US: నేపాల్ విద్యార్థినిని కాల్చి చంపిన భారత సంతతి వ్యక్తి.. అరెస్ట్
- అగ్ర రాజ్యం అమెరికాలో దారుణం
- నేపాల్ విద్యార్థినిని కాల్చి చంపిన భారత సంతతి వ్యక్తి
- నిందితుడ్ని అరెస్ట్ చేసినట్లు శనివారం పోలీసులు వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అగ్ర రాజ్యం అమెరికాలో నేపాల్కు చెందిన మున పాండే అనే విద్యార్థినిని భారత సంతతికి చెందిన దోపిడీదారుడు పొట్టనపెట్టుకున్నాడు. ఒక్కగానొక్క కుమార్తె చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఆమె ఉంటున్న అపార్ట్మెంట్లోనే హత్యకు గురైంది. మూడు రౌండ్లు కాల్పులు జరపడంతో పాండే మంచం మీదే శవమై కనిపించింది.
సోమవారం సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో హ్యూస్టన్ అపార్ట్మెంట్లో మున పాండే తుపాకీ గాయాలతో పడి ఉందని పోలీసులు తెలిపారు. మున పాండేను అమెరికాలోని ఆమె అపార్ట్మెంట్లో దోపిడీ సమయంలో భారతీయ సంతతికి చెందిన వ్యక్తి కాల్చి చంపినట్లు పోలీసులు శనివారం తెలిపారు. నిందితుడు 52 ఏళ్ల బాబీ సిన్ షాగా గుర్తించినట్లు పేర్కొన్నారు.
Also Read
- Bangladesh: షేక్ హసీనాకు అధ్యక్షుడి పిలుపు.. బంగ్లాదేశ్లో రాజకీయ కల్లోలం..
- Pakistan: సౌదీకి మేమున్నాం.. ఇరాన్కు పాకిస్తాన్ ప్రధాని వార్నింగ్..
- Trump: మరో దేశంపై సైనిక దాడికి ట్రంప్ ఏర్పాట్లు?.. ఏం జరగబోతుంది?
- US Defense Budget: ప్రపంచాన్ని వణికిస్తున్న అమెరికా డిఫెన్స్ బడ్జెట్.. షాక్కు గురి చేస్తున్న లక్షల కోట్లు!

అపార్ట్మెంట్లో మృతదేహం గురించి తమకు అనుమానాస్పద కాల్ వచ్చిందని పోలీసులు తెలిపారు. ఆమె అపార్ట్మెంట్ కాంప్లెక్స్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునే లోపే ఆమె మృతి చెందినట్లు పోలీసులు నిర్ధారించారు. రెండు రోజుల తర్వాత అపార్ట్మెంట్లో ఉన్న సీసీ కెమెరా పుటేజీ ద్వారా నిందితుడ్ని పోలీసులు గుర్తించి పట్టుకున్నారు. నిందితుడిపై హత్యానేరం కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.
మున పాండే 2021లో నేపాల్ నుంచి అమెరికాలోని హ్యూస్టన్ కమ్యూనిటీ కాలేజీలో చదువుకోవడానికి వెళ్లింది. మున పాండేను సంప్రదించేందుకు ప్రయత్నించినా ఆమె ఫోన్లోకి అందుబాటులోకి రాలేదు. ఈ మేరకు నేపాల్ అసోసియేషన్ ఆఫ్ హ్యూస్టన్ సభ్యుడు చెప్పారు. పాండేపై మూడు బుల్లెట్ల వర్షం కురిపించినట్లు తెలుస్తోంది. మంచం మీదే ఆమె పడి ఉంది. దర్యాప్తులో నిజం తెలుస్తుందని నేపాల్ అసోసియేషన్ తెలిపింది. ఇదిలా ఉంటే మున పాండే తల్లిదండ్రులకు ఆమె ఏకైక సంతానం కావడం విశేషం. ఒక్కగానొక్క కుమార్తె ప్రాణాలు పోవడంతో పేరెంట్స్ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పాండే తల్లి హూస్టన్కు వెళ్లేందుకు ప్రయాణ ఏర్పాట్లు చేయడంలో సహాయం చేసేందుకు అసోసియేషన్ నేపాల్ కాన్సులేట్తో సంప్రదింపులు చేస్తోంది.
మున పాండే కోసం నేపాల్ అసోసియేషన్ GoFundMe పేరుతో ఫండ్ కలెక్ట్ చేస్తోంది. వచ్చిన మొత్తాన్ని పాండే అంత్యక్రియలకు.. ఇతర ఖర్చులకు అందజేయనున్నారు. ఇప్పటికే అసోసియేషన్ డబ్బు కలెక్ట్ చేసింది. పాండే తల్లి.. అమెరికా చేరుకోగానే అందజేయనున్నారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?