Israel-hamas War: ఇజ్రాయిల్తో యుద్ధానికి మేము సిద్ధం.. హిజ్బుల్లా సంచలన ప్రకటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel-hamas War: గత శనివారం ఇజ్రాయిల్ పై పాలస్తీనా హమాస్ ఉగ్రవాదులు దారుణ దాడికి పాల్పడ్డారు. కేవలం 20 నిమిషాల వ్యవధిలోనే 5000 రాకెట్లను ప్రయోగించారు. ఏం జరుగుతుందో అర్థమయ్యే లోపే గాజా నుంచి ఇజ్రాయిల్ లోకి ప్రవేశించిన హమాస్ మిలిటెంట్లు సామాన్య ప్రజలపై విరుచుకుపడ్డారు. గాజాకు సరిహద్దుల్లో ఉన్న ఇజ్రాయిల్ కిబ్బుట్జ్లో మారణహోమాన్ని సృష్టించారు. హమాస్ దాడుల్లో ఇజ్రాయిల్ వైపు 1200 మందికి పైగా మరణించగా.. 150 మందిని ఉగ్రవాదులు బందీలుగా పట్టుకుని గాజా ప్రాంతానికి తీసుకెళ్లారు. మరోవైపు గాజా స్ట్రిప్ పై ఇజ్రాయిల్ వైమానిక దాడుల్లో వేల సంఖ్యలో ప్రజలు మరణించారు. ఇప్పటి వరకు యుద్ధంలో 3200 మంది మరణించారు.
ఇదిలా ఉంటే ఒక్క హమాస్ ఉగ్రవాదుల నుంచి గాజా వైపు నుంచే కాకుండా ఉత్తరాన ఉన్న లెబనాన్ నుంచి కూడా ఇజ్రాయిల్ దాడుల్ని ఎదుర్కొంటోంది. ఇరాన్ మద్దతు ఉన్న లెబనాన్ మిలిటెంట్ సంస్థ హిజ్బుల్లా కూడా తాము ఇజ్రాయిల్ పై యుద్ధం చేస్తామని ప్రకటించింది. సరైన సమయం వచ్చినప్పుడు ఇజ్రాయిల్ తో జరిగే యుద్ధంలో హమాస్ తో చేరేందుకు సిద్ధంగా ఉన్నామని హిజ్బుల్లా డిప్యూటీ చీఫ్ నయీమ్ కస్సెమ్ శుక్రవారం సంచలన ప్రకటన చేశారు.
Also Read
- Denmark: డెన్మార్క్లో అజాన్పై బ్యాన్.. ఇస్లామీకీకరణపై ఆందోళన..
- Middle East Tensions: మిడిల్ ఈస్ట్లో మరో భీకర యుద్ధానికి స్క్రిప్ట్.. ఇజ్రాయెల్ లక్ష్యంగా ఇరాన్ ‘షాడో వార్’!
- Giorgia Meloni: మెలోని ఢిల్లీలో పోటీ చేస్తే లక్షల ఓట్లు గ్యారెంటీ..
- India-Bangladesh: బంగ్లాదేశ్ పౌరులకు గుడ్న్యూస్.. టూరిస్ట్ వీసాల జారీకి భారత్ గ్రీన్ సిగ్నల్
Read Also: India vs Pakistan Match Live Updates: దాయాదుల సమరం లైవ్ అప్డేట్స్..
పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, గాజా స్ట్రిప్లోని హమాస్ స్థావరాలపై ఇజ్రాయిల్ చేసిన వైమానిక దాడుల్లో 1900 మంది చనిపోయారు. ఇందులో 600 మందికి పైగా పిల్లలు ఉన్నట్లు తెలిపింది. లెబనాన్ రాజధాని బీరూట్ లో పాలస్తీనాకు అనుకూలంమగా జరిగిన ర్యాలీలో ఖస్సెమ్ ఈ వ్యాఖ్యలు చేశారు. మేము పూర్తిగా సిద్ధంగా ఉన్నాం, సమయం వచ్చినప్పుడు యుద్ధంలో చేరుతామని అన్నారు. ప్రధానంగా అరబ్ దేశాలు, ఐక్యరాజ్యసమితి, ఇతర దేశాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా జోక్యం చేసుకోవద్దని మమ్మల్ని కోరినా, మా నిర్ణయాన్ని ప్రభావితం చేయదని హిజ్బుల్లా చీఫ్ వెల్లడించారు.
శుక్రవారం బీరూట్లో 1000 మందికి పైగా హిజ్బుల్లా మద్దతుదారులు పాలస్తీనా జెండాను పట్టుకుని వారికి సంఘీభావంగా ర్యాలీలు చేశారు. మరోవైపు ఇజ్రాయిల్ దక్షిణ లెబనాన్ పై జరిపిన దాడుల్లో రాయిటర్స్ జర్నలిస్టు మరణించాడు. మరో ముగ్గురు గాయపడ్డారు. బుధవారం లెబనాన్ గ్రామం దైరా సమీపంలో ఉన్న ఇజ్రాయిల్ స్థావరాన్ని హిజ్బుల్లా లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది.
తాజావార్తలు
-
Denmark: డెన్మార్క్లో అజాన్పై బ్యాన్.. ఇస్లామీకీకరణపై ఆందోళన..
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
YouTube vs Instagram: డబ్బు సంపాదించాలంటే ఇన్స్టా బెస్ట్ ఆ? యూట్యూబ్ బెస్ట్ ఆ? ఈ లెక్కలు చూస్తే షాకవుతారు!
-
Ketan Agarwal Case: కేతన్ను లోయలోకి తోసేముందు చేతన్ ఏమన్నాడో తెలుసా.. వెలుగులోకి కొత్త విషయాలు
-
Ketan Agarwal Case: కేతన్-సియా కేసులో కొత్త ట్విస్ట్.. బ్లాక్మెయిల్ కోణంలో దర్యాప్తు..
ట్రెండింగ్
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!