India-China Border: భారత్ భూభాగాన్ని ఆక్రమించిన చైనా.. 26 గస్తీ పాయింట్లు కోల్పోయామన్న అధికారి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Lost 26 Patrol Points At Eastern Ladakh: భారత్-చైనా సరిహద్దుల్లో ఎప్పుడూ ఉద్రిక్త వాతావరణం నెలకొంటూనే ఉంటుంది. భారత భూభాగాన్ని ఆక్రమించుకునేందుకు డ్రాగన్ కంట్రీ ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా కేంద్రానికి ఓ సంచలన నివేదిక అందింది. అందులో భారత భూభాగాన్ని చైనా ఆక్రమించుకుందని.. స్వయంగా మన దేశానికి చెందిన ఓ సీనియర్ పోలీస్ అధికారి ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చారు. భారత్ తూర్పు లద్దాఖ్లోని మొత్తం 65 గస్తీ పాయింట్లు ఉండగా.. అందులో 26 గస్తీ పాయింట్లను కోల్పోయిందని ఆ నివేదికలో పేర్కొన్నారు. ‘‘ప్రస్తుతం తూర్పు లద్దాఖ్ కారాకోరం పాస్ నుంచి చుమూర్ వరకు 65 పెట్రోలింగ్ పాయింట్లు ఉన్నాయి. ఈ పాయింట్లో భారత సాయుధ బలగాలు క్రమం తప్పకుండా గస్తీ నిర్వహించాలి. కానీ.. 26 చోట్ల(5-17, 24-32, 37)కు మన బలగాలు వెళ్లలేకపోతున్నాయి’’ అని లేహ్ ఎస్పీ పీడీ నిత్య ఆ నివేదికలో వెల్లడించారు. గత వారం ఢిల్లీలో జరిగిన పోలీస్ సదస్సులో ఆమె ఈ నివేదికను కేంద్రానికి సమర్పించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్షా, ఎన్ఎస్ఏ అజిత్ డోభాల్ కూడా పాల్గొన్నారు.
Padma Awards 2023: పద్మ పురస్కారాలను ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం
Also Read
ఆ 26 చోట్ల భారత సాయుధ బలగాల గస్తీ నిర్వహణ లేకపోవడాన్ని సాకుగా చూపించి.. ఆ భూభాగాలను చైనా కలిపేసుకుంటోందని నిత్య ఆ నివేదికలో పేర్కొన్నారు. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు కొన్ని చోట్ల బఫర్ జోన్లను ఏర్పాటు చేయడం జరిగిందని.. అయితే వాటిని ఆసరాగా చేసుకొని సరిహద్దునను వెనక్కి నొడుతూ భారత్కు చెందిన ప్రాంతాలను చైనా ఆక్రమిస్తున్నట్టు ఆమె చెప్పుకొచ్చారు. అంతేకాదు.. భారత బలగాల కదలికల్ని గుర్తించేందుకు అక్కడి ఎత్తైనా శిఖరాలపై కెమెరాలను సైతం అమర్చినట్టు తెలిపారు. బఫర్ జోన్లోకి భారత సైన్యం ప్రవేశించిన వెంటనే.. ఆ ప్రదేశం తమ దేశానికి చెందినదేనంటూ చైనా దూకుడుగా వ్యవహరిస్తోందని తెలిపారు. ఆ ప్రదేశం తమ భూభాగమని చైనా వాదిస్తోందని.. కొద్దిరోజుల నుంచి చైనా ఇలాగే ఏకపక్షంగా వ్యవహరిస్తూ వస్తోందని ఆమె తన నివేదినలో స్పష్టం చేశారు. కాగా.. చైనా ఏకపక్షంగా సరిహద్దులను మార్చేందుకు యత్నిస్తోందని భారత్ ఆరోపించిన నెలరోజులకే ఈ నివేదిక వెలుగులోకి రావడం గమనార్హం.
Lucknow Building Collapse: లక్నోలో కూలిన భవనం.. ఎస్పీ నేత తల్లి, భార్య దుర్మరణం
తాజావార్తలు
-
India U18 Hockey Asia Cup Champion: జపాన్పై ఘన విజయం.. అండర్-18 హాకీ ఆసియా కప్ ఛాంపియన్గా భారత్
-
Horoscope Today: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధి!
-
Mohali Office Murder: ఆ కారణంతోనే చంపాడు.. మొహాలి ఘటన చెప్పిన చేదు నిజం!
-
Salim Kumar Passed Away : ప్రముఖ నటుడు జాతీయ అవార్డు గ్రహీత కన్నుమూత.!
-
Spirit : ‘స్పిరిట్’ ఇంటర్నేషనల్ అన్నారు కదా.. మరి లోకల్ లోనే చుట్టేస్తున్నారేంటి?
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!