US: నేపాల్ విద్యార్థినిని కాల్చి చంపిన భారత సంతతి వ్యక్తి.. అరెస్ట్
- అగ్ర రాజ్యం అమెరికాలో దారుణం
- నేపాల్ విద్యార్థినిని కాల్చి చంపిన భారత సంతతి వ్యక్తి
- నిందితుడ్ని అరెస్ట్ చేసినట్లు శనివారం పోలీసులు వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అగ్ర రాజ్యం అమెరికాలో నేపాల్కు చెందిన మున పాండే అనే విద్యార్థినిని భారత సంతతికి చెందిన దోపిడీదారుడు పొట్టనపెట్టుకున్నాడు. ఒక్కగానొక్క కుమార్తె చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఆమె ఉంటున్న అపార్ట్మెంట్లోనే హత్యకు గురైంది. మూడు రౌండ్లు కాల్పులు జరపడంతో పాండే మంచం మీదే శవమై కనిపించింది.
సోమవారం సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో హ్యూస్టన్ అపార్ట్మెంట్లో మున పాండే తుపాకీ గాయాలతో పడి ఉందని పోలీసులు తెలిపారు. మున పాండేను అమెరికాలోని ఆమె అపార్ట్మెంట్లో దోపిడీ సమయంలో భారతీయ సంతతికి చెందిన వ్యక్తి కాల్చి చంపినట్లు పోలీసులు శనివారం తెలిపారు. నిందితుడు 52 ఏళ్ల బాబీ సిన్ షాగా గుర్తించినట్లు పేర్కొన్నారు.
Also Read
- Israel-France: ఇజ్రాయెల్ మంత్రి బెన్-గ్విర్కు ఫ్రాన్స్ షాక్.. దేశంలోకి రాకుండా నిషేధం
- Trump: ‘‘నన్ను మూర్ఖుడని అనొద్దు.. తెలివైన నియంత అనండి’’.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
- Asim Munir: ఉద్రిక్తతల వేళ టెహ్రాన్లో అసిమ్ మునీర్ పర్యటన.. కీలక నేతలతో భేటీ
- Elon Musk: మస్క్కు చైనా గూఢచారుల విందు?.. ట్రంప్ చైనా పర్యటనపై కొత్త వివాదం

అపార్ట్మెంట్లో మృతదేహం గురించి తమకు అనుమానాస్పద కాల్ వచ్చిందని పోలీసులు తెలిపారు. ఆమె అపార్ట్మెంట్ కాంప్లెక్స్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునే లోపే ఆమె మృతి చెందినట్లు పోలీసులు నిర్ధారించారు. రెండు రోజుల తర్వాత అపార్ట్మెంట్లో ఉన్న సీసీ కెమెరా పుటేజీ ద్వారా నిందితుడ్ని పోలీసులు గుర్తించి పట్టుకున్నారు. నిందితుడిపై హత్యానేరం కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.
మున పాండే 2021లో నేపాల్ నుంచి అమెరికాలోని హ్యూస్టన్ కమ్యూనిటీ కాలేజీలో చదువుకోవడానికి వెళ్లింది. మున పాండేను సంప్రదించేందుకు ప్రయత్నించినా ఆమె ఫోన్లోకి అందుబాటులోకి రాలేదు. ఈ మేరకు నేపాల్ అసోసియేషన్ ఆఫ్ హ్యూస్టన్ సభ్యుడు చెప్పారు. పాండేపై మూడు బుల్లెట్ల వర్షం కురిపించినట్లు తెలుస్తోంది. మంచం మీదే ఆమె పడి ఉంది. దర్యాప్తులో నిజం తెలుస్తుందని నేపాల్ అసోసియేషన్ తెలిపింది. ఇదిలా ఉంటే మున పాండే తల్లిదండ్రులకు ఆమె ఏకైక సంతానం కావడం విశేషం. ఒక్కగానొక్క కుమార్తె ప్రాణాలు పోవడంతో పేరెంట్స్ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పాండే తల్లి హూస్టన్కు వెళ్లేందుకు ప్రయాణ ఏర్పాట్లు చేయడంలో సహాయం చేసేందుకు అసోసియేషన్ నేపాల్ కాన్సులేట్తో సంప్రదింపులు చేస్తోంది.
మున పాండే కోసం నేపాల్ అసోసియేషన్ GoFundMe పేరుతో ఫండ్ కలెక్ట్ చేస్తోంది. వచ్చిన మొత్తాన్ని పాండే అంత్యక్రియలకు.. ఇతర ఖర్చులకు అందజేయనున్నారు. ఇప్పటికే అసోసియేషన్ డబ్బు కలెక్ట్ చేసింది. పాండే తల్లి.. అమెరికా చేరుకోగానే అందజేయనున్నారు.
తాజావార్తలు
-
Rahman : ‘పెద్ది’ ఆ కోరిక తీర్చింది!
-
Ram Charan: నా కెరీర్లోనే ‘పెద్ది’ నంబర్ వన్ చిత్రం
-
AP Film Corporation: ఏపీ ఫిల్మ్ కార్పొరేషన్ నూతన బోర్డు ఏర్పాటు
-
OTR : పాలమూరు కాంగ్రెస్లో రచ్చ రచ్చ.. సిటీ ప్రెసిడెంట్ పదవి కోసం కుమ్ములాట!
-
Wife Murder: బీమా డబ్బుల కోసం.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కొట్టి చంపేసిన కీచక భర్త..!
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?