US: నేపాల్ విద్యార్థినిని కాల్చి చంపిన భారత సంతతి వ్యక్తి.. అరెస్ట్
- అగ్ర రాజ్యం అమెరికాలో దారుణం
- నేపాల్ విద్యార్థినిని కాల్చి చంపిన భారత సంతతి వ్యక్తి
- నిందితుడ్ని అరెస్ట్ చేసినట్లు శనివారం పోలీసులు వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అగ్ర రాజ్యం అమెరికాలో నేపాల్కు చెందిన మున పాండే అనే విద్యార్థినిని భారత సంతతికి చెందిన దోపిడీదారుడు పొట్టనపెట్టుకున్నాడు. ఒక్కగానొక్క కుమార్తె చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఆమె ఉంటున్న అపార్ట్మెంట్లోనే హత్యకు గురైంది. మూడు రౌండ్లు కాల్పులు జరపడంతో పాండే మంచం మీదే శవమై కనిపించింది.
సోమవారం సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో హ్యూస్టన్ అపార్ట్మెంట్లో మున పాండే తుపాకీ గాయాలతో పడి ఉందని పోలీసులు తెలిపారు. మున పాండేను అమెరికాలోని ఆమె అపార్ట్మెంట్లో దోపిడీ సమయంలో భారతీయ సంతతికి చెందిన వ్యక్తి కాల్చి చంపినట్లు పోలీసులు శనివారం తెలిపారు. నిందితుడు 52 ఏళ్ల బాబీ సిన్ షాగా గుర్తించినట్లు పేర్కొన్నారు.
Also Read
- Pakistan: పాకిస్థాన్లో ఘోర ప్రమాదం.. లోయలో పడ్డ బస్సు.. 40 మంది మృతి
- Ford: రూ.186 విలువ చేసే కుకీ దొంగిలించాడని ఆరోపణ.. రూ.1.9 కోట్ల జీతం తీసుకునే ఉద్యోగిని తొలగించిన ఫోర్డ్.. చివరికి
- Venezuela Earthquake: భూమ్మీద నూకలున్నయ్.. 8 రోజుల తర్వాత భూకంప శిథిలాల నుంచి ప్రాణాలతో బయటపడిన సెక్యూరిటీ గార్డు
- Imran Khan PTI: పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఎన్నికలు.. ఇమ్రాన్ ఖాన్ పార్టీ సంచలన నిర్ణయం

అపార్ట్మెంట్లో మృతదేహం గురించి తమకు అనుమానాస్పద కాల్ వచ్చిందని పోలీసులు తెలిపారు. ఆమె అపార్ట్మెంట్ కాంప్లెక్స్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునే లోపే ఆమె మృతి చెందినట్లు పోలీసులు నిర్ధారించారు. రెండు రోజుల తర్వాత అపార్ట్మెంట్లో ఉన్న సీసీ కెమెరా పుటేజీ ద్వారా నిందితుడ్ని పోలీసులు గుర్తించి పట్టుకున్నారు. నిందితుడిపై హత్యానేరం కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.
మున పాండే 2021లో నేపాల్ నుంచి అమెరికాలోని హ్యూస్టన్ కమ్యూనిటీ కాలేజీలో చదువుకోవడానికి వెళ్లింది. మున పాండేను సంప్రదించేందుకు ప్రయత్నించినా ఆమె ఫోన్లోకి అందుబాటులోకి రాలేదు. ఈ మేరకు నేపాల్ అసోసియేషన్ ఆఫ్ హ్యూస్టన్ సభ్యుడు చెప్పారు. పాండేపై మూడు బుల్లెట్ల వర్షం కురిపించినట్లు తెలుస్తోంది. మంచం మీదే ఆమె పడి ఉంది. దర్యాప్తులో నిజం తెలుస్తుందని నేపాల్ అసోసియేషన్ తెలిపింది. ఇదిలా ఉంటే మున పాండే తల్లిదండ్రులకు ఆమె ఏకైక సంతానం కావడం విశేషం. ఒక్కగానొక్క కుమార్తె ప్రాణాలు పోవడంతో పేరెంట్స్ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పాండే తల్లి హూస్టన్కు వెళ్లేందుకు ప్రయాణ ఏర్పాట్లు చేయడంలో సహాయం చేసేందుకు అసోసియేషన్ నేపాల్ కాన్సులేట్తో సంప్రదింపులు చేస్తోంది.
మున పాండే కోసం నేపాల్ అసోసియేషన్ GoFundMe పేరుతో ఫండ్ కలెక్ట్ చేస్తోంది. వచ్చిన మొత్తాన్ని పాండే అంత్యక్రియలకు.. ఇతర ఖర్చులకు అందజేయనున్నారు. ఇప్పటికే అసోసియేషన్ డబ్బు కలెక్ట్ చేసింది. పాండే తల్లి.. అమెరికా చేరుకోగానే అందజేయనున్నారు.
తాజావార్తలు
-
Netflix: నెట్ఫ్లిక్స్ బంపర్ ఆఫర్: కొత్త కథా రచయితల కోసం క్రేజీ ఛాన్స్!
-
Sajjala Ramakrishna Reddy: రాజధాని పేరుతో ప్రజలపై అప్పుల మోత.. సజ్జల సంచలన వ్యాఖ్యలు.!
-
July Releases : జూలై బాక్స్ ఆఫీస్ రేసులో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న ఆరుగురు హీరోలు
-
Pakistan: పాకిస్థాన్లో ఘోర ప్రమాదం.. లోయలో పడ్డ బస్సు.. 40 మంది మృతి
-
IND vs ENG 2nd T20: సంజును తొలగించకుండా, వైభవ్కు అవకాశం ఇవ్వాలంటే.. ఇదొక్కటే మార్గం!
ట్రెండింగ్
-
IND vs ENG 2nd T20: సంజు అవుట్, వైభవ్ ఇన్.. రెండో టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Vaibhav Sooryavanshi: దయచేసి వైభవ్ను ఆడించండి.. బీసీసీఐకి ఎవరన్నా చెప్పండ్రా బాబు.. దిగ్గజాల కామెంట్స్ వైరల్!
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!