Japan Floods: జపాన్ను ముంచెత్తిన వరదలు.. ఎమర్జెన్సీ అలర్ట్ జారీ
- జపాన్ను ముంచెత్తిన వరదలు
- నీట మునిగిన ఇళ్లు.. నిలిచిన విద్యుత్
- ఎమర్జెన్సీ అలర్ట్ జారీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తర జపాన్పై ప్రకృతి మరోసారి ప్రకోపించింది. ఇప్పటికే ఈ ఏడాది ప్రారంభంలో భారీ భూకంపంతో కోలుకోలేని దెబ్బ తగిలింది. దాంట్లో నుంచి ఇప్పుడిప్పుడే బయట పడుతున్న తరుణంలో మరోసారి ప్రకృతి కన్నెర్ర జేసింది. శనివారం జపాన్లోని ఉత్తర మధ్య ప్రాంతమైన నోటోలో భారీ వర్షం కురిసింది. కొండచరియలు విరిగిపడ్డాయి. నదులు ఉప్పొంగి ప్రవహించాయి. మరోవైపు వరదలు ఇళ్లను ముంచెత్తాయి. దీంతో ప్రజలు వరదల్లో చిక్కుకుని తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బయటకు వెళ్లే పరిస్థితులు లేవు. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. వాజిమాలో ఒకరు తప్పిపోయినట్లు అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఇది కూడా చదవండి: Love jihad: ‘లవ్ జిహాద్’ ముఠా గుట్టురట్టు.. ఇన్స్టాలో ఫేక్ ఐడీలతో స్నేహం కట్ చేస్తే..
Also Read
- Iran-US War: మరోసారి యుద్ధం తీవ్రం.. ఖర్గ్ ద్వీపం దగ్గర భారీ పేలుళ్లు.. ఇరాన్ ఆయిల్ ట్యాంకర్పై అమెరికా దాడి!
- UN: ఫలించిన భారత్ పోరాటం.. నవంబర్ 27 అంతర్జాతీయ బాల్య వివాహాల నిర్మూలన దినోత్సవంగా ప్రకటన
- South Africa: దక్షిణాఫ్రికా అధ్యక్షుడు రమఫోసాకు పొంచి ఉన్న అభిశంసన ముప్పు! స్కామ్ ఏంటంటే..!
- Nepal Flash Floods: నేపాల్ను వెంటాడుతున్న ప్రకృతి విపత్తు.. దార్చులాలో విరిగిపడిన కొండచరియలు
ఇక హోకురి ప్రాంతంలో భారీ కుండపోత వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. రెయిన్బ్యాండ్ల కారణంగా ఆదివారం మధ్యాహ్నం నుంచి వచ్చే 24 గంటల్లో ఈ ప్రాంతంలో 20 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని జేఎంఏ తెలిపింది. ఇప్పటి వరకు భారీ వర్షం కారణంగా ఎలాంటి గాయాలు కాలేదని సమాచారం. వాజిమాలోని రెండు జిల్లాల్లోని కొంతమంది నివాసితులు కొండచరియలు విరిగిపడటంతో చిక్కుకుపోయారని తెలుస్తోంది. బురద నీటితో నిండిన పలు రహదారులు మూసుకుపోయాయి. దాదాపు 6,500 ఇళ్లకు విద్యుత్ సరఫరా లేదని హోకురికు ఎలక్ట్రిక్ పవర్ కంపెనీ తెలిపింది. సమీపంలోని ఉత్తర ప్రాంతాలైన నీగాటా మరియు యమగటాలలో కూడా భారీ వర్షం కురిసింది.
ఇది కూడా చదవండి: Amar Preet Singh: ఎయిర్ స్టాఫ్ చీఫ్గా అమర్ ప్రీత్ సింగ్ నియామకం
ఈ ప్రాంతంలో జనవరి 1న 7.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీంతో 370 మందికి పైగా మరణించారు. రోడ్లు మరియు ఇతర కీలకమైన మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి. స్థానిక పరిశ్రమ, ఆర్థిక వ్యవస్థ, రోజువారీ జీవితాలను ప్రభావితం చేశాయి.
తాజావార్తలు
-
Sekhar Master: నా పుట్టు పూర్వోత్తరాలపై నిందలేస్తారా? జానీ మాస్టర్ భార్య బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందే
-
Ganesh Mandapam: వినాయక మండపాలపై కీలక ఆదేశాలు.. ఇవి తప్పనిసరిగా పాటించాల్సిందే..
-
Subhash Chandra: లోన్ మోసం కేసులో షాక్.. జీ గ్రూప్ అధినేత సుభాష్ చంద్రపై సీబీఐ ఎఫ్ఐఆర్.. ఆరోపణలు ఇవే!
-
CM Revanth Reddy : హైదరాబాద్లో AI దూకుడు.. రూ.70 వేల కోట్ల మెగా డీల్..!
-
Uttar Pradesh: గాజాలో లాగా మసీదులు కూలుస్తున్నారు.. బీజేపీపై సమాజ్వాదీ పార్టీ ఫైర్..
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!