Joe Biden: “ఇండియా-మిడిల్ ఈస్ట్ ఎకనామిక్ కారిడార్” హమాస్ దాడికి కారణం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Joe Biden: గత 20 రోజులుగా ఇజ్రాయిల్-హమాస్ మధ్య భీకర యుద్ధం జరుగుతోంది. అక్టోబర్ 7న ఇజ్రాయిల్ భూభాగంలోకి చొరబడిని హమాస్ ఉగ్రవాదాలు దారుణమైన ఊచకోతకు పాల్పడ్దారు. అప్పటి నుంచి ఇజ్రాయిల్ గాజాపై వైమానికి దాడులు నిర్వహిస్తోంది. అయితే పటిష్టమైన నిఘా వ్యవస్థ, మొస్సాద్ వంటి వ్యవస్థలు ఉన్నా కూడా ఇజ్రాయిల్, పొరుగున పాలస్తీనా గాజా నుంచి ఎదురయ్యే దాడిని కనిపెట్టలేకపోయింది.
ఇదిలా ఉంటే ఇజ్రాయిల్పై హమాస్ దాడికి ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరప్ కారిడార్(IMEC) కారణమని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ బుధవారం ఆరోపించారు. హమాస్ దాడికి ఈ కారిడార్ కూడా ఒక కారణమని నేను నమ్ముతున్నానని, దీనికి నా దగ్గర ఎలాంటి రుజువలు లేవు, నా ప్రవృత్తి నాకు చెబుతోంది, ఈ ప్రాంతంలో ఇజ్రాయిల్ మరింతగా దగ్గర అవుతుండటం, ఈ ప్రాంత సమైక్యత కోసం పురోగతి సాధిస్తున్న క్రమంలో ఈ దాడి జరిగిందని, మేము ఈ పనిని వదిలి పెట్టమని బైడెన్ చెప్పారు.
Also Read
- Middle East Tensions: మిడిల్ ఈస్ట్లో మరో భీకర యుద్ధానికి స్క్రిప్ట్.. ఇజ్రాయెల్ లక్ష్యంగా ఇరాన్ ‘షాడో వార్’!
- Giorgia Meloni: మెలోని ఢిల్లీలో పోటీ చేస్తే లక్షల ఓట్లు గ్యారెంటీ..
- India-Bangladesh: బంగ్లాదేశ్ పౌరులకు గుడ్న్యూస్.. టూరిస్ట్ వీసాల జారీకి భారత్ గ్రీన్ సిగ్నల్
- Pakistan: సైనికుల జీతాలు 25% పెంచిన పాక్.. సిందూర్ దెబ్బకు పరిహారమా?
Read Also: Israel-Hamas War: గాజాలోకి ప్రవేశించిన ఇజ్రాయిల్ యుద్ధ ట్యాంకులు.. భూతల దాడికి అంతా సిద్ధం..
ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోని అల్బనీస్తో జాయింట్ మీడియా సమావేశంలో అమెరికా అధ్యక్షుడు ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన జీ20 సమావేశంలో ‘‘ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరప్ ఎకనామిక్ కారిడార్’’పై భారత్, యూఎస్ఏ, యూఏఈ, సౌదీ అరేబియా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, యూరోపియన్ యూనియన్ ఈ ఒప్పందంపై ఎంఓయూ కుదుర్చుకున్నాయి.
ఈ కారిడార్ వల్ల ఇండియా, పశ్చిమాసియా, మధ్యప్రాచ్యం, యూరప్ మధ్య మెరుగైన కనెక్టివిటీ ఏర్పడుతుంది. దీంట్లో భాగంగా భారీ ఓడరేవులు, రోడ్డు, రైలు మార్గాలతో అరబ్, మిడిల్ ఈస్ట్ దేశాలను ఇజ్రాయిల్, యూరప్, ఇండియాలను కనెక్ట్ చేయవచ్చు. భారతదేశం ద్వారా ఆగ్నేయాసియా దేశాలకు వస్తువులు, సేవల్ని సులభంగా ఎగుమతి చేయవచ్చు. చైనా ‘ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్(బీఆర్ఐ)’కి వ్యతిరేకంగా ఈ ప్రాజెక్టు కీలకం అవుతుందని యూరప్, అమెరికా, ఇజ్రాయిల్, సౌదీ, యూఏఈ వంటి దేశాలు భావిస్తున్నాయి.
తాజావార్తలు
-
Raja Shivaji OTT: బాక్సాఫీస్ రికార్డులు బద్దలుకొట్టిన ‘రాజా శివాజీ’.. ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్
-
Yash Dayal: యశ్ దయాల్ ‘కమ్బ్యాక్’.. ‘పోక్సో’ కేసుల నుంచి విముక్తి!
-
Kalki 2 Update: నాగ్ అశ్విన్ మాస్టర్ ప్లాన్.. రెండు సిరీస్లతో ‘కల్కి 2’ భారీ సర్ప్రైజ్!
-
Hyderabad: సీఎం, సజ్జనార్ పేర్లు వాడుకుంటూ దందా.. ‘గోల్డ్ మ్యాన్’పై కేసు నమోదు..
-
Middle East Tensions: మిడిల్ ఈస్ట్లో మరో భీకర యుద్ధానికి స్క్రిప్ట్.. ఇజ్రాయెల్ లక్ష్యంగా ఇరాన్ ‘షాడో వార్’!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!