India vs Pakistan: ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్నామని పాకిస్థాన్ చెప్పడం హాస్యాస్పదం
- మరోసారి అంతర్జాతీయ వేదిక మీద భారత్పై అక్కసు వెళ్లగక్కిన పాకిస్థాన్..
- జమ్మూకశ్మీర్ తమదేనని ప్రకటించిన పాక్ విదేశాంగ మంత్రి మహమ్మద్ ఇషక్ దార్..
- పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఇషక్ దార్ పై తీవ్రంగా మండిపడిన భారత ప్రతినిధి..
- జమ్మూకశ్మీర్ ఎప్పుడూ భారత్లో అంతర్భాగమే: భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India vs Pakistan: అంతర్జాతీయ వేదికలపై భారత్పై అక్కసు వెళ్లగక్కడం పాకిస్థాన్కు మొదటి నుంచి ఉన్న అలవాటు. అయితే, చైనా అధ్యక్షతన జరిగిన భద్రతా మండలి సమావేశంలో జమ్మూ కశ్మీర్ను ఉద్దేశించి పాక్ విదేశాంగ మంత్రి మహమ్మద్ ఇషక్ దార్ హాట్ కామెంట్స్ చేశారు. ఆ వ్యాఖ్యలకు ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీస్ ఘాటుగా బదులిచ్చారు. యూఎన్ ఉగ్రవాద సంస్థల జాబితాలో ఉన్న 20 సంస్థలను దాయాది దేశం పాక్ పెంచి పోషిస్తోంది అని ఆరోపించారు. అలాగే, సీమాంతర ఉగ్రవాదాన్ని ఎగదోయడంతో పాటు ఉగ్రవాద వ్యతిరేక పోరులో ముందు వరుసలో ఉందని పాకిస్థాన్ చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. పాక్ చేసే ఉగ్ర కార్యకలాపాలకు మేం బాధితులం అయ్యామని పేర్కొన్నారు. అమాయక ప్రజలపై జరిగే ఉగ్రవాద చర్యలకు సమర్థించలేమన్నారు. ఉగ్రవాదుల్లో మంచి, చెడు అని తేడాలు ఉండవని చెప్పుకొచ్చారు. ఇలాంటి మాటలతో భద్రతా మండలి సమయాన్ని వృథా చేయొద్దని పాక్ మంత్రికి భారత ప్రతినిధి హరీస్ హితవు పలికారు.
Read Also: Komatireddy Venkat Reddy: ఓట్ల కోసం దేశాన్ని విడగొట్టే పార్టీ బీజేపీ
Also Read
- Offer for Gamers: వీడియో గేమ్ ఆడేవారికి రూ.1.38 కోట్ల ప్యాకేజీ.. డిగ్రీ అవసరం లేకుండానే ఉద్యోగం..
- India-Nepal Border Dispute: భారత్తో సరిహద్దు వివాదం.. ఒప్పంద పత్రాలు పోగొట్టుకున్న నేపాల్..
- Iran-Trump: ‘హార్ముజ్ మా కంట్రోల్లోనే ఉంది’.. ట్రంప్ వ్యాఖ్యలకు ఇరాన్ కౌంటర్
- Trump: ట్రంప్ ప్రభుత్వంలో కీలక మార్పు.. వైట్హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ ఔట్
అయితే, జమ్మూకశ్మీర్ ఎప్పుడూ భారత్లో అంతర్భాగమేనని భద్రతా మండిలిలో పర్వతనేని హరీస్ తేల్చి చెప్పారు. గత కొన్ని నెలల క్రితం జమ్మూకశ్మీర్లో జరిగిన ఎన్నికలతో పాటు కొత్త ప్రభుత్వం ఏర్పడటం గురించి తెలియజేశారు. కశ్మీర్ ప్రజల ఎంపిక చాలా క్లీయర్ గా ఉంది. పాకిస్థాన్ మాదిరిగా కాకుండా అక్కడ ప్రజాస్వామ్యం బలంగా పరిణవిల్లుతుంది అన్నారు. కశ్మీర్ అంశానికి సంబంధించి పాకిస్థాన్ తన మొండి వాదనను ఆపివేయాలని హెచ్చరించారు. కశ్మీరీలు తమ ప్రజాస్వామ్య హక్కులు వినియోగించుకోవడానికి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానాలను భారత్ అమలు చేయాలని పాకిస్థాన్ కోరింది. ఇందులో భాగంగానే, కశ్మీర్లో ప్రజాభిప్రాయ సేకరణకు అనుమతించాలని కోరుతూ పాక్ పార్లమెంట్ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది.
తాజావార్తలు
-
Offer for Gamers: వీడియో గేమ్ ఆడేవారికి రూ.1.38 కోట్ల ప్యాకేజీ.. డిగ్రీ అవసరం లేకుండానే ఉద్యోగం..
-
Renukaswamy Murder: నటుడు దర్శన్కు బిగుస్తోన్న ఉచ్చు.. సహ నిందితుడి సంచలన వాంగ్మూలం
-
BE ALERT: అనకాపల్లిలో దారుణం.. బాలికపై లైంగిక దాడి, తల్లిపైనా పోక్సో కేసు
-
Khiladi Wife: పక్కా ప్లాన్ చేసింది.. భర్తను లేపేసింది..
-
Rahul Gandhi: ఇటలీ ప్రధాని మెలోనీని టార్గెట్ చేసిన కాంగ్రెస్.. రాహుల్ గాంధీ వీడియో వైరల్
ట్రెండింగ్
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
5,000 నిట్స్ డిస్ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Money Plant Growing Tips: మానీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!