Lucknow Building Collapse: లక్నోలో కూలిన భవనం.. ఎస్పీ నేత తల్లి, భార్య దుర్మరణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Samajwadi Party Leader Abbas Haider Mother And Wife In Lucknow Building Collapse Incident: లక్నోలో నాలుగు అంతస్థుల భవనం కుప్పకూలిన ఘటనలో సమాజ్వాదీ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి అబ్బాస్ హైదర్ తల్లి బేగం హైదర్ (72), భార్య ఉజ్మా(30) దుర్మరణం చెందారు. శిథిలాల కింద చిక్కుకున్న ఆ ఇద్దరిని సహాయక బృందాలు కాపాడి ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ వారు మృత చెందారు. ఈ ఘటనలో వారికి తీవ్ర గాయాలపాలవ్వడం వల్లే మృతి చెందినట్టు తేలింది. దీంతో అబ్బాస్ హైదర్ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తల్లితో పాటు భార్య మృతి చెందడంతో.. ఆయన శోకసంద్రంలో మునిగారు. మరోవైపు.. ఈ ప్రమాదం జరిగిన వెంటనే రెస్క్యూ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకొని, శిథిలాల కింద చిక్కుకున్న 12 మందిని సజీవంగా బయటకు తీశారు. ఇంకా ఆ శిథిలాల కింద మరో ఇద్దరు లేదా ముగ్గురు చిక్కుకొని ఉండొచ్చని అధికారులు చెప్తున్నారు.
Pune Crime News: దారుణం.. ఏడుగురిని బలి తీసుకున్న ‘ప్రతీకారం’
Also Read
- Swine Flu H1N1 in India: H1N1 కొత్త వేరియంట్ వచ్చిందా? కరోనా లాంటి ముప్పు ఉందా? ICMR కీలక సమాచారం
- Kangana Ranaut: ‘వాళ్లంతా పనికిమాలిన వాళ్లు’.. తాప్సీ, బాబా రామ్దేవ్పై కంగనా ఘాటు వ్యాఖ్యలు
- CJP: ఢిల్లీలో సెప్టెంబర్ 5న భారీ నిరసన మార్చ్.. మరోసారి ఆందోళనకు సిద్ధమైన విద్యార్థులు
- Tamil Nadu: తీవ్ర దుమారం రేపుతోన్న పొట్టి దుస్తుల వ్యవహారం.. మంత్రి కీర్తన ఘాటు స్పందన
ఇదిలావుండగా.. ఈ అలాయా అపార్ట్మెంట్ యజమానులైన మహ్మద్ తారిఖ్, నవాజీష్ షాహిద్, బిల్డర్ ఫహద్ యజ్దానీలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఫహద్ యజ్దానీ నిర్మించిన ఈ భవనాన్ని 2009లో షాహిద్ మంజూర్ మేనల్లుడు మహ్మద్ తారిఖ్, ఆయన కుమారుడు నవాజీష్ షాహిద్ 2009లో మార్కెట్ ధర కన్నా రూ. 20 లక్షలకు తక్కువగా కొనుగోలు చేశారు. మంగళవారం అర్థరాత్రి ఈ భవనం ఉన్నపళంగా కుప్పకూలింది. ఈ భవనం కూలిపోవడానికి గల కారణాలను అధికారులు అన్వేషిస్తున్నారు. అటు.. డివిజన్ కమిషనర్ రోషన్ జాకబ్ లక్నో డెవలప్మెంట్ అధికారులపై కూడా కేసు నమోదు చేయాలని ఆదేశించారు. అలాగే బిల్డర్ యజ్దానీ నిర్మించిన ఇతర భవనాల గురించి కూడా తనీఖీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఒకవేళ ఆ భవనాలు కూడా నాణ్యమైనవి కావు అని తేలితే.. వాటిని కూడా కూల్చేయమని చెప్పారు. కాగా.. ఈ ఘటనపై దర్యాప్తుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది.
Suryakumar Yadav: సూర్యకుమార్కు ప్రతిష్టాత్మక అవార్డ్.. టీ20 చరిత్రలోనే ఏకైక బ్యాటర్గా..
తాజావార్తలు
-
Nakshathra : లవ్ యూ నాన్న, లవ్ యూ అమ్మ
-
Ravi Teja: ‘ఇరుముడి’ సక్సెస్ జోష్.. ‘శివ నువ్వు తోపు సామీ’.. స్టేజ్ పైనే డైరెక్టర్ను హత్తుకున్న మాస్ మహారాజా!
-
Mythri Ravi: ఫోన్లో రీల్స్ చూసినా ఏడుపొస్తోంది.. ‘అన్నమయ్య’ తర్వాత మళ్లీ ఇప్పుడే..
-
Mythri Naveen: ఈ సినిమా చూసి 10 నిమిషాలు ఏడిచాను
-
Swine Flu H1N1 in India: H1N1 కొత్త వేరియంట్ వచ్చిందా? కరోనా లాంటి ముప్పు ఉందా? ICMR కీలక సమాచారం
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!