Delhi: పాక్-సౌదీ రక్షణ ఒప్పందంపై స్పందించిన భారత్
- పాక్-సౌదీ రక్షణ ఒప్పందంపై భారత్ కీలక వ్యాఖ్యలు
- ఒప్పందంపై అధ్యయనం చేస్తున్నట్లుగా ప్రకటన
పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ సౌదీ అరేబియాలో పర్యటించారు. ఇక రియాద్లో సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్తో షరీఫ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాలు రక్షణ ఒప్పందం చేసుకున్నాయి. పరస్పరం రక్షణ ఒప్పందంపై సంతకాలు చేసుకున్నాయి. ఈ ఒప్పందం యొక్క ఉద్దేశం.. ఏ దేశంపైనైనా దాడి జరిగితే.. రెండు దేశాల మధ్య జరిగిన దురాక్రమణగా పరిగణించబడుతుందని ప్రకటించాయి. అప్పుడు రెండు దేశాలు కలిసి.. శత్రువుపై దాడి చేయడమే ఒప్పందం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ ఒప్పందం సందర్భంగా దిగిన ఫొటోలో పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ కూడా ఉన్నాడు.
ఇది కూడా చదవండి: Punjab: 75 ఏళ్ల వ్యక్తితో ప్రేమలో పడ్డ 71 ఏళ్ల వృద్ధురాలు.. అమెరికా నుంచి భారత్కు వచ్చి చివరికిలా..!
Also Read
- Ukraine: ట్రంప్ను ప్రసన్నం చేసుకునేందుకు ఉక్రెయిన్ మాస్టర్ ప్లాన్!
- Titanic Life Jacket: 114 ఏళ్ల కిందటి విషాదానికి సాక్ష్యం.. వేలంలో రూ.8 కోట్లు పలికిన టైటానిక్ లైఫ్ జాకెట్!
- Donald Trump: గుడ్న్యూస్ చెప్పిన డొనాల్డ్ ట్రంప్.. ఈ శుక్రవారంతో అంతా ఫైనల్..
- Condom Prices: బెడ్రూమ్లో అమెరికా - ఇరాన్ 'వార్' సెగ! కండోమ్ ధరలకు రెక్కలు!
తాజాగా పాక్-సౌదీ రక్షణ ఒప్పందంపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. ఈ ఒప్పందంపై అధ్యయనం చేస్తున్నట్లుగా ప్రకటించింది. జాతీయ ప్రయోజనాలు కాపాడటానికి, అన్ని రంగాల్లో సమగ్ర జాతీయ భద్రత కాపాడటానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మీడియా ప్రశ్నకు విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇరు దేశాల ఒప్పందాన్ని అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొంది.
ఇది కూడా చదవండి: Charlie Kirk: చార్లీ కిర్క్ హత్యపై జిమ్మీ కిమ్మెల్ ఎగతాళి.. లైవ్షో బహిష్కరిస్తున్నట్లు నెక్స్స్టార్ ప్రకటన
సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ ఆహ్వానం మేరకు పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ బుధవారం రియాద్ను సందర్శించారు. రియాద్లోని అల్-యమామా ప్యాలెస్లో షరీఫ్ను సౌదీ యువరాజు కలిశారు. రెండు దేశాల మధ్య చారిత్రాత్మక, వ్యూహాత్మక సంబంధాలు సమీక్షించినట్లు పేర్కొన్నాయి. ఈ రెండు దేశాల మధ్య దాదాపు 8 దశాబ్దాలుగా చారిత్రాత్మక భాగస్వామ్యం కొనసాగుతోంది. తాజా ఒప్పందం.. సోదరభావం.. ఇస్లామిక్ సంఘీభావం, అలాగే భాగస్వామ్య వ్యూహాత్మకం, రక్షణ సహకారానికి ఆధారపడి ఉందని ఉమ్మడి ప్రకటనలో పేర్కొంది.
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్పై భారతదేశం ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. దీంతో రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్థాన్-సౌదీ రక్షణ ఒప్పందం చేసుకోవడం తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. పైగా ఒక దేశంపై దాడి చేస్తే.. రెండు దేశాలపై దాడి చేసినట్లుగా భావించి.. రెండు దేశాల కలిసి శత్రువుపై దాడి చేయాలనేది కొత్త ఒప్పందం యొక్క ఉద్దేశం.
వాస్తవంగా భారత్-సౌదీ మధ్య కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. ఇరు దేశాల మధ్య రియాద్లో ద్వైపాక్షిక సంబంధాలు కూడా జరిగాయి. మోడీ మూడు సార్లు సౌదీకి వెళ్లారు. 2016లో సౌదీ అరేబియా అత్యున్నత పౌర పురస్కారం అయిన కింగ్ అబ్దుల్ అజీజ్ సాష్ను మోడీకి ప్రదానం చేశారు. భారతదేశం ఇప్పుడు సౌదీకి రెండో అతిపెద్ద వాణిజ్య భాగస్వామి కూడా ఉంది. ఇక ఈ ఏడాది ఏప్రిల్లో ప్రధాని మోడీ రియాద్ పర్యటన సందర్భంగా పహల్గామ్ ఉగ్రదాడిని సౌదీ ఖండించింది. ఏ కారణం చేతనైనా ఉగ్ర దాడిని సమర్థించేది లేదని సౌదీ ప్రకటించింది. సరిహద్దు ఉగ్రవాదాన్ని కూడా సౌదీ ఖండించింది. కానీ తాజాగా పాక్తో రక్షణ ఒప్పందం చేసుకోవడం వెనుక ఉన్న ఉద్దేశం ఏంటో..!
తాజావార్తలు
-
Off The Record : ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు వద్దన్న హైకోర్ట్
-
Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్పై రూ.25, డీజిల్పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
-
Asian Games: ‘ఆసియా క్రీడల’ ప్రత్యక్ష ప్రసారం సోనీ నెట్వర్క్ చేతికి.. యాప్లో కూడా..
-
Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
-
Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్లో.. ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు సగం కంటే తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?