Global Warming: కరోనాకి మించిన విపత్తు.. 2 నిమిషాలకి ఒకరు దుర్మరణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Health At The Mercy Of Fossil Fuels: కరోనా వైరస్ కారణంగా ప్రపంచదేశాలు ఎలా వణికిపోయాయో అందరికీ తెలుసు. లక్షలాది మంది ప్రాణాలు కోల్పోవడంతో పాటు ఆర్థిక సంక్షోభంతో చాలా దేశాలు అల్లాడిపోయాయి. ఇప్పటికీ ఈ వైరస్ ప్రభావం కొన్ని దేశాలపై ఉంది. అయితే.. ఈ వైరస్కి మించిన మరో విపత్తు, ప్రాణాలను హరిస్తోందని ఓ పరిశోధనలో తేలింది. బొగ్గు, చముకు, గ్యాస్ వంటి శిలాజ ఇంధనాలను విపరీతంగా వాడుతుండటంతో.. గ్లోబల వార్మింగ్ పెరిగిపోయి, లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారని వెలుగులోకి వచ్చింది. ఒక్క భారత్లోనే 2 నిమిషాలకు ఒకరు ప్రాణాలు కోల్పోతున్నారని ‘ద లాన్సెట్ కౌంట్డౌన్ ఆన్ హెల్త్ అండ్ క్లైమేట్ చేంజ్’ అనే నివేదిక వెల్లడించింది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రపంచ వాతావరణ సంస్థ వంటి 50 సంస్థలకు చెందిన 99 మంది నిపుణులు కలిసి ఈ నివేదనకు రూపొందించారు. పరిస్థితులు ఇప్పుడే ఇంత ఘోరంగా ఉంటే, రానున్న రోజుల్లో మరింత తీవ్ర పరిణామాలు తప్పవని ఆ నివేదిక హెచ్చరిస్తోంది. మరి, ఈ పరిస్థితిని అదుపు చేయాలంటే ఎలా? శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించాలని ఆ నివేదిక సూచిస్తోంది. అలాగే.. ఆరోగ్య కార్యక్రమాలపై మరింత దృష్టిపెట్టాలని ప్రపంచ దేశాల ప్రభుత్వాలకు సలహా ఇస్తున్నారు. అలా కాకుండా శిలాజ ఇంధనాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తే మాత్రం.. ఆహార భద్రత, అంటు వ్యాధుల వ్యాప్తి, ఉష్ణోగ్రత వల్ల కలిగే వ్యాధులు, విద్యుత్తు సంక్షోభం, గాలి కాలుష్యం వంటివి విపరీతంగా పెరిగిపోయి, మహా విపత్తు తలెత్తుతుందని హెచ్చరిస్తున్నారు. అప్పుడు మరణాల రేటు గణనీయంగా పెరుగుతాయని నిపుణులు అంటున్నారు. కాబట్టి.. వీలైనంత త్వరగా చర్యలు తీసుకోవాలని, లేకపోతే వినాశనం తప్పదని చెప్తున్నారు.
Also Read
ఈ శిలాజ ఇంధనాల వాడకం వల్ల ఏర్పడే కాలుష్యం కారణంగా.. గతేడాదిలో భారత్లో 3,30,000 మంది ప్రాణాలు కోల్పోయారని ఆ నివేదిక వెల్లడించింది. దాన్ని బట్టి.. ప్రతి 2 నిమిషాలకు 1.2 మంది చనిపోయినట్లు తెలుస్తోంది. గతేడాదిలోనే చైనాలో 3,80,000 మరణాలు సంభవించగా.. ఐరోపాలో 1,17,000 మంది, అమెరికాలో 32 వేల మంది మరణించారు. ఈ శతాబ్దం చివరి నాటికి గ్లోబల్ వార్మింగ్ 2.7 డిగ్రీల సెల్సియస్ పెరగనుందని.. ప్రస్తుతం 1.1 డిగ్రీ సెల్సియస్ ఉన్నందుకే ప్రపంచం అతలాకుతలమవుతోందని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రపంచ దేశాలు ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఈ సమస్యని గాలికొదిలేస్తే మాత్రం.. గ్లోబల్ వార్మింగ్ మరింత పెరిగి, దారుణమైన పరిస్థితుల్ని చవిచూడాల్సి వస్తుందంటున్నారు. శిలాజ ఇంధనాలకు రాయితీలు ఇవ్వడం తగ్గించాలని సూచిస్తున్నారు.
తాజావార్తలు
-
Mahesh Babu: మహేష్ బాబును కలిసిన స్టార్ డైరెక్టర్.. కథ కూడా చెప్పేశాడు?
-
‘Koh-e-Zafar’ Friendship Dinner: భారత్కు అఫ్గానిస్థాన్ ప్రత్యేక విందు.. ‘కోహ్-ఏ-జఫర్’ పేరుతో ఫ్రెండ్షిప్ డిన్నర్.!
-
43 Jersey Cows Gifted to Bhutan: భూటాన్కు భారత్ ప్రత్యేక బహుమతి.. 43 స్వచ్ఛమైన జెర్సీ ఆవులు అందజేత
-
Vaibhav Sooryavanshi: బచ్చా ఆడేందుకు రెడీగా ఉన్నాడు.. వైభవ్ తండ్రి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
YS Jagan: నేడు వైసీపీ జిల్లా అధ్యక్షులతో వైఎస్ జగన్ కీలక భేటీ.. ప్రధాన అజెండా ఇదే
ట్రెండింగ్
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!