Lucknow Building Collapse: లక్నోలో కూలిన భవనం.. ఎస్పీ నేత తల్లి, భార్య దుర్మరణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Samajwadi Party Leader Abbas Haider Mother And Wife In Lucknow Building Collapse Incident: లక్నోలో నాలుగు అంతస్థుల భవనం కుప్పకూలిన ఘటనలో సమాజ్వాదీ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి అబ్బాస్ హైదర్ తల్లి బేగం హైదర్ (72), భార్య ఉజ్మా(30) దుర్మరణం చెందారు. శిథిలాల కింద చిక్కుకున్న ఆ ఇద్దరిని సహాయక బృందాలు కాపాడి ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ వారు మృత చెందారు. ఈ ఘటనలో వారికి తీవ్ర గాయాలపాలవ్వడం వల్లే మృతి చెందినట్టు తేలింది. దీంతో అబ్బాస్ హైదర్ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తల్లితో పాటు భార్య మృతి చెందడంతో.. ఆయన శోకసంద్రంలో మునిగారు. మరోవైపు.. ఈ ప్రమాదం జరిగిన వెంటనే రెస్క్యూ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకొని, శిథిలాల కింద చిక్కుకున్న 12 మందిని సజీవంగా బయటకు తీశారు. ఇంకా ఆ శిథిలాల కింద మరో ఇద్దరు లేదా ముగ్గురు చిక్కుకొని ఉండొచ్చని అధికారులు చెప్తున్నారు.
Pune Crime News: దారుణం.. ఏడుగురిని బలి తీసుకున్న ‘ప్రతీకారం’
Also Read
- CM Vijay: ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా ‘జన నాయకన్’ నిర్మాత నియామకం.. తమిళనాడులో రాజకీయ దుమారం
- Ketan Agarwal murder: ‘‘కుటుంబానికి చెప్పడం కన్నా చంపడమే ఈజీ’’.. కేతన్ హత్యలో సియా సంచలన ఒప్పుకోలు..
- Ketan Agarwal Case: దర్యాప్తులో సంచలన ట్విస్ట్.. వేళ్లన్నీ సియా తల్లిదండ్రుల వైపే..!
- Iran Oil: భారీ డిస్కౌంట్తో ఇరాన్ చమురు ఆఫర్.. అయినా భారత్ ఎందుకు కొనడం లేదు?
ఇదిలావుండగా.. ఈ అలాయా అపార్ట్మెంట్ యజమానులైన మహ్మద్ తారిఖ్, నవాజీష్ షాహిద్, బిల్డర్ ఫహద్ యజ్దానీలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఫహద్ యజ్దానీ నిర్మించిన ఈ భవనాన్ని 2009లో షాహిద్ మంజూర్ మేనల్లుడు మహ్మద్ తారిఖ్, ఆయన కుమారుడు నవాజీష్ షాహిద్ 2009లో మార్కెట్ ధర కన్నా రూ. 20 లక్షలకు తక్కువగా కొనుగోలు చేశారు. మంగళవారం అర్థరాత్రి ఈ భవనం ఉన్నపళంగా కుప్పకూలింది. ఈ భవనం కూలిపోవడానికి గల కారణాలను అధికారులు అన్వేషిస్తున్నారు. అటు.. డివిజన్ కమిషనర్ రోషన్ జాకబ్ లక్నో డెవలప్మెంట్ అధికారులపై కూడా కేసు నమోదు చేయాలని ఆదేశించారు. అలాగే బిల్డర్ యజ్దానీ నిర్మించిన ఇతర భవనాల గురించి కూడా తనీఖీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఒకవేళ ఆ భవనాలు కూడా నాణ్యమైనవి కావు అని తేలితే.. వాటిని కూడా కూల్చేయమని చెప్పారు. కాగా.. ఈ ఘటనపై దర్యాప్తుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది.
Suryakumar Yadav: సూర్యకుమార్కు ప్రతిష్టాత్మక అవార్డ్.. టీ20 చరిత్రలోనే ఏకైక బ్యాటర్గా..
తాజావార్తలు
-
Aadarsha Kutumbam: అక్టోబర్ 2న ‘ఆదర్శ కుటుంబం’.. రిలీజ్ డేట్ లాక్! వెంకీ ఫ్యాన్స్కు పూనకాలే..
-
CM Vijay: ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా ‘జన నాయకన్’ నిర్మాత నియామకం.. తమిళనాడులో రాజకీయ దుమారం
-
Ketan Agarwal murder: ‘‘కుటుంబానికి చెప్పడం కన్నా చంపడమే ఈజీ’’.. కేతన్ హత్యలో సియా సంచలన ఒప్పుకోలు..
-
Ketan Agarwal Case: దర్యాప్తులో సంచలన ట్విస్ట్.. వేళ్లన్నీ సియా తల్లిదండ్రుల వైపే..!
-
KTR: వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు, గులాబీ జెండా ఎగరడం ఖాయం
ట్రెండింగ్
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..