Global Warming: కరోనాకి మించిన విపత్తు.. 2 నిమిషాలకి ఒకరు దుర్మరణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Health At The Mercy Of Fossil Fuels: కరోనా వైరస్ కారణంగా ప్రపంచదేశాలు ఎలా వణికిపోయాయో అందరికీ తెలుసు. లక్షలాది మంది ప్రాణాలు కోల్పోవడంతో పాటు ఆర్థిక సంక్షోభంతో చాలా దేశాలు అల్లాడిపోయాయి. ఇప్పటికీ ఈ వైరస్ ప్రభావం కొన్ని దేశాలపై ఉంది. అయితే.. ఈ వైరస్కి మించిన మరో విపత్తు, ప్రాణాలను హరిస్తోందని ఓ పరిశోధనలో తేలింది. బొగ్గు, చముకు, గ్యాస్ వంటి శిలాజ ఇంధనాలను విపరీతంగా వాడుతుండటంతో.. గ్లోబల వార్మింగ్ పెరిగిపోయి, లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారని వెలుగులోకి వచ్చింది. ఒక్క భారత్లోనే 2 నిమిషాలకు ఒకరు ప్రాణాలు కోల్పోతున్నారని ‘ద లాన్సెట్ కౌంట్డౌన్ ఆన్ హెల్త్ అండ్ క్లైమేట్ చేంజ్’ అనే నివేదిక వెల్లడించింది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రపంచ వాతావరణ సంస్థ వంటి 50 సంస్థలకు చెందిన 99 మంది నిపుణులు కలిసి ఈ నివేదనకు రూపొందించారు. పరిస్థితులు ఇప్పుడే ఇంత ఘోరంగా ఉంటే, రానున్న రోజుల్లో మరింత తీవ్ర పరిణామాలు తప్పవని ఆ నివేదిక హెచ్చరిస్తోంది. మరి, ఈ పరిస్థితిని అదుపు చేయాలంటే ఎలా? శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించాలని ఆ నివేదిక సూచిస్తోంది. అలాగే.. ఆరోగ్య కార్యక్రమాలపై మరింత దృష్టిపెట్టాలని ప్రపంచ దేశాల ప్రభుత్వాలకు సలహా ఇస్తున్నారు. అలా కాకుండా శిలాజ ఇంధనాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తే మాత్రం.. ఆహార భద్రత, అంటు వ్యాధుల వ్యాప్తి, ఉష్ణోగ్రత వల్ల కలిగే వ్యాధులు, విద్యుత్తు సంక్షోభం, గాలి కాలుష్యం వంటివి విపరీతంగా పెరిగిపోయి, మహా విపత్తు తలెత్తుతుందని హెచ్చరిస్తున్నారు. అప్పుడు మరణాల రేటు గణనీయంగా పెరుగుతాయని నిపుణులు అంటున్నారు. కాబట్టి.. వీలైనంత త్వరగా చర్యలు తీసుకోవాలని, లేకపోతే వినాశనం తప్పదని చెప్తున్నారు.
Also Read
- WMO Warning: ప్రమాదకర ఎల్నినో రాబోతుంది.. ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరిక
- Marco Rubio: ఇరాన్ అణు చర్చలపై మార్కో రూబియో కీలక వ్యాఖ్యలు.. పశ్చిమాసియా శాంతించేనా?
- US: అమెరికా ఇంటెలిజెన్స్ చీఫ్గా విలియం జె.పుల్టే నియామకం.. ట్రంప్ అభినందనలు
- Trump: ‘ఐ లవ్ ఇండియా.. ఐ లవ్ మోడీ’’ సోషల్ మీడియాలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. ఆసక్తి రేపుతోన్న కామెంట్స్
ఈ శిలాజ ఇంధనాల వాడకం వల్ల ఏర్పడే కాలుష్యం కారణంగా.. గతేడాదిలో భారత్లో 3,30,000 మంది ప్రాణాలు కోల్పోయారని ఆ నివేదిక వెల్లడించింది. దాన్ని బట్టి.. ప్రతి 2 నిమిషాలకు 1.2 మంది చనిపోయినట్లు తెలుస్తోంది. గతేడాదిలోనే చైనాలో 3,80,000 మరణాలు సంభవించగా.. ఐరోపాలో 1,17,000 మంది, అమెరికాలో 32 వేల మంది మరణించారు. ఈ శతాబ్దం చివరి నాటికి గ్లోబల్ వార్మింగ్ 2.7 డిగ్రీల సెల్సియస్ పెరగనుందని.. ప్రస్తుతం 1.1 డిగ్రీ సెల్సియస్ ఉన్నందుకే ప్రపంచం అతలాకుతలమవుతోందని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రపంచ దేశాలు ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఈ సమస్యని గాలికొదిలేస్తే మాత్రం.. గ్లోబల్ వార్మింగ్ మరింత పెరిగి, దారుణమైన పరిస్థితుల్ని చవిచూడాల్సి వస్తుందంటున్నారు. శిలాజ ఇంధనాలకు రాయితీలు ఇవ్వడం తగ్గించాలని సూచిస్తున్నారు.
తాజావార్తలు
-
KTR: “తెలంగాణ కంటే అభివృద్ధి చెందిన రాష్ట్రం చూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా”.. కాంగ్రెస్, బీజేపీకి సవాల్.!
-
IRUMUDI Glimpse : ఇరుముడి గ్లిమ్స్ రిలీజ్.. రవితేజకు హిట్ గ్యారంటీ
-
Power Saving Tips: ఏసీ కాదు..కూలర్ కాదు.. మీ సీలింగ్ ఫ్యాన్తోనే కరెంట్ బిల్లు వాచిపోద్ది..ఎలాగంటే?
-
Suriya : టి.జె. జ్ఞానవేల్ దర్శకత్వంలో ఐదు రూపాయల డాక్టర్ బయోపిక్లో సూర్య..
-
Nellore Politics: గ్రౌండ్ వర్క్ స్టార్ట్.. రాజకీయాల్లోకి ప్రముఖ నాయకుల కూతుళ్లు, కోడళ్లు!
ట్రెండింగ్
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!