Joe Biden: “ఇండియా-మిడిల్ ఈస్ట్ ఎకనామిక్ కారిడార్” హమాస్ దాడికి కారణం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Joe Biden: గత 20 రోజులుగా ఇజ్రాయిల్-హమాస్ మధ్య భీకర యుద్ధం జరుగుతోంది. అక్టోబర్ 7న ఇజ్రాయిల్ భూభాగంలోకి చొరబడిని హమాస్ ఉగ్రవాదాలు దారుణమైన ఊచకోతకు పాల్పడ్దారు. అప్పటి నుంచి ఇజ్రాయిల్ గాజాపై వైమానికి దాడులు నిర్వహిస్తోంది. అయితే పటిష్టమైన నిఘా వ్యవస్థ, మొస్సాద్ వంటి వ్యవస్థలు ఉన్నా కూడా ఇజ్రాయిల్, పొరుగున పాలస్తీనా గాజా నుంచి ఎదురయ్యే దాడిని కనిపెట్టలేకపోయింది.
ఇదిలా ఉంటే ఇజ్రాయిల్పై హమాస్ దాడికి ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరప్ కారిడార్(IMEC) కారణమని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ బుధవారం ఆరోపించారు. హమాస్ దాడికి ఈ కారిడార్ కూడా ఒక కారణమని నేను నమ్ముతున్నానని, దీనికి నా దగ్గర ఎలాంటి రుజువలు లేవు, నా ప్రవృత్తి నాకు చెబుతోంది, ఈ ప్రాంతంలో ఇజ్రాయిల్ మరింతగా దగ్గర అవుతుండటం, ఈ ప్రాంత సమైక్యత కోసం పురోగతి సాధిస్తున్న క్రమంలో ఈ దాడి జరిగిందని, మేము ఈ పనిని వదిలి పెట్టమని బైడెన్ చెప్పారు.
Also Read
- US - Iran Conflict: అగ్రరాజ్యం అమెరికాకు ఉక్రెయిన్ ఊహించని సాయం.. ఇక ఇరాన్కు కష్టమేనా!
- Hantavirus: హంటావైరస్పై ఆందోళన.. వ్యాక్సిన్ లేదు.. మరి చికిత్స ఎలా..?
- Russia: ప్రపంచానికి షాక్ ఇచ్చిన పుతిన్ 'అణు' బాంబ్.. 'సర్మాట్' క్షిపణితో సర్ప్రైజ్!
- Bangladesh: బెంగాల్లో ముస్లింకు ఏమైనా జరిగితే, బంగ్లాదేశ్లో హిందువుల్ని వదిలిపెట్టం..
Read Also: Israel-Hamas War: గాజాలోకి ప్రవేశించిన ఇజ్రాయిల్ యుద్ధ ట్యాంకులు.. భూతల దాడికి అంతా సిద్ధం..
ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోని అల్బనీస్తో జాయింట్ మీడియా సమావేశంలో అమెరికా అధ్యక్షుడు ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన జీ20 సమావేశంలో ‘‘ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరప్ ఎకనామిక్ కారిడార్’’పై భారత్, యూఎస్ఏ, యూఏఈ, సౌదీ అరేబియా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, యూరోపియన్ యూనియన్ ఈ ఒప్పందంపై ఎంఓయూ కుదుర్చుకున్నాయి.
ఈ కారిడార్ వల్ల ఇండియా, పశ్చిమాసియా, మధ్యప్రాచ్యం, యూరప్ మధ్య మెరుగైన కనెక్టివిటీ ఏర్పడుతుంది. దీంట్లో భాగంగా భారీ ఓడరేవులు, రోడ్డు, రైలు మార్గాలతో అరబ్, మిడిల్ ఈస్ట్ దేశాలను ఇజ్రాయిల్, యూరప్, ఇండియాలను కనెక్ట్ చేయవచ్చు. భారతదేశం ద్వారా ఆగ్నేయాసియా దేశాలకు వస్తువులు, సేవల్ని సులభంగా ఎగుమతి చేయవచ్చు. చైనా ‘ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్(బీఆర్ఐ)’కి వ్యతిరేకంగా ఈ ప్రాజెక్టు కీలకం అవుతుందని యూరప్, అమెరికా, ఇజ్రాయిల్, సౌదీ, యూఏఈ వంటి దేశాలు భావిస్తున్నాయి.
తాజావార్తలు
-
Tollywood: ప్రొడ్యూసర్ కౌన్సిల్లో కలకలం..జాయింట్ సెక్రటరీ పదవికి నట్టి కుమార్ రాజీనామా!
-
IPL 2026 Tickets Scam: ఫ్రీ ఐపీఎల్ టికెట్లు అంటూ భారీ మోసం.. 600కు పైగా ఫేక్ వెబ్సైట్లు గుర్తింపు, తస్మాత్ జాగ్రత్త!
-
CM Chandrababu: పారిశ్రామికవేత్తలకు సీఎం చంద్రబాబు పిలుపు.. అమరావతి అభివృద్ధికి ముందుకు రావాలి
-
US – Iran Conflict: అగ్రరాజ్యం అమెరికాకు ఉక్రెయిన్ ఊహించని సాయం.. ఇక ఇరాన్కు కష్టమేనా!
-
CM Vijay: జ్యోతిష్యుడికి కీలక పోస్టు, ఒక్క రోజులోనే తొలగింపు.. విమర్శలకు తలొగ్గిన సీఎం విజయ్..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!