Himalayas: పొంచి ఉన్న ముప్పు.. 65 శాతం వేగంగా కరుగుతున్న హిమాలయ హిమానీనదాలు….
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Himalayas: దాదాపు రెండు బిలియన్ల మంది ప్రజలకు కీలకమైన నీటిని అందిస్తున్న హిమాలయ హిమనీనదాలు(గ్లేసియర్స్) అత్యంత వేగంగా కరుగుతున్నాయి.ఈ పరిణామం రానున్న రోజుల్లో హిమాలయాలపై ఆధారపడి ఉన్న దేశాలకు తీవ్ర ప్రమాదం పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాతావరణ మార్పుల కారణంగా హిమాలయ గ్లేసియర్స్ అనూహ్యంగా కరిగిపోతున్నట్లు శాస్త్రవేత్తలు మంగళవారం హెచ్చరించారు. ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ మౌంటైన్ డెవలప్మెంట్ (ICIMOD) నివేదిక ప్రకారం.. గత దశాబ్ధంతో పోలిస్తే 2011 నుంచి 2020 వరకు 65 శాతం వేగంగా గ్లేసియర్స్ కనుమరుగవుతున్నాయి.
వాతావరణం వేడెక్కుతున్న కొద్ధీ మంచు కరుగుతోంది. ఇది మనం ఊహించిన దానికన్నా ఆందోళన కలిగించే వేగంతో కరుగుతున్నట్లు ప్రధాన రచయిత పిలిప్సస్ వెస్టర్ చెప్పారు. హిందూ కుష్ హిమాలయ ప్రాంతంలోని హిమనీనదాలు పర్వత ప్రాంతాల్లో సమారు 240 కోట్ల మంది ప్రజలతో పాటు దిగువన ఉన్న 165 కోట్ల ప్రజలకు హిమాలయాల నుంచి వచ్చే నీరే కీలక వనరుగా ఉందని నివేదిక పేర్కొంది.
Also Read
- Pakistan: చేతులెత్తేసిన పాకిస్థాన్ ప్రభుత్వం.. అవస్థలు పడుతున్న జనం! ఏం జరిగిందంటే..
- Russia: చమురు మార్కెట్ను భారత్ శాసిస్తుంది.. రష్యా సంచలన వ్యాఖ్యలు..
- US Tailor Income: గంటకు అన్ని వేలా ? అమెరికా టైలర్ గంట సంపాదన చూసి నెటిజన్లు షాక్! వైరల్ వీడియో..
- Donald Trump: గూగుల్, చాట్జీపీటీలకు షాక్.. కంపెనీల్లో వాటాలు అడుగుతున్న డొనాల్డ్ ట్రంప్!
Read Also: Rs.2000 Note Withdrawal: రూ. 2000 నోటు ఉపసంహరణ మంచిదే.. జీడీపీ వృద్ధిని పెంచవచ్చు..
ప్రస్తుతం వెలువడుతున్న ఉద్గారాల ప్రకారం.. ఈ శతాబ్ధం చివరి నాటికి హిమనీనదాలు వాటి ప్రస్తుత పరిమాణంలో 80 శాతం కోల్పోవచ్చని ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, భూటాన్, చైనాల, భారతదేశం, మయన్మార్ , పాకిస్తాన్ సభ్యదేశాలగా ఉన్న నేపాల్ కు చెందిన ICIMOD తెలిపింది. హిమానీనదాలు గంగ, సింధు, ఎల్లో, మెకాంగ్, ఐరావడ్డీ నదులతో పాతటు 10 ముఖ్యమైన నదుల వ్యవస్తకు కీలకం. ప్రత్యక్షంగా, పరోక్షంగా బిలియన్ల మందికి ఆహారం, శక్తి, స్వచ్ఛమైన గాలి, ఆదాయాన్ని అందిస్తున్నాయి.
పారిస్ వాతావరణ ఒప్పందంలో భాగంగా గ్లోబల్ వార్మింగ్ 1.5 నుంచి 2.0 డిగ్రీలకు పరిమితమైనప్పటీకీ.. హిమనీనదాలు 2100 నాటికి వాటి పరిమాణంలో మూడింట నుంచి సగం వరకు కోల్పోతాయని అంచనా వేశారు. 1800ల మధ్యకాలం నుండి ప్రపంచం సగటున దాదాపు 1.2 C వేడెక్కింది, తీవ్రమైన హీట్వేవ్లు, మరింత తీవ్రమైన కరువులు మరియు తుఫానులతో సహా తీవ్ర వాతావరణంపై ప్రభావం చూపుతున్నాయి. సాంకేతికతలను మెరుగుపరచడం, హై రిజల్యూషన్ ఉపగ్రహ చిత్రాల అంచనాలో ఈ ప్రభావాలను అంచనా వేయవచ్చని వెస్టర్ తెలిపారు.
తాజావార్తలు
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!