిందించారు. ‘‘వారు సానుకూల పాత్ర పోషించడానికి బదులుగా ఈ ఆట కొనసాగుతోంది. అమెరికన్లు నిజం చెబుతారని మనం ఆశించలేము. వారు ఎల్లప్పుడూ మమ్మల్ని నిందిస్తూనే ఉంటారు.’’ అని ప్రతినిధి అన్నారు.
యురేనియం శుద్ధి అప్పగించేందుకు ఇరాన్ సిద్ధంగా ఉందని.. ఒప్పందం జరిగితే సంతకాలు చేసేందుకు వ్యక్తిగతంగా పాకిస్థాన్కు కూడా వెళ్తానని ట్రంప్ ఇటీవల ప్రకటించారు. ఈ సందర్భంగా పాకిస్థాన్ మంచి పని చేస్తోందంటూ ప్రశంసలు కురిపించారు. ఒకవేళ ఇరాన్ ఒప్పందం చేసుకోకపోతే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయని ట్రంప్ హెచ్చరించారు. విద్యుత్ ప్లాంట్లు ధ్వంసం చేస్తామని వార్నింగ్ ఇచ్చారు.
ఇదిలా ఉంటే గత రాత్రి చైనా నుంచి ఇరాన్కు వస్తున్న సరుకు రవాణా నౌకపై అమెరికా దళాలు దాడి చేశాయి. దీంతో మరోసారి రెండు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అమెరికా దాడికి ప్రతీకారంగా ఇరాన్ కూడా అమెరికా నౌకలపై డ్రోన్ దాడులు చేసింది. దీంతో మధ్యప్రాచ్యంలో మళ్లీ టెన్షన్ వాతావరణం నెలకొనేటట్టు కనిపిస్తోంది.
తాజా పరిణామాలను చూస్తుంటే రేపు ఇస్లామాబాద్ వేదికగా జరగాల్సిన శాంతి చర్చలు లేనట్లుగానే కనిపిస్తోంది. అమెరికా బృందం ఇప్పటికే బయల్దేరగా.. ఇరాన్ బృందం మాత్రం ఇంకా బయల్దేరలేదు. దీంతో రెండు విడత చర్చలు లేనట్లుగా అర్థమవుతోంది.
తాజావార్తలు
-
T20 World Cup: పాక్పై గెలిచినా తగ్గని కసి.. డచ్ జట్టుపై భారీ విజయమే లక్ష్యంగా బరిలోకి టీమిండియా..
-
Save The Tigers 3: జూన్ 19 నుంచి సరికొత్త ట్విస్టులతో ‘సేవ్ ది టైగర్స్ 3’
-
Giorgia Meloni: జీ 7 సదస్సుకు కుమార్తెతో హాజరైన మెలోని.. ఫొటోలు వైరల్
-
Natti Kumar: ‘పెద్ది’ కలెక్షన్లపై వస్తున్న రూమర్స్ అన్నీ అబద్ధం!
-
India-Bangladesh: ‘‘ఇది షేక్ హసీనా ప్రభుత్వం కాదు’’.. భారత్కు బంగ్లా ప్రధాని సలహాదారు ఘాటు సందేశం
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Fight: భారత్-శ్రీలంక మ్యాచ్లో గొడవ.. వైభవ్ సూర్యవంశీ ఆగ్రహానికి అసలైన కారణం ఇదే!
-
Mrigashira నక్షత్రంలో పుట్టినవారు ఒక్కచోటు కుదురుగా ఉండరుగా.! అదృష్టం, స్వభావం, కెరీర్ అవకాశాలు ఎలా ఉంటాయంటే.?
-
Tilak Varma: నేను ఎవరికీ నీతులు చెప్పడానికి ఇక్కడ రాలేదు.. తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు!
-
Vaibhav Sooryavanshi Fight: వైభవ్ సూర్యవంశీపై కఠిన చర్యలు తప్పవా?.. ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయంటే?
-
Lucky Plants : మీ పుట్టిన తేదీ ప్రకారం ఇంట్లో ఏ మొక్క పెంచితే అదృష్టం కలిసొస్తుందో తెలుసా?